Sumanth Ashwin : దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస హిట్లతో దూసుకుపోయిన సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తునిగా తునిగా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంత విజయం సాధించలేక పోయిన సుమంత్ నటనకు అవార్డు వచ్చింది అయితే ఆ సినిమా తరువాత కేరింత, అంతకు ముందు ఆ తరువాత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలతో వచ్చినా సరైన హిట్ మాత్రం రాలేదు. హీరోగా ఇంకా కుదురుకోలేదు.

మా నాన్న వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఇపుడు నాతో ఎలా ఉన్నారంటే….
ఇక రీసెంట్ గాసెవెన్ డేస్ సిక్స్ నైట్స్ సినిమాతో వచ్చిన అది కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే సినిమా ప్రమోషన్స్ తో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సుమంత్ అశ్విన్ తన తీరు మార్చుకున్నట్లు ప్రచార కార్యక్రమాలు చేయక పోతే సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావని అర్థమైందని సోషల్ గా మూవ్ అవ్వాలని అర్థమైందని చెప్పారు. ఇక మా నాన్న సినిమాల వల్ల బ్రేక్ వచ్చిన దేవి శ్రీ వంటి వారు నాతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని ఇంతకు ముందే మేమిద్దరం కలిసి వర్క్ చేయాల్సింది కానీ కుదరలేదు.

కానీ దేవి శ్రీ ప్రసాద్ కి నాతో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడు అంటూ చెప్పారు. అందరూ వాళ్ళ కెరీర్ లో బిజీ కానీ ఒకవేళ వచ్చి నాకోసం ప్రమోషన్ ఇవ్వమంటే ఖచ్చితంగా వస్తారు అంటూ చెప్పాడు. స్టోరీ డెసిషన్ నాదే ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి చెప్పి నిర్ణయం తీసుకుంటా అంటూ చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలోను ఆర్థికంగా బాగున్నప్పుడు ఒకేలా ఇంట్లో ఉండేదని పెద్దగా తెలియనిచ్చేవారు కాదు అంటూ చెప్పాడు.


































