Sukesh Chandrashekhar: 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు సుకేష్ చంద్రశేఖర్. అయితే ఈ మనీలాండరింగ్ కేసులో భాగంగా బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాన్ డేస్, నోరా ఫతెహి పేర్లను కూడా ఈడి అధికారులు చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిని ఈడి అధికారులు దర్యాప్తుకు పిలిపించే వీరి వాంగ్మూలం రికార్డు చేశారు.

ఇప్పటివరకు అధికారులు జాక్వలిన్, నోరా ఇద్దరి నుంచి వారి వాంగ్మూలం సేకరించగా తాజాగా సుకేష్ చంద్రశేఖర్ ని కూడా విచారించారు. ఈ విచారణలో భాగంగా ఈయన నటి నోర పతేహీ పై సంచలన ఆరోపణలు చేశారు. నోరా నటి జాక్వలిన్ పై తరచూ అసూయ పడేదని, తాను జాక్వలిన్ తో రిలేషన్ లో ఉండగా తనకు బ్రెయిన్ వాష్ చేసి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించేదని ఈయన తెలియజేశారు.
నేను జాక్వలిన్ ను వదిలిపెట్టి తనతో డేటింగ్ చేయాలని ఆమె తనపై ఒత్తిడి తీసుకువచ్చేది. నోరా ప్రతిరోజు తనకు కనీసం పది సార్లు ఫోన్ చేసేదని ఈయన వెల్లడించారు. అలాగే అధికారుల ముందు నోరాఫతేహీ తన గురించి ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా ఆ వాస్తవమని ఈయన తెలిపారు. అదేవిధంగా అధికారుల ముందు
జాక్వలిన్ ఇచ్చిన ఫిర్యాదు గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదని సుకేష్ తెలిపారు.

Sukesh Chandrashekhar:జాక్వలిన్ ను చూసుకోవడం నా బాధ్యత…
జాక్వలిన్ గురించి సుఖేష్ ప్రస్తావిస్తూ.. ఆమె నేను గౌరవించే వారిలో ఓ వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమె నాతో ఉంటే ఎంతో సంతోషం ఈ కేస్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో నాకు తెలుసు.ఆమెను చూసుకోవడం పూర్తిగా నా బాధ్యత ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సుఖేష్ చంద్రశేఖర్ నటి జాక్వలిన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























