Star Heroin: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావాలన్న లేదా హీరోయిన్లుగా కొనసాగాలన్న తప్పని సరిగా గ్లామర్ షో చేయడం అవసరం. ఇలా ఇండస్ట్రీలో గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలా గ్లామర్ షో చేయడానికి కుదరదు అంటూ కొన్ని నియమాలను కనుక పెట్టుకుంటే అలాంటి వారికి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనగడ ఉండదని చెప్పాలి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి సనన్. ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టాలన్న ఆలోచనలు ఉన్న సమయంలో తన తల్లి మాత్రం తనకి గ్లామర్ షో విషయంలో భారీ కండిషన్ లు పెట్టినట్టు తెలుస్తుంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి గ్లామర్ షో చేయకుండా, బోల్డ్ సన్నివేశాలలో నటించకుండా ఉండాలని ఇలాంటివన్నీ తన కుటుంబంలో నచ్చవంటూ ఈమె తనకు వార్నింగ్ ఇచ్చారట.
ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు తన తల్లి తనకు అన్ని కండిషన్ లు పెట్టిందంటూ తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.అయితే తన తల్లి పెట్టిన కండిషన్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.ఈమె తెలుగులో నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన కథాచిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా…లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఈ సినిమాలో ఈమె సీత పాత్రలో నటిస్తోంది.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…