Tag Archives: America

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ కు సర్జరీ… అసలేమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్!

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి శర్వానంద్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

శర్వానంద్ జాను సినిమా షూటింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రమాదానికి గురైనటువంటి ఈయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా తీవ్ర గాయాలతో బయటపడినటువంటి శర్వానంద్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో ఈయనకు సర్జరీలు కూడా జరిగాయని అయితే ప్రస్తుతం ఆ సర్జరీలు తాలూకా కాస్త ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది.

గతంలో ప్రమాదానికి గురైన తర్వాత అందుకు సంబంధించిన గాయాలు తిరిగి ఇప్పుడు నొప్పి కలిగించడంతో ఈయన వాటికి సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికా వెళుతున్నారని తెలుస్తోంది. ఇలా సర్జరీ పూర్తి అయిన తర్వాత యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈయన ప్రకటించిన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Sharwanand: సర్జరీ కోసం అమెరికా…


ఇలా సర్జరీ కోసం శర్వానంద్ అమెరికా వెళుతున్నారని వార్తలు రావడంతో అభిమానులు శర్వానంద్ కు సర్జరీ సక్సెస్ కావాలని ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గత రెండు నెలల క్రితం శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

Samantha: అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సమంత… కారణం అదేనా?

Samantha: సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి దేశ విదేశాలు తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తాజాగా న్యూయార్క్ వీధులలో చక్కర్లు కొడుతూ అక్కడ అందాలను ఆస్వాదిస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం సమంత అమెరికా వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తన తల్లితో పాటు అమెరికాలో ఉన్నటువంటి సమంతకి త్వరలోనే ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇలా అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కొన్ని నెలల పాటు సమంత ఇక్కడే ఉండబోతున్నారని సమాచారం అందుకే ఇక్కడ హాస్పిటల్స్ లో ఉండాలి అన్న లేదా రెస్టారెంట్లో ఉండాలి అన్న చాలా ఖర్చు అవుతుంది అలాగే ఇబ్బంది అవుతుందని భావించినటువంటి సమంత ఏకంగా అమెరికాలో ఒక ఇల్లు కొనుగోలు చేశారట.అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈమె కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Samantha: ట్రీట్మెంట్ కోసమే ఇల్లు కొన్నారా…


ఇలా సమంత ట్రీట్మెంట్ పూర్తి అయ్యేవరకు ఈమె ఇక్కడే ఉండబోతున్నారని ట్రీట్మెంట్ పూర్తి అయ్యి తిరిగి ఇండియా వచ్చే సమయంలో ఆ ఇంటిని అమ్మేయాలనే ఉద్దేశంతోనే సమంత అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లుని కొనుగోలు చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే అమెరికాలో ఇల్లు కొనిందా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే సమంత ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Samantha: అమెరికాలో ఇండియా పరువు మొత్తం గంగలో కలిపిన సమంత… ఏం చేశారో తెలుసా?

Samantha: సినీనటి సమంత సినిమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం తన ఆరోగ్యం పై పూర్తి దృష్టి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈమె న్యూయార్క్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

సమంత అక్కడ జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూయార్క్ పరేడ్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఈమె న్యూయార్కులో సందడి చేస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా అమెరికా వెళ్లినటువంటి సమంతా పెద్ద ఎత్తున అక్కడ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. దీంతో ఈమె షేర్ చేసే ఫోటోలు క్షణాలలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా సమంత న్యూయార్క్ వీధులలో నలుపు రంగు చీర ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఇండియన్ సాంప్రదాయం ప్రకారం చీర కట్టినప్పటికీ అది చీరల ఏమాత్రం లేదు పైట మొత్తం పక్కకు జరిపి పెద్ద ఎత్తున ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇండియన్స్ మండిపడుతున్నారు.

Samantha: పైట పక్కకు జరిపి అందాలు ఆరబోసిన సామ్…


ఇండియాలో ఎలాగో ఇలాంటి ఫోటోషూట్స్ ద్వారా పరువు తీసావు. ఇప్పుడు అమెరికా వచ్చి ఇండియన్ సాంప్రదాయం ప్రకారం చీరకట్టి మరి ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అవసరమా అంటూ కొందరు ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆరోగ్యం బాగాలేదని సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఇలా క్లీవేజ్ షో చేస్తూ పెద్ద ఎత్తున ఈమె రచ్చ చేయడంతో పలువురు సమంత పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ మజాకా…. ఏ హీరో సాధించని రికార్డ్ కొట్టిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా మరో వైపు రాజకీయాలలో భాగంగా వారాహి యాత్ర చేస్తూ కూడా బిజీగా ఉన్నారు.

ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొందరు పవన్ కళ్యాణ్ ను అభిమానించగా మరికొందరు దైవ సమానం అంటూ ఆయనని పూజిస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ పట్ల తమకు ఉన్నటువంటి అభిమానాన్ని అభిమానులు పలు సందర్భాలలో ప్రదర్శిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే పవన్ అభిమాని ఏకంగా చేతితో పవన్ కళ్యాణ్ ఫోటో గీసారు. అయితే ఇందులో ఏమంత వింత ఉంది అనుకోవచ్చు ఇప్పటివరకు ఎంతోమంది ఇలాంటి పనిచేసే ఉంటారు కానీ ఈ ఫోటో మాత్రం చాలా ప్రత్యేకమైన చెప్పాలి.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన బ్రో సినిమా నుంచి ఆయన లుక్ కి సంబంధించిన ఒక ఫోటో అభిమాని చేతితో వేశారు.

Pawan Kalyan: వేళల్లో అమ్ముడుపోయిన పవన్ ఫోటో…


ఇలా పవన్ కళ్యాణ్ ఫోటో గీయడంతో అమెరికాకు చెందిన మరొక పవన్ కళ్యాణ్ అభిమాని ఈ ఫోటోని ఏకంగా 520 డాలర్లు అంటే మన రూపాయల్లో 43,241 రూపాయలుపెట్టి కొనుగోలు చేయడం విశేషం అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ ఒక్క హీరో ఫోటో కూడా ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఈ స్థాయిలో ధర పలుకుతూ అమ్మడుపోవడంతో అది పవన్ స్టామినా అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Samantha: పారితోషికంగా నాకు రాళ్లు ఇవ్వలేదు.. బాధ్యతగా వ్యవహరించండి అంటూ ఫైర్ అయిన సమంత!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది పాటు విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత మయో సైటిసిస్ చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు. ఇలా అమెరికా వెళుతున్నటువంటి సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సమంత ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళుతున్నారని అయితే చికిత్స కోసం ఈమె ఒకసారి హీరో వద్ద ఏకంగా 25 కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ ఓ వార్త ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తలు సమంత దృష్టికి వెళ్లడంతో సమంత కూడా ఈ వార్తలపై ఘాటుగా స్పందించి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మయోసైటీస్ కోసం 25 కోట్లా ఈ డీల్ ఏ మాత్రం బాగాలేదు. అయితే ఈ చికిత్స కోసం చాలా తక్కువ అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉందని తెలిపారు.ఇక తాను ఇన్ని రోజులు సినిమాలలో పని చేసినందుకు నాకు రెమ్యూనరేషన్ గా రాళ్లు రప్పలు ఇవ్వలేదని ఈమె మండిపడ్డారు. నా గురించి నేను సులభంగా జాగ్రత్తలు తీసుకోగలనని తెలిపారు.

Samantha: వేల మంది బాధపడుతున్నారు..


ఇలా ఈ వ్యాధి చాలా ఖరీదైన ట్రీట్మెంట్ తో కూడుకున్నదని వార్తలు రావడంతో ఈమె మండిపడ్డారు.ఈ వ్యాధి కారణంగా కొన్ని వేల మంది బాధపడుతున్నారు. ఇలా అసత్యపు వార్తలను ప్రచారం చేయడం వల్ల వారు భయాందోళనకు గురవుతారు కనుక ఈ వ్యాధి పట్ల అందరూ కాస్త బాధ్యతగా వ్యవహరించండి అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా అసత్యపు వార్తలపై స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Chiranjeevi: చిరంజీవి అమెరికా వెళ్ళినది సర్జరీ కోసమేనా… అసలేం జరిగిందంటే?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.చిరంజీవి నటిస్తున్నటువంటి భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో ఈయన వెకేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇలా కొన్ని రోజులపాటు అమెరికాలోనే ఉన్నటువంటి చిరంజీవి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ విధంగా చిరంజీవి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తరుణంలో ఈయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగాస్టార్ చిరంజీవి అమెరికా వెళ్ళినది వెకేషన్ కోసం కాదని సర్జరీ కోసం అమెరికా వెళ్లారు అంటూ ఓ వార్త సంచలనగా మారింది దీంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్జరీ కోసం చిరంజీవి అమెరికా వెళ్లడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కాలికి మైనర్ సర్జరీ చేయించుకున్నారని సమాచారం అయితే ఈ సర్జరీ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సర్జరీ చాలా చిన్నదని తెలుస్తోంది.నిజానికి ఈయన తన భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు పనిలో పనిగా అక్కడ సర్జరీ చేయించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Chiranjeevi: చిరు కాలికి సర్జరీ…


ఇక చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు. ఈ సినిమా విడుదలైన అనంతరం చిరంజీవి కళ్యాణకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు. ఇక కాలు నొప్పి చేయడంతో ఈ నొప్పి నుంచి విముక్తి పొందడం కోసమే చిరంజీవి చిన్న సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది.

Balakrishna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య.. మోక్షజ్ఞ సినిమా వచ్చేది అప్పుడేనా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

తాజాగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వచ్చేయడాది ఉండబోతుంది అంటూ బాలయ్య అమెరికాలోని తానా సభలలో ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయాన్ని కూడా తెలిపారు.

మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని బాలకృష్ణ తెలిపారు. కానీ దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రం తెలియ చేయలేదు. బహుశా ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి బాలయ్య అంతా దైవేచ్ఛ అంటూ సమాధానం చెప్పారు.

Balakrishna: వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ..

ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రారంభమవుతాయని బాలయ్య తెలిపారు. అంటే ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులు ప్రారంభించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.దీంతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కూడా వచ్చే యేడాదే ఉండబోతుందని అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna: బాలయ్య సమక్షంలో బర్త్ డే జరుపుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన భార్య వసుంధరతో కలిసి అమెరికా వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా తన భార్యతో కలిసి అమెరికాలో పలు ప్రాంతాలకు పర్యటించడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా ఈయన హాజరవుతున్నారు అయితే తాజాగా బాలయ్యకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో భాగంగా ఓ యువతి బాలకృష్ణ వసుంధర సమక్షంలో కేక్ కట్ చేసి బర్తడే జరుపుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ దంపతుల పాదాలకు నమస్కారం చేసి వారి చేత ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అసలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే తప్పకుండా ఈమె తమ బంధువుల అమ్మాయి అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు కానీ నిజమా అది కాదు ఈమె ఒక సాధారణ బాలకృష్ణ అభిమాని మాత్రమే. ఈ ఒక్క ఫోటో చాలు బాలయ్య అభిమానులు అంటే ఎంత ప్రేమ చూపిస్తారో అనడానికి.

Balakrishna:అభిమాని పుట్టినరోజు జరిపిన బాలయ్య…


అమెరికాలో ఉన్నటువంటి ఓ బాలయ్య అభిమాని బాలకృష్ణ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒక సాధారణ అభిమానికి బాలయ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేయడంతో బాలయ్య మంచి మనసు పట్ల ఆయన అభిమానులపై చూపించే ప్రేమ పట్ల అభిమానులు ఫీదా అవుతున్నారు. ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది.

Chiranjeevi: ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం కోసం చిరంజీవి దంపతులు చేసిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.త్వరలోనే తన కూతురు సుస్మిత నిర్మాణంలో మరో సినిమాలో నటించబోతున్నారు.

ఈ క్రమంలోనే మరో కొత్త సినిమా ప్రారంభం అయ్యేలోగా మెగాస్టార్ చిరంజీవి వెకేషన్ వెళ్లి రావాలని ప్లాన్ చేసి తన భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఏమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లోప్రయాణం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం చేయడం కోసం మెగాస్టార్ దంపతులు ఎంత ఖర్చు చేశారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సురేఖ చిరంజీవి అమెరికా పర్యటన కోసం ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.

Chiranjeevi: విమాన ప్రయాణం కోసం ఎనిమిది లక్షలు…


ఈ విధంగా మెగాస్టార్ దంపతులు అమెరికా వెళ్లడం కోసమే ఎనిమిది లక్షల ఖర్చు చేశారు అంటే ఇంకా అక్కడ ఎంత మేరా ఖర్చులు వస్తాయో ఊహించుకొని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయంపై మరికొందరు భావిస్తూ మెగాస్టార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Chiranjeevi: భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు పయనమైన మెగాస్టార్… ఫోటోలు వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత దూకుడు కనబడుస్తున్నారు. ఈయన వరుస సినిమా షూటింగులలో పాల్గొంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరు తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు.

ఇలా ఈ సినిమాకు సంబంధించి తన పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి కొద్ది రోజులపాటు వెకేషన్ లో సరదాగా గడపడం కోసం ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్లో అమెరికా వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Chiranjeevi: సుస్మిత నిర్మాణంలో చిరు..


ఇక ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియా చేరుకున్న అనంతరం చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు తన కొత్త సినిమాని కూడా ప్రారంభించబోతున్నారు ఇక తన తదుపరి సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణంలో నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియజేయనున్నారు.