Tag Archives: bhola shankar

Year Ender 2023: 2023లో టాలీవుడ్ హీరోలకు కలిసి రాని రీమేక్ సినిమాలు.. మెగా హీరోలకు భారీ షాక్స్!

Year Ender 2023: సాధారణంగా ఒక భాషలో ఎంతో మచ్చి సక్సెస్ అయినటువంటి సినిమాలు మరొక భాషలో ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రీమేక్ సినిమాలు భారీ స్థాయిలో డిజాస్టర్ అయ్యాయని తెలుస్తుంది.

మరి ఈ ఏడాది రీమేక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ ఎదుర్కొన్నటువంటి హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ సాయి వరుణ్ తేజ్ హీరోలుగా నటించినటువంటి బ్రో సినిమా వినోదయ సిత్తం అనే సినిమాకు రీమేక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా 2015వ సంవత్సరంలో తమిళంలో వేదాళం సినిమాకు రీమేక్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా బెంగాలీ థ్రిల్లర్ విన్సి దా అనే చిత్రానికి రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.

సక్సెస్ అందుకోలేని రీమేక్ సినిమాలు…

రవితేజ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేశారు. రావణాసుర సినిమా కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది. ఈ సినిమాతో పాటు రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది ఇలా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రీమేక్ సినిమాలన్నీ కూడా ఎంతో నిరాశపరిచాయని చెప్పాలి.

Keerthy Suresh: కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తే సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందేనా… ఇదీ మరీ దారుణం?

Keerthy Suresh: కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు కథ ప్రాధాన్యత ఉంటే హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు.ఇలా కీర్తి సురేష్ ఇదివరకే సూపర్ స్టార్ రజనీకాంత్ కు అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాలో ఈమె రజనీకాంత్ కు చెల్లెలుగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈమె చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఈమె చెల్లెలు పాత్రలో నటిస్తుందన్నగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.

గతంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయని తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇలా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడం వల్లే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Keerthy Suresh: కథ బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుంది…


అయితే కొందరు మాత్రం కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.సినిమాలో నటీనటుల వల్ల సినిమాలు ఎప్పటికీ ఫ్లాప్ అవ్వని సినిమాలో కథ బలంగా ఉంటే సినిమా ఆటోమెటిగ్గా హిట్ అవుతుంది కానీ ఇలా సినిమా ఫ్లాప్ ను ఒకరి మీద తోసేయడం మంచిది కాదు అంటూ కొందరు కీర్తి సురేష్ పట్ల వస్తున్నటువంటి ఈ వార్తలపై విమర్శలు చేస్తున్నారు.

Keerthy Suresh: మెనూ అడిగినందుకు చిరు కీర్తి పీక పట్టుకున్నారా… వామ్మో ఇదే అరాచకం బాసు?

Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మెగా లీక్స్ ఒక వీడియోని విడుదల చేయగా అందులో చిరంజీవి కీర్తి సురేష్ పీకపట్టుకున్న సంఘటన మనం చూసాము అయితే తాజాగా అలా కీర్తి సురేష్ పీక పట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలియచేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కీర్తి కోసం తన ఇంటి నుంచే భోజనం వచ్చేదని చిరంజీవి తెలిపారు. మా ఇంట్లో తమిళ పనిమనిషి తనకు ఏమేం కావాలి అని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పంపించేవారని తెలిపారు.అయితే ఒక్కోసారి పప్పులో ఉప్పు కారం తక్కువైన కీర్తి వాటిని తినకుండా తిరిగి వెనక్కి పంపించేదని చిరు తెలిపారు.

Keerthy Suresh: మా ఇంటి ఫుడ్ తినేది..


ఇలా ఒక రోజు తాను షూటింగ్లో ఉండగా కీర్తి సురేష్ నా వద్దకు వచ్చి రేపు మెనూ ఏంటి అని నన్ను ప్రశ్నించింది. అయితే కోపం వచ్చిన తను సరదాగా కీర్తి పీక పట్టుకున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో నేటిజన్స్ పాపం మెనూ అడిగినందుకు పీక పట్టుకోవడం ఏంటి బాసు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Hyper Aadi: భోళా శంకర్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆది… శక్తి షాడో అంటూ?

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా అది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా సందడి చేశారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి జంజం జజ్జనక అనే సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన బర్త్డే రావడంతో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని తెలిపారు. ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఈయన ఆకాంక్షించారు.ఇక మెహర్ రమేష్ గురించి మాట్లాడుతూ మెహర్ రమేష్ అంటే ప్రతి ఒక్కరూ శక్తి షాడో సినిమాలను మాత్రమే గుర్తు చేసుకుంటారు. మంచి సక్సెస్ సాధించినటువంటి ప్రభాస్ కెరియర్లో మోస్ట్ స్టైలిష్ మూవీ ఏదైనా ఉందా అంటే అది బిల్లా మాత్రమే ఆ సినిమాకు డైరెక్టర్ రమేష్ అని గుర్తు చేశారు.

Hyper Aadi: ప్రతి దానికి టైం కావాలి…


ప్రతి ఒక్కరికి సక్సెస్ ఫెయిల్యూర్ రావడం సర్వసాధారణం కానీ సక్సెస్ మర్చిపోయి ఫెయిల్యూర్స్ గుర్తించి ట్రోల్ చేయడం మంచిది కాదని 100 సెంచరీలు కొట్టిన కోహ్లీ కూడా ఇప్పుడు ఒక సెంచరీ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం మన టైం బాగలేదని అర్థం ప్రతిదానికి టైం రావాలి.ఫెయిల్యూర్స్ వల్లే ట్రోల్ చేయాల్సి వస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరుని ట్రోల్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆది చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi Birthday Special: చిరంజీవి బర్త్ డే స్పెషల్ మరోసారి వెండితెరపై విడుదల కానున్న ఆ బ్లాక్ బస్టర్ చిత్రం?

Chiranjeevi Birthday Special:సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాని తిరిగి విడుదల చేయడంతో ఏకంగా 1. 73 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇలా పోకిరి సినిమా మంచి వసూలను రాబట్టడంతో మిగతా హీరో అభిమానులు సైతం తమ హీరోల పుట్టినరోజు వేడుక కోసం ఇలా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి విడుదల చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇలా సినిమాలు తిరిగి విడుదల చేయడం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ అవుతుంది. అయితే సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన జల్సా సినిమాని విడుదల చేయడానికి అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటైనటువంటి ఘరానా మొగుడు సినిమాని తిరిగి ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియడంతో అభిమానులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Chiranjeevi Birthday Special: వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్…

అయితే ఇలా పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని అర్థమవుతుంది.ఏది ఏమైనా ఇలా తిరిగి సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్ద ఎత్తున థియేటర్ కి వెళ్లి చూడటం గమనార్హం. ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఈయన గాడ్ ఫాదర్ , భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమా రీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఘనంగా ప్రారంభమైన మెగాస్టార్ భోళా శంకర్..!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలు మెగాస్టార్ చిరు స్పీడ్ ని అందుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి బోళా శంకర్ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాజరై అట్టహాసంగా నిర్వహించారు.

సీనియర్ దర్శకులు రాఘవేంద్ర రావు, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, గోపీచంద్ మలినేని ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బోళా శంకర్ సినిమా తమిళ హిట్ వేదాళంని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ గా విడుదల కానుంది. సామాజిక అంశంతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డేనటించింది.

మెగా అభిమానులకు శుభవార్త.. భోళాశంకర్ నుంచి అదిరిపోయే అప్డేట్..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. అయితే ఒక వైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొకవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు పుట్టిన రోజున భోళాశంకర్ సినిమా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. తమిళం వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా బోళా శంకర్ సినిమా రాబోతోంది. అయితే ఈ బోళా శంకర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు.

తాజాగా మెగా స్టార్ అభిమానులకు భోళాశంకర్ సినిమా నుంచి సర్ ప్రైజ్ ను ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టేసారు.వచ్చే నెల నవంబర్ 11న ఉదయం 7:45 నిమిషాలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. అలాగే నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు మహతి సర్వ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలు కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది.

మెగా అభిమానులకు శుభవార్త.. దీపావళి కానుకగా ఆ సినిమాకు ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 152 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 90 శాతం పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ అప్పుడే అంటూ ఎన్నో రకాల డేట్లు, వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. చిరంజీవి ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగానే మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా అవుతోంది.

ఈ సినిమాలతో పాటు గా మొహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, అలాగే బాబీ లతో చిరు సినిమాలు చేయాల్సి ఉండగా వీటిలో ముందుగా బాబు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిరు ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6న లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మాస్ మసాలా కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు వాల్తేరు వాసు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇందులో రామ్ చరణ్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ చిరంజీవి మాజీ నక్సలైట్ గా కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ రెజీనా ఒక ప్రత్యేక సాంగ్ లో మెగాస్టార్ తో ఆడి పాడిందని సమాచారం.

వామ్మో కీర్తి సురేష్ ఒకే సారి ఇంత రెమ్యునరేషన్ పెంచేసిందా..?

కీర్తి సురేష్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్’ సినిమాతో సిని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ఆ తరువాత అ..ఆ తో తెలుగు సినిమాలలోకి తెరంగ్రేటం చేసింది. తన మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఇక మహానటి సినిమాతో ఒక్క తెలుగు ఆడియన్స్‌ మాత్రమే కాకుండా తమిళం, హిందీలో బాషలలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్.

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’తో జాతీయ స్థాయి ఉత్తమ నటి పురస్కారం అందుకొని స్టార్ హీరోయిన్‌ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ పారితోషికం వచ్చింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ తో కలిసి నటించిన దసరా సినిమాకి కీర్తి సురేష్ మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల దసరా సినిమా మోషన్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్ లో కనిపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ isc సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

#BholaShankar భోళా శంకర్‌‌గా మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి మాములుగా ఉండదు!

మెగాస్టార్ చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే “ఖైదీ నెంబర్ 150” చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తరువాత “సైరా నరసింహారెడ్డి” ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం చిరంజీవి తన 153 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ నటించబోయే 154 వ చిత్రానికి సంబంధించి తాజా ప్రకటన తెలియజేశారు.

మెగాస్టార్ తన 154వ చిత్రంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” సినిమాకు రీమేక్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను చిత్రబృందం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈసినిమాకు “భోళాశంకర్”అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన టువంటి “వేదాళం” సినిమా ఎంతో విజయవంతమైంది. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం మెగాస్టార్ కి వచ్చింది.

వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ కీలక పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందనే సమాచారం వినబడుతుంది. మొత్తానికి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా తన 154 వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని తెలియజేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.