Connect with us

devotional

Sri Ramayanam : రామాయణం తరువాత రాముడు ఎలా చనిపోయాడు?, సీతా దేవి బాధతో జీవితాన్ని ఎలా ముగించింది? లక్ష్మణుడు ఎలా వెళ్లిపోయాడు!

Published

on

Sri Ramayanam : మన దేశంలో హిందూ మత విశ్వాసకులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం, మహాభారతం. ఈ రెండు ఇతిహాసాల్లోని అనేక విషయాలు నేటికీ మనం ఆచారిస్తున్నాం. ఏదోక సందర్బంలో మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. ఇప్పటి వరకు మనం వింటున్న అనేక నీతి కథలలో ఎక్కడో ఒకచోట రామయాణం, మహాభారతం స్ఫూర్తి ఉంటుంది. ఇక రామయణం అనగానే రాముడు మనకు చూపించిన మార్గం. రాముడు నడిచిన ధర్మం అనే మార్గంలో మనం ఉండాలని రామాయణం మనకు సూచిస్తుంది. రామాయణంలో మనం తెలుసుకునే అంశాలు రాముడి జననం, సీతా రామ కళ్యాణం, రామపట్టాభిషేకం, రావణ సంహారం ఇవన్నీ రామాయణంలో మనకు తెలుసు. అయితే రాముడు ఆ తరువాత అయోధ్య ను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఇక రాముడు విష్షు అంశతో పుట్టినవాడైనా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆయనకు మరణం లేదా నిర్యానం ఉండాలి. మరి వాటి గురించి మనలో చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సీత, రాముడు, లక్ష్మణుల నిర్యానం…

రాముడు వనవాసం వెళ్లడం, అక్కడ సీత ను రావనాసురుడు అపహరించడం, ఆ తరువాత రావణ సంహారం మళ్ళీ అయోధ్యకు రావడం, శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక శ్రీరాముడు అయోధ్య పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు చేశారు. అయితే ఎంత మంచి పాలన చేసినా లోకులు కాకులు అన్న చందంగా సీతా దేవి గురించి తప్పుగా మాట్లాడటం, అది రాముడి వరకు చేరడంతో ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలి రమ్మని తమ్ముడు లక్ష్మణుడిని అజ్ఞాపిస్తాడు. ఇక అలా సీతా దేవి ఎడబాటుతో రాముడు అయోధ్య పాలన సాగించగా సీతా దేవి కవల పిల్లలైన ‘లవ కుశ’ లకు జన్మనిస్తుంది. ఇక రాముడు ఒకసారి అశ్వమేధ యాగం చేయాలని భావించి తన రాజ్యంలోని మునీశ్వరులకు ఇతర రాజులకు అందరికీ ఆహ్వానం పంపగా అలా వాల్మీకి మహర్షి తన శిష్యులతో పాటు అయోధ్య చేరుకోగా, వాల్మీకి శిష్యులయిన లవకుశలు అక్కడికి వెళ్తారు.

Advertisement

అక్కడ రామాయణం గానం చేయగా రాముడు కంట పడి వాళ్ళు తన కుమారులు అన్న విషయం గ్రహించిన రాముడు వాల్మీకి మహర్షి తో సీతా దేవి పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది కానీ తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పగా సీతా దేవిని అయోధ్యకు పిలిపిస్తారు వాల్మీకి. ఇక అక్కడ ఆమె మరోసారి ఆమె పవిత్రతను నిరూపించుకోడానికి తన తల్లి భూదేవి లో కలిసిపోతుంది. అలా సీతా దేవి నిర్యానం చెందగా ఊహించని ఆ పనికి రాముడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఏడుస్తాడు. దుఃఖాన్ని అనచుకుని అయోధ్య పాలన సాగిస్తున్న రాముడికి ఓకనాడు ఒక మునీశ్వరుడు వచ్చి తనతో ఏకాంతంగా మాట్లాడాలని మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును వధించాల్సిందిగా మాట తీసుకుంటాడు. ఇక ఆ ముని ఎవరో కాదు యమధర్మ రాజు. ఆయన మీరు నిర్యానం చెందవలసిన సమయం వచ్చింది అంటూ రాముడికి చెప్పగా బయట ఎవరూ రాకుండా కాపలాగా ఉన్న లక్ష్మణుడి చెంతకు ధుర్వాస మహర్షి వచ్చి రాముడి కలవాలని అడుగగా కాసేపు ఆగమని చెబుతాడు. కానీ ధుర్వాస మహర్షి కి కోపం వచ్చి అయోధ్య అగ్నికి అహుతి అయ్యేలా శపిస్థానని చెప్పడంతో విధిలేక అన్న వద్దకు వెళ్తాడు.

అది చూసి యమధర్మ రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇచ్చిన మాట కోసం రాముడు లక్ష్మణుడిని వధించలేక అన్నీ త్యజించి రాజ్యం నుండి వెళ్లిపోవాలని అది మరణ శిక్షకు సమానం కావున అలా అజ్ఞాపిస్తాడు. అన్న నా వల్ల మాట తప్పాడన్న బాధతో లక్ష్మణుడు సరయు నదిలో దూకి నిర్యానం చెందారు. ఇక తమ్ముడి మరణం తరువాత శ్రీ రాముడు తమ్ముడు భరతుడికి పాలన అప్పగించి తాను ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. అయితే భరతుడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి లవ కుశ లకు అప్పగించి తాను అన్న వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకోగా శత్రుఘ్నుడు కూడా అదే నిర్ణయం తీసుకోగా వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ రాముడు వానరులు, తమ్ముళ్ల తో కలిసి సరయు నదిలో నిర్యానం చెంది విష్ణు రూపంలో దర్శనమిచ్చి పునీతులను చేసారు.

Continue Reading
Advertisement

devotional

Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.

Advertisement

ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

devotional

Donates: ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు కనుక ఇచ్చారో అప్పలపాలు అయినట్టే?

Published

on

Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.

ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.

పుణ్యం కలుగుతుంది..

Advertisement

అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

devotional

Lakshmi Devi: ఇలాంటి సంకేతాలు మీకు కనబడుతున్నాయా… మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే?

Published

on

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.

మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.

ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

Advertisement

నల్ల చీమలు సంపదకు సూచిక…

ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!