Sri Reddy: ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఊహించని విధంగా జరిగాయి. ఈ ఎన్నికలలో భాగంగా కూటమి ఏర్పడి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోలుకోలేని దెబ్బ కొట్టాయని చెప్పాలి. గత ఎన్నికలలో 151 సీట్లతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డిని ఈసారి కేవలం కూటమి 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసిందని చెప్పాలి.

ఇలా ఎవరూ కూడా ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు రావడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీ అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారని చెప్పాలి. ఇలా వైఎస్సార్సీపి పార్టీ ఓటమిపై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డి ఓటమిపై స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. గెలిచినా ఓడిన జగనన్నను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ఎవరు బాధపడొద్దు.. ఎత్తండి రా తల కాలర్ ఎగరవేయండి.ధైర్యంగా నిలబడరా.. ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ అన్న తాలూకా అని చెప్పరా.. ఆయన సైన్యంగా మేమంతా జగన్ అన్నతో ఉంటాం. జై YSRCP. అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
జగనన్న తాలూకా..
ఇలా జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవడంతో ఎంతోమంది ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఓటమి అయినా గెలుపు అయినా మేము మీతోనే జగనన్న అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఓటమిపై జగన్ కూడా స్పందిస్తూ ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్త కాదని అయినప్పటికీ తన గొంతు మాత్రం పేదల కోసం వినిపిస్తానంటూ అందరిలో ధైర్యం నింపారు.





























