Supreetha emotional Post : సినిమాలలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె కూతురు సుప్రీత అయితే అందరికీ సుపరిచితమే. సురేఖ వాణి ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూతురుతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక సుప్రీత గురించి చెప్పాలి అంటే… ఒక్క సినిమాలో కూడా నటించక పోయినా వైరల్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పేరు సంపాదించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కోవకే చెందుతుంది మన సుప్రీత. ఈ అమ్మడు ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా చేయకపోయినా సోషల్ మీడియాలో తన తల్లిని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఈమధ్య ఒక ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బంలో కూడా కనిపించి సందడి చేసింది సుప్రీత. అంతేకాదు త్వరలోనే తెలుగులో ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈమె చేసే ఫోటో షూట్ లతో ఇప్పటికే ఈమెకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అపుడప్పుడు సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది సుప్రీత. ఈ కోవలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం, తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టేటస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రెండు నెలలు గడచినా రెండు ఏళ్ళు గడచినా ఫీలింగ్…..
తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన ఒక చిట్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది సుప్రీత. ఈ చాట్ లో ఒక నెటిజెన్ తన స్నేహితురాలు గురించి అడగగా ఎమోషనల్ అయింది. నీ స్నేహితురాలు డాలీ ని మిస్ అవుతున్నావా? అన్న నెటిజెన్ ప్రశ్నకు… అవును డాలీ ని చాలా మిస్ అవుతున్నాను. తనకు దూరంగా 2 నెలలు మాత్రమే గడిచినా రెండేళ్లు గడిచిన ఫీలింగ్ నాకు కలుగుతుందని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం సుప్రీత పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.































