Tag Archives: akkineni naga chaitanya

Samantha: భయంకరమైన వ్యాధితో పోరాడి బయటపడిన సమంత?

Samantha:సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తరచూ వారి పాత్రలకు అనుగుణంగా మేకప్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగులలో పాల్గొనడం వల్ల కొన్ని రకాల వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత సైతం ఇలాంటి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ వ్యాధితో పోరాడి గెలుచారని తెలుస్తోంది.

 

సమంత ఇండస్ట్రీలోకి వచ్చి అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడే వారికి కాస్త సూర్య రష్మి తగిలిన వెంటనే చర్మం మొత్తం ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతూ ఎంతో బాధపడతారని సమంత కూడా ఈ వ్యాధితో బాధపడ్డారని తెలుస్తోంది.

ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడిన సమంత ఈ వ్యాధికి సరైన చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే తాను నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టారు.

Samantha: వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత..

విడాకుల తర్వాత సమంత ఏకంగా ఐటమ్ సాంగు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఒకసారిగా ప్రేక్షకులు ఆశ్చర్య పోయినప్పటికీ ఈ పాటతో ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా విపరీతమైన సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం. యశోద ఖుషి వంటి సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు. ఇక ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Actress Sadha: సమంత నాగచైతన్య విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్… నిజమే కదా అంటూ మద్దతు తెలిపిన నేటిజన్స్?

Actress Sadha: జయం సినిమాతో వెళ్ళవయ్య వెళ్ళు అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు సదా.ఈ సినిమాలో లంగా వోణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో అమాయకంగా నటించి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా జయం సినిమాతో అద్భుతమైన విజయం తన ఖాతాలో వేసుకున్న సదా అనంతరం పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.

ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే సదా వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె మొదటిసారిగా డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టారు.

హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సదా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమెకు పెళ్లి గురించి ప్రశ్నలు రావడంతో ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పెళ్లి బంధం పై పెద్దగా నమ్మకం లేదని తెలిపారు.మన కెరియర్ లో మనం నిలదొక్కుకోకుండా పెళ్లి చేసుకొని ఇతరులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actress Sadha: వివాహ బంధం పై నమ్మకం లేదు…

ఇకపోతే పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వివాహం చేసుకున్నవారు ప్రశాంతంగా లేరని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.పదిమంది పెళ్లి చేసుకుంటే ఇందులో 5 మంది మాత్రమే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారని మిగతా ఐదు మంది ఏదో ఒక కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ ఈమె తెలిపారు.ఇలా విడాకులు తీసుకుని విడిపోవడం గురించి సదా మాట్లాడడంతో ఈమె పరోక్షంగా సమంత నాగచైతన్యలను ఉదాహరణగా తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ విధంగా ఈమె పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో సదా మాట్లాడిన మాటలు నిజమే కదా అంటూ కొందరు ఈమెకు మద్దతు తెలుపుతున్నారు.

Samantha: సమంత భరణం కింద 250 కోట్లు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటుడు బ్రహ్మాజీ!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఎన్నో సినిమాలలో విలన్ గా కమెడియన్ గా సహాయ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన సెలెబ్రెటీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది అభిమానులు సరాసరి వారి అభిమానులతో మాట్లాడుతున్నారు. అయితే కొందరు వారి లిమిట్ క్రాస్ చేసి మరి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం వారి సినిమాలు నటన వరకు మాత్రమే మాట్లాడాలి కానీ ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం సమంజసం కాదంటూ ఈయన పేర్కొన్నారు.

ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ ఎంతో బాధ పెడుతుంటారని అందుకు మంచి ఉదాహరణ సమంత అంటూ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇలా విడిపోయిన అనంతరం ఎంతోమంది సమంత పై ఎన్నో మాటలు అంటూ తనని దారుణంగా బాధపెట్టారు.

Samantha: ఆ విషయంలో బాధపడ్డాను…

ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా విడాకులు తీసుకున్న తర్వాత 250 కోట్ల భరణం తీసుకున్నావంటూ కామెంట్ చేశారు. ఇలా తన గురించి ఏమాత్రం తెలియకుండా ఇలా కామెంట్ పెట్టేయడంతో ఈ విషయంపై సమంత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్ చూసిన బ్రహ్మజీ ఎంతో బాధపడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యానని ఈ సందర్భంగా వెల్లడించారు. అవకాశం ఉంది కదా అని సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీల విషయంలో నెటిజన్ లు స్పందించే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ashwini dutt: మహానటి సినిమాలో ఎన్టీఆర్ చేయకపోవడానికి అసలు కారణం అదేనా.. బయటపెట్టిన అశ్విని దత్?

Ashwini dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్విని దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి ఈయన ఎన్నో విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని భావించారట. అయితే చివరికి ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలని అనుకున్నాము. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించారు.

Ashwini dutt: ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించడమే కారణం…

ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించడంతో మహానటి సినిమాలో ఆయన పాత్రలో ఎవరిని పెట్టి నటింపచేసిన ప్రజలు, అభిమానులు తప్పుగా భావిస్తారన్న ఉద్దేశంతోనే చివరి నిమిషంలో ఎన్టీఆర్ ను వద్దనుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం నాగ్ అశ్విన్ కి తెలియడంతో ఎన్టీఆర్ లేకుండా ఆయన పాత్ర చేస్తా అంటూ తెరవెనక ఎన్టీఆర్ వాయిస్ తో రాజేంద్రప్రసాద్ చేత రెండు డైలాగులు చెప్పించామని ఈ సందర్భంగా అశ్విని మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

Naga Chaitanya: గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెట్టు అడ్డంగా దొరికిపోయా.. గర్ల్ ఫ్రెండ్ గురించి అసలు నిజం బయటపెట్టిన నాగచైతన్య?

Naga Chaitanya: నాగచైతన్య తాజాగా అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో సందడి చేశారు. ఈ పాత్రలో నటించిన ఈయన నటనకు ప్రశంసలు అందడంతో వరుసగా బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే గతంలో తాను గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారు బ్యాక్ సీట్లో కూర్చుని తనకు ముద్దు పెట్టబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. ఇలా గర్ల్ ఫ్రెండ్ తో పోలీసులకు దొరికిపోయానని నాగచైతన్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ విధంగా గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెట్టడం తనకు దృష్టిలో తప్పు విషయం కాదంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా నాగచైతన్య తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయాన్ని చెప్పారు కానీ ఆమె ఎవరు తన పేరు ఏంటి అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ విధంగా నాగచైతన్య ఓపెన్ కావడం గమనార్హం.

Naga Chaitanya: సీక్రెట్ గా గర్ల్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేసిన నాగచైతన్య…

ఇకపోతే ఇదివరకు నాగచైతన్య ఎక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలలో కూడా పెద్దగా పాల్గొనేవారు కాదు. ఒకవేళ ఇంటర్వ్యూలకు హాజరైన కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావించేవారు. ఎక్కడ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే వారు కాదు. అయితే సమంతతో విడాకుల తర్వాత తాను వ్యక్తిగతంగా కూడా చాలా మారిపోయానని ఒకానొక సందర్భంలో నాగచైతన్య వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.

Samantha: రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేశాను.. కష్టాలను తలుచుకొని ఎమోషనల్ అయిన సమంత?

Samantha: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో నేడు పాన్ ఇండియా లెవెల్ లో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సమంత.ఈమె అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ లో ఎంతో ముందుకు వెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత పబ్లిక్ ప్లేస్ లో అయినా లేదా సోషల్ మీడియా వేదికగా అయినా తాను చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సమంత చెన్నైలోనే సత్యభామ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు.తనని ఒక గొప్ప స్థాయిలో చూడాలని అమ్మ నాన్నలు కలలు కన్నారు. నేను కూడా వారి కళలను నెరవేర్చే దిశగా పది 12 తరగతులలో టాపర్ గా నిలిచాను.

ఇక ఉన్నత చదువులు చదవడం కోసం మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తాను కన్న కలలను కలలుగానే మిగిలిపోయాయని ఈమె తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఆశించే మార్గంలో నడవడమే కాకుండా మీకంటూ ఓ గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు ప్రయత్నాలు చేయాలని ఈమె విద్యార్థులకు మోటివేట్ చేశారు.

Samantha: ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను..

ఈ క్రమంలోనే తాను కూడా కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి సమంత వెల్లడించారు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో డబ్బు కోసం తాను ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేశానని సమంత వెల్లడించారు.ఇక రెండు నెలల పాటు కేవలం ఒక్క పూట భోజనం చేసే బ్రతకానని అలాంటి కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను కనుక ఈ స్థాయిలో ఉన్నానంటూ సమంత ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Aamir Khan: తమిళ మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. కారణమదేనా?

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎన్నో విభిన్నమైన కథా చిత్రాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా కొనసాగుతున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడుగా కొనసాగుతున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన చిత్ర బృందం తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే మీడియా ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర బృందం మాత్రం ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఇలా చిత్ర బృందం ప్రెస్ మీట్ కు ఆలస్యం కావడంతో నటుడు అమీర్ ఖాన్ బహిరంగంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు.కొన్ని అనివార్య కారణాల వల్ల రావడం కాస్త ఆలస్యమైందని అందుకు మీడియా మిత్రులు క్షమించాలని కోరారు.

Aamir Khan:హాలీవుడ్ రీమేక్ చిత్రం…

ఇలా పలు భాషలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటించగా అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలు విడుదల చేయనున్నారు.

Samantha: సమంతను ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయా.. చైతూనీ మర్చిపోలేక పోతున్న సామ్?

Samantha: సమంత విడిపోయి దాదాపు ఏడాది కావస్తోంది. ఇలా వీరు విడిపోయినప్పటికీ వీరి గురించి ఏ విషయం తెలిసిన హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలా వీరిద్దరూ విడిపోయి వీరి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు కానీ ఇప్పటికి వీరి విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియడం లేదు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఇలా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియక వీరి విడాకులకు కారణం ఇదేనంటూ ఎన్నో వార్తలు సృష్టించారు. ఇలాఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి దూరం అయ్యేసరికి సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. విడాకుల ప్రకటన వెలువడగానే సమంత తనలో ఉన్న బాధను సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో తెలియజేశారు.

ఇలా సమంత చైతన్య నుంచి విడిపోయినప్పుడు ఎంతో కృంగిపోయిందని, ఆ సమయంలో జీవితం ఎంతో కష్టంగా మారిందని తాజాగా ఒక టాక్ షోలో ఈమె వెల్లడించారు.అయితే ప్రస్తుతం అంతా సెట్ అయిందని చెప్పినప్పటికీ తనని ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తోంది.

Samantha: ఆ పుస్తకంతో దర్శనమిచ్చిన సామ్…

తాజాగా సమంత ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.ఇలా ముంబై ఎయిర్ పోర్టులో ఈమె కనపడగానే ఒక్కసారి కెమెరాలన్ని క్లిక్ మనిపించాయి. ఇక ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సమంత చేతిలో మాత్రం లూయిస్ హే రాసిన ‘యూ కెన్  హీల్ యువర్  లైఫ్’అనే బుక్ తన చేతిలో కనిపించింది.ఇలా ఈ బుక్ కనిపించడంతో సమంతను ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని వాటి నుంచి బయటపడటం కోసమే ఈమె ఇలాంటి పుస్తకాలు చదువుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

King Nagarjuna : కింగ్ నాగార్జున క్రేజ్ ను చైతన్య, అఖిల్ అందుకోగలరా ?

King Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి అలానే అక్కినేని ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారి టైంలో ఒక ట్రెండ్ ను సెట్ చేసారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ తండ్రికి తగిన తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ అక్కినేని యంగ్ హీరోలు.

fans worrying about akkineni chaitanya and akhil stardom comparing with nagarjuna

ఇక నాగ చైతన్య మార్కెట్ ఈ ఏడాది కాస్త పెరిగిందనే చెప్పాలి లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు చైతన్య. అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు చేదు అనుభవాలుగా మిగిలాయి. అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తన ఖాతాలో హిట్ అందుకున్నాడు అఖిల్.

fans worrying about akkineni chaitanya and akhil stardom comparing with nagarjuna

ప్రస్తుత చైతన్య థాంక్యూ సినిమాతో… అఖిల్ ఏజెంట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో కొడుకులందరూ వంద కోట్ల క్లబ్లో చేరుతుంటే అక్కినేని కుర్రాళ్ళు మాత్రం 30, 40 కోట్ల క్లబ్ లోనే ఉండిపోయారు. అయితే ఇటీవలే విడుదలైన బంగార్రాజు తో తండ్రి కొడుకులు 50 కోట్ల క్లబ్ లో చేరారు.

100 కోట్ల క్లబ్ లో చైతు, అఖిల్ అడుగు పెడతారా !

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు. పండుగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ ఏడాదిలో మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. ఇప్పటి వరకు 10 రోజుల్లో 35 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 4 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ యంగ్ హీరోలు వంద కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరతారో…