AP Election Result: ఏపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇలా అధికారంలోకి ఎవరు రాబోతున్నారనే విషయం గురించి ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి.

పలు సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రాగా మరికొన్ని వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా వచ్చాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ప్రజలకు క్లారిటీ లేకపోవడంతో ఎన్నికల ఫలితాల పై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే తాజాగా పరిపూర్ణానంద స్వామివారు ఏపీ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
స్వామి పరిపూర్ణానంద బీజేపీ తరపున హిందూపురంలో పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి కారణంగా టీడీపీకి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. అయితే హిందూపురంలో కూడా ఎవరు ఊహించని పరిణామం జరగబోతుందని ఈయన తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం తిరిగి ఏపీలో జగన్ అధికారంలోకి రాబోతున్నారని వెల్లడించారు.
జగన్ కే విజయం..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో జగన్, కేంద్రంలో మోడీ విజయం సాధిస్తారని ఈ సందర్భంగా పరిపూర్ణానంద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























