Tag Archives: aishwarya rai

Aishwarya Rai: కూతురితో కలిసి బచ్చన్ ఫ్యామిలీ నుంచి దూరం కాబోతున్న ఐశ్వర్యరాయ్… నిజమెంత?

Aishwarya Rai: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ గురించి ఈ మధ్యకాలంలో తరచూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయ్యాయి. మొదట్లో ఈ వార్తలు పై అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ గట్టి సమాధానం ఇచ్చారు.

ఇటీవల కూడా మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ ఒక్కతే కనిపిస్తోంది అంతేకాకుండా ఈమె 50వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన కుమార్తె తన తల్లితో కలిసి ఐశ్వర్య కేక్ కట్ చేశారు. కానీ అక్కడికి అభిషేక్ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని విడిపోతున్నారని త్వరలోనే ఐశ్వర్య తన కుమార్తెను తీసుకొని బచ్చన్ ఫ్యామిలీ నుంచి బయటకు రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.

ఈ వార్తలకు తోడు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కూడా వీరు విడాకులకు సిద్ధమయ్యారు అంటూ చెప్పడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ వార్తలకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఆరాధ్య స్కూల్ డే ఫంక్షన్ కోసం ఐశ్వర్యరాయ్ తో పాటు తన మామయ్య అమితాబ్ బచ్చన్ అలాగే తన భర్త అభిషేక్ బచ్చన్ అందరూ కలిసి కనిపించారు.

కలిసి కనిపించిన ఐశ్వర్య అభిషేక్…


ఈ వీడియోలో ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ కనిపించడంతో వీరిద్దరి విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని అందులో ఏమాత్రం నిజం లేదు అందుకు నిదర్శనమే ఈ వీడియో అంటూ మరికొందరు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

NTR: ఎన్టీఆర్ సినిమాలో లేడి విలన్ గా బాలీవుడ్ బ్యూటీ… వైరల్ అవుతున్న వార్తలు?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ పని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కి సంబంధించిన పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో లేడీ విలన్ గా మరొక బాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

NTR: విలన్ గా ఐశ్వర్యరాయ్…


ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఈ సినిమాలో విలన్ గా ఐశ్వర్యరాయ్ ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద రికార్డుగా మిగిలిపోతుంది. ఓ టాలీవుడ్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ..విలన్ గా మారడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Aishwarya Rai: నువ్వు కూతుర్ని చూసుకుంటూ ఐశ్వర్యని సినిమాలు చేయనివ్వు… అభిషేక్ కి సలహా ఇచ్చిన నేటిజన్!

Aishwarya Rai: ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికి ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 50 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల పడుచు పిల్లలాగా గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్ 1 తో పాటు ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 లో కూడా ఐశ్వర్య తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి బాలీవుడ్ హీరో, ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ స్పందించాడు. “పొన్నియన్ సెల్వన్ 2 సినిమా సక్సెస్ అవ్వడం చిత్ర యూనిట్ శ్రమ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని, ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ని చూసి గర్వపడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ద్వారా ప్రశంసలు కురిపించాడు.

ఇలా అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ కి ఒక నెటిజన్ స్పందిస్తూ… “ఇప్పటికైనా తెలిసిందిగా నువ్వు ఆరాధ్య ని చూసుకొని ఐశ్వర్యని మరిన్ని సినిమాలు చేయనివ్వు” అంటూ కామెంట్ చేశాడు. నేటిజన్ చేసిన ఈ కామెంట్ కి అభిషేక్ బచ్చన్ స్పందించాడు. ఈ క్రమంలో అభిషేక్ ” నేనేమీ వద్దన్నానా? సార్.. తను ఏం చేయాలనుకున్నా నా అనుమతి అవసరం లేదు. తనకి ఇష్టమైన పనులు చేయాలనుకుంటే తప్పకుండా చేయవచ్చు ” అంటూ అభిషేక్ బచ్చన్ సమాధానం ఇచ్చాడు.


Aishwarya Rai: నా అనుమతి అవసరం లేదు…

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి వార్తలు వినిపిస్తున్న తరుణంలో అభిషేకి ఇలా ఐశ్వర్య నటన గురించి ప్రశంసలు కురిపించడమే కాకుండా తనకు నచ్చిన పని చేయటానికి అభ్యంతరం లేదని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఐశ్వర్య, అభిషేక్ జీవితాంతం ఇలా ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

Aishwarya: మణిరత్నంకి పాదాభివందనం చేసిన ఐశ్వర్యరాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..?

Aishwarya: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ ప్రపంచ సుందరి ఇప్పుడు ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ తాజాగా డైరెక్టర్ మణిరత్నం పాదాలకు నమస్కరించింది. సాత్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం ఎన్నో క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు.
తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా మంచి హిట్ అందుకుంది.ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా సిద్ధం చేశారు. ఈ సినిమా మొదటి భాగం గతేడాది విడుదల చేయగా..ఇక సెకండ్ పార్ట్‌ పీఎస్‌-2 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు . ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇదిలా ఉంటే, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


Aishwarya: గురు భక్తి చాటుకున్న ఐశ్వర్య…

ఐశ్వర్య రాయ్ అందరూ చూస్తుండగా మీడియా ముందు తన గురు, డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. విశ్వ సుందరిగా, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్యా రాయ్ ఇలా మణిరత్నం కాళ్లకు నమస్కరించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Aishwarya – Abhishek: ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుపోతున్నారా…. అందుకే దూరంగా ఉంటోందా..?

Aishwarya – Abhishek: బాలీవుడ్ ఇండస్ట్రీలో చూడ ముచ్చటగా కనిపించే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ గురించి తెలియని వారంటూ ఉండరు. 2007లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అందరి సెలబ్రిటీల లాగే వీరి వివాహ బంధం గురించి అనేక రూమర్లు వినిపించాయి. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా మరొకసారి ఐశ్వర్య – అభిషేక్ విడాకులు వార్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవ్వటానికి కారణాలు లేకపోలేదు. వివాహం తర్వాత ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఐశ్వర్య అభిషేక్ జంటగా ఏ కార్యక్రమానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంది. ఇటీవల నిర్వహించిన మిగతా అంబానీ కల్చరల్ ఈవెంట్లో కూడా ఐశ్వర్య కూతురితో పాటు హాజరయ్యింది.

మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలు జంటలుగా హాజరైతే ఐశ్వర్య మాత్రం కూతురితో కలిసి ఒంటరిగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యింది. దీంతో ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు మరొక సారి చక్కర్లు కొడుతున్నాయి.
ఐశ్వర్య, అభిషేక్ మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా ఐశ్వర్య కూతురితో కలిసి అభిషేక్ కి దూరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఎక్కడికి వెళ్ళినా కూడా అభిషేక్ తోడుగా లేకుండా ఐశ్వర్య కూతురుతో కలిసి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Aishwarya – Abhishek: రెండో పెళ్లి కూడా మీరే చేయండి…

ఈ విడాకుల వార్తలపై ఈ సెలబ్రిటీ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. గతంలో వచ్చిన విడాకుల వార్తల గురించి అభిషేక్ స్పందిస్తూ.. “నేను విడాకులు తీసుకుంటున్నట్లు నాకు గుర్తు చేసినందుకు థాంక్స్.. నా రెండవ పెళ్లి కూడా ఎప్పుడు చేస్తున్నారో మీరే చెప్పండి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై అభిషేక్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Aishwarya Rai: అంబానీ తనయుడి నిశ్చితార్థ వేడుకల్లో మెరిసిన ఐశ్వర్యారాయ్, కూతురు… ఫోటోలు వైరల్ !

Aishwarya Rai: ప్రపంచ సంపన్నులలో ఒకరైన అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిన్న నాటి స్నేహితురాలైన రాధిక మర్చంట్ ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ముంబైలో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల నిశ్చితార్థ వేడుకని అంబానీ కుటుంబం చాలా ఘనంగా నిర్వహించింది.

ఈ నిశ్చితార్థ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకలు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సచిన్ అంజలి దంపతులతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో ఐశ్వర్యరాయ్ తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్లినా తన కుమార్తెను వెంటబెట్టుకొని వెళుతుంది. కూతురంటే ఐశ్వర్యరాయ్ కి చాలా ఇష్టం. ఇక ఇటీవల జరిగిన నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఆరాధ్య మీడియా ముందుకి వచ్చింది. ఈ వేడుకలలో ఆరాధ్య క్రీమ్ కలర్ అనార్కలి డ్రెస్ లో కుందనపు బొమ్మ లాగా మెరిసిపోతుంది.

Aishwarya Rai: అందంలో తల్లికి పోటీపడిన ఆరాధ్య…

ఐశ్వర్యరాయ్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆరాధ్య తల్లికి సమానంగా హైట్ ఉండటమే కాకుండా ఎంతో అందంగా ఉంది. దీంతో ఆరాధ్యని చూసిన వారు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూతురు కూడా అందంలో తల్లికి ఏ మాత్రం తీసిపోవటం లేదని కామెంట్లు చేస్తున్నారు. అమితాబచ్చన్ మనవరాలిగా ఐశ్వర్యరాయ్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Abhishek Bachchan: విడాకులు గురించి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. రెండో పెళ్లి కూడా మీరే చేసేయండి: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇన్ని రోజులు బాయికాట్ బాలీవుడ్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది అయితే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోగా తాజాగా మరి కొంతమంది విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ దీపికా పదుకొనేవిడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన రణవీర్ అలాంటిది ఏమీ లేదని కొట్టి పారేశారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో వీరివిడాకుల గురించి వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ విడాకుల వార్తలపై గతంలో అభిషేక స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే మరోసారి ఈయన తనదైన స్టైల్ లో విడాకుల గురించి స్పందిస్తూ.. బాలీవుడ్ మీడియాకి భారీగా కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ విడాకులపై స్పందిస్తూ తనకు విడాకులు ఇవ్వాలని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

Abhishek Bachchan: ఆ బాధ్యత కూడా మీదే..

విడాకులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయితే తనకు రెండో పెళ్లి కూడా చేసే బాధ్యత మీదే అంటూ ఈ సందర్భంగా ఈయన మీడియాపై మండిపడ్డారు. ఈ విధంగా విడాకుల గురించి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయగా విరి విడాకులు వార్తలు కేవలం అవాస్తవాలేనని ఇందులో ఎలాంటి నిజం లేదని అర్థమవుతుంది.ఇక ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ 2007వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరిద్దరికి ఆరాధ్య అనే ఒక కుమార్తె కూడా ఉంది తరచూ వీరిద్దరూ పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నప్పటికీ వీరి విడాకులు గురించి వార్తలు రావడం గమనార్హం.

Suhasini: సినిమా రివ్యూ ఇవ్వడానికి నువ్వెవరు.. ఉమైర్ సందు పై సుహాసిని స్ట్రాంగ్ కౌంటర్?

Suhasini: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియాస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందంటేనే ఆ సినిమాపై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమా నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఉమైర్ సందు ఇచ్చారు.. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.సినిమాలో హైలెట్ పాయింట్స్ ఇవే అంటూ సినిమా గురించి ఈయన తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని,సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా ఐశ్వర్యారాయ్ తిరిగి ఫామ్ లోకి వచ్చిందని చాలా ట్విస్టుల నడుమ ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించేలా ఉందంటూ ఈ సినిమా గురించి ఈయన పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కాకుండానే ఈయన రివ్యూ ఇవ్వడంతో మణిరత్నం భార్య నటి సుహాసిని అసలు నువ్వు ఎవరు? విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు అంటూ ఈమె కౌంటర్ వేశారు.

Suhasini: రివ్యూయర్ పై మండిపడిన సుహాసిని..

ఈ విధంగా సుహాసిని ఉమైర్ సందు ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ అంటే ఈయన సినిమా చూడకుండానే ఫేక్ రివ్యూ ఇస్తున్నారా అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆయన దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు ఆయన సినిమా చూసే అవకాశం ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి సుహాసిని ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యపై నెటిజన్ల ట్రోల్స్.. ఏందుకంటే..

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మరియు వీళ్ల గారాల కుట్టీ ఆరాధ్య మాల్దీవుల నుండి ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం నుండి వారు నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాల్దీవులలో ఆరాధ్య పుట్టినరోజు ఘనంగా జరుపుకొని.. తిరిగి వచ్చేశారు. చాలా రోజుల తర్వాత తల్లీకూతుళ్లు జంటగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆ వీడియోలో ఆరాధ్య తన తల్లితో కలిసి ఉండటం, ఆమె చేతిని ఐశ్వర్య పట్టుకోవడం కనిపించింది. ఇక వీడియోపై, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య నడకలో ఎలాంటి మార్పు లేకపోగా.. తన కూతురు ఆరాద్య నడకపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆరాధ్య క్యాట్‌వాక్‌పై.. ఆరాధ్య నడకకు ఏమైంది అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేయగా ఇలా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ ఇది కేవలం సరదా కోసమే ఆరాద్య చేస్తుందని ఒకరు అన్నారు. ఈ వీడియోలో ఐశ్వర్య తన కూతురు చేయి పట్టుకోవడంతో.. ఆమె చేయిని వదిలి పెట్టండి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అదే సమయంలో అభిషేక్ ఆరాధ్య పోజులిచ్చిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. “పుట్టినరోజు శుభాకాంక్షలు యువరాణి’’ అంటూ ట్యాగ్ చేసి ఫొటోలను పోస్టు చేశాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అందే కాకుండా.. ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాడు..

“నిన్న ఆరాధ్య 10వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇవే కాకుండా అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య రిసార్ట్‌లోని సిబ్బందితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మా బస ఇంత సౌకర్యవంతంగా చేసినందుకు @amillafushi యొక్క సిబ్బంది మరియు నిర్వహణకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

మరోసారి తల్లి కాబోతున్న ఐశ్వర్యరాయ్.. ఇదే సాక్ష్యం?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ ప్రపంచ సుందరిగా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళింది. ఇలా 2007వ సంవత్సరంలో అమితాబచ్చన్ ఐశ్వర్య రాయ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరికి 2011వ సంవత్సరంలో అమ్మాయి పుట్టగా తనకు ఆరాధ్య అనే పేరు పెట్టారు.

ఇకపోతే ఐశ్వర్యారాయ్ ఎక్కడికి వెళ్లినా తన కూతుర్ని తీసుకుని వెళ్లడంతో ఇప్పటికే ఈమెకు ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఐశ్వర్య కూతురు ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లి కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తల గురించి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ తన భర్త కూతురుతో కలిసి బయటకు రాగా మీడియా ఆమెపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ కి అడ్డుగా తన కూతురు తన భర్త అభిషేక్ బచ్చన్ రావడం విశేషం. ఐశ్వర్యరాయ్ కూడా తన పొట్ట కనపడకుండా ఒక బ్యాగ్ అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ఐశ్వర్య రాయ్ ఇలాంటి ప్రవర్తన చూసిన పలువురు నెటిజన్లు ఈమె తల్లి కాబోతుందనీ వచ్చే వార్తలలో నిజం ఉందని అందుకోసమే ఐశ్వర్య ఇలా ఫోటోలకు అడ్డుగా తన కూతురిని పెట్టుకున్నట్లు బలంగా భావిస్తున్నారు.త్వరలోనే మరొక బుల్లి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ను ఇవ్వబోతున్నట్లు నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని బచ్చన్ కుటుంబం తెలియజేయాల్సి ఉంది.