Suchitra Chandrabos :పాటలో వచ్చే సంగీతానికి పాదం కదిపితే..ఆ పాటకు వచ్చేవన్నే అంతా ఇంతా కాదు. ఒకరు పదం రాస్తే.. ఇంకొకరు పాదం కదుపుతారు. ఆ ఇద్దరు ఎవరో కాదు సినీ పరిశ్రమతో పెనవేసుకున్న జంట సుచిత్ర, చంద్రబోస్. వీరి ప్రేమ వివాహం గురించి ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే.ఎందుకో ఏమో గాని పెళ్లయిన తర్వాత సుచిత్రకు మొత్తానికి మొత్తంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇంట్లో కూర్చోవడం అంటే ఆమెకు ఒక విధంగా బోర్ కొట్టేది. అటువైపుగా చూస్తే అన్నపూర్ణ స్టూడియో.. అందులో అనేక సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ బిజీగా ఉన్న రోజులు గుర్తుకు వచ్చేవి. ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటే.. తాను కొరియో గ్రాఫర్ గా చేసిన పాటలే వచ్చేవి.. వాటిని చూస్తూ రోజంతా గడపడం ఆవిడకి నచ్చలేదు.
Advertisement
ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోను ఒక్కసారి రింగ్ అయ్యేది. తీరా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే చంద్రబోస్ ఉన్నారా? అంటూ ఏదో సినిమా కబురు వచ్చేది. మళ్లీ నిరాశే.. అలా ఒక దశలో చాలా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళేది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్వయంగా ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర వెల్లడించారు. అలా కొన్ని నెలలు నాకు తెలియకుండానే గడిచిపోయాయి. చుట్టూ నిరాశ, నిస్పృహలు అలుముకున్న సమయంలో.. ఒక్కసారిగా ఫోన్ రింగ్ మనీ మోగింది. తీరా చూస్తే అది ఎవరో కాదు. తమిళ దర్శకుడు వసంత్ దగ్గర నుంచి వచ్చింది. ఒకప్పుడు మేమిద్దరం ఒకే తమిళ సినిమాకి పనిచేశాం. ఆ పరిచయంతో హీరో సూర్య జ్యోతికలతో తీయబోయే చిత్రానికి నన్ను కొరియోగ్రాఫర్ గా చేయాలని కోరారు. వెంటనే ఆ సినిమాని నేను ఒప్పుకున్నాను. నేను అప్పటికే ఆరు నెలల గర్భవతిని అనే విషయాన్ని దాచి పెట్టాను.
ఇక సినిమా పాటల అవుట్ డోర్ షూటింగ్ అంటే… కొండలు, గుట్టలు, చెట్ల మధ్య షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చోటునే దర్శకుడు వసంత్ ఎంచుకున్నారు. కొండలు ఎక్కడం.. మరో షార్ట్ కి అవే కొండలు దిగడం లాంటివి జరిగేవి. అయితే ఆ సినిమాలో వచ్చే పాటలో హీరో సూర్య కూర్చుంటే, హీరోయిన్ జ్యోతిక అతని చుట్టూ తిరుగుతూ.. డాన్స్ చేయాల్సి ఉంటుంది. బాతు లాగా గెంతుతూ హీరోయిన్ హీరో చుట్టూ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అన్న ఉద్దేశంతో దర్శకుడికి డక్ స్టెప్పు గురించి చెప్పాను. ఈ డక్ మూమెంట్ బాగుంది. హీరోయిన్ తో మీరే ప్రాక్టీస్ చేయించండి అసిస్టెంట్స్ వద్దు అన్నారు. అలా జ్యోతికకు వచ్చేవరకు ప్రాక్టీస్ మధ్యాహ్నం వరకు చేయించాను.
అప్పటికే చాలా అలసిపోయాను. వసంత్ షూటింగ్ బ్రేక్ ఇస్తావా ? ఆకలవుతుందన్నాను. అందుకు డైరెక్టర్ సరే అని మేమంతా లంచ్ కి వెళ్ళాం. మధ్యలో నేను నడుస్తూ ఉండడం చూసిన వసంత్.. సుచిత్ర మీ పొట్ట తగ్గించుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను చేయమన్నాడు. అందుకు నవ్వి ఊరుకున్నాను. అందరూ కలిసి లంచ్ చేశాం. ఆ తర్వాత రిలాక్స్ అవుతున్న డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో.. ఆయన షాక్ అయి షేక్ అయ్యారు. నాతో అలాంటి కష్టమైన డక్ మూమెంట్ చేయించానని ఆయన లోలోపల చాలా బాధపడ్డారు. నేను ప్రెగ్నెంట్ నని ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. నాకు తెలియక మీతో కష్టమైనా మూమెంట్స్ చేయించినందుకు సారీ అని చెప్పారు. ఆనాటి మెమోరబుల్ ఇన్సిడెంట్స్ ని ఈ ఇంటర్వ్యూలో సుచిత్ర చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు.
Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి గురించి మరో నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యల సంచలనగా మారాయి. జె.డి చక్రవర్తి గులాబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
Advertisement
ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జే డీ చక్రవర్తి చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిని పట్టుకుని దుర్మార్గుడు రాక్షసుడు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ విధంగా చిరంజీవి గురించి చక్రవర్తి మాట్లాడటానికి కారణం లేకపోలేదు ఓసారి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలోనే జె.డి చక్రవర్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అంతం సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ జరిగే సమయంలో చిరంజీవి గారిని చక్రవర్తి గమనిస్తూనే ఉన్నారట. అందరూ కూడా షిఫ్ట్ మారుతున్న ఈయన మాత్రం అక్కడ అలాగే కూర్చుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
పని రాక్షసుడు..
Advertisement
ఇక ఓ రోజు తన కారులోనే నిద్రపోతున్నారు ఇదేంటి ఇలా నిద్రపోతున్నారని ఆయనని అడిగాను. ఇక్కడ కాకపోతే రూమ్ కి వెళ్లి నిద్రపోవచ్చు కదా అంటూ చిరంజీవి గారిని అడగగా ఆయన ఒకటే మాట చెప్పారు. నేను రూమ్ కి వెళ్తే ఎవరు నన్ను లేపరు. ఇక్కడైతే నన్ను లేపుతారు తద్వారా షూటింగ్ డిస్టర్బ్ కాదు అంటూ చెప్పారు. ఆ మాట వినగానే ఈయన ఏంటి మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, మరి ఇంత పని రాక్షసుడా అంటూ నేను నా మనసులోనే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయానని చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Kalyan Ram: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇక నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసినదే. త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Advertisement
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.
మీరు మీ నిర్మాణ సంస్థలో ఇలాంటి సినిమాలను నిర్మించడమే కాకుండా మీరే నటించవచ్చు కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ.. దయచేసి మీరు ఎప్పుడూ కూడా మా బాబాయ్ బాలకృష్ణతో నన్ను పోల్చొద్దని ఈయన తెలిపారు. ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఎంతో ఎనర్జీటిక్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయనని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దని తెలిపారు.
వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది.. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ..RRR సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో కంటతడి పెట్టించారు. అలాంటి సినిమాలను నేను చేయలేను. వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది. ఎలాంటి పాత్రలైనా వాళ్లు చేయగలరు. ఇక నందమూరి హీరోల మధ్య ఉన్నది పోటీ కాదు..కేవలం స్ఫూర్తి. ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందుతామని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Jani Master: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపిక అయ్యారు.అతి త్వరలోనే ఈయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.
Advertisement
ఇలా ఈయన సౌత్ చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈయన ఓ మహిళ కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు రావడమే కాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
గత కొద్దిరోజులుగా జానీ మాస్టర్ అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన సమయంలో తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తనపై అత్యాచారం కూడా చేశారని సదరు మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఇలా షూటింగ్ వెళ్లిన సమయంలో మాత్రమే కాకుండా నార్సింగ్ లో తన నివాసంలో కూడా ఇలా తనపట్ల లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు.
లైంగిక వేధింపులు.. ఇక ఈమె తోలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమె నివాసం నార్సింగ్ లో ఉన్న నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేశారు. మరి ఈయన ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో రాజకీయాల పరంగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.