Tag Archives: Bigg Boss 7

Pallavi Prashanth: రైతులు సాయం కోసం ఎవరు మా ఇంటికి రావద్దు.. ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రెటీగా బయటకు వచ్చారు.ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఆట తీరు చూసి ఎంతో మంది ఈయనకు అభిమానులకు మారిపోయి చివరికి విన్నర్ గా తనని గెలిపించారు. ఇలా విన్నర్ గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ బయట మాత్రం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు వచ్చే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు అందిస్తానని చెప్పారు కానీ ఇన్ని రోజులపాటు ఈ పని చేయకుండా ఉండడంతో మాట తప్పారని అందరు కామెంట్ చేశారు కానీ ఇటీవల ఈయన ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలను అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

అయితే ఇంకా తన వద్ద డబ్బు ఉంది తన టీం మొత్తం పేద రైతులను పరిశీలించి వారి గురించి అన్ని తెలుసుకునే వారికే డబ్బు అందజేస్తారని పల్లవి ప్రశాంత్ తెలిపారు అందుకు సంబంధించిన వీడియోలను కూడా మీకు తెలియజేస్తానని తెలిపారు. ఇక ఈయన పేదల రైతులకు సహాయం చేస్తానని చెప్పడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది తాము పేద రైతులను తమకు సహాయం చేయండి అంటూ తన ఇంటికి క్యూ కట్టారట.

డబ్బు కోసం రావద్దు..
ఇలా పెద్ద ఎత్తున రైతులు సహాయం కావాలి అంటూ తన ఇంటికి రావడంతో ఈయన వారందరిని ఒకటే వేడుకున్నారు డబ్బు సహాయం చేయమని దయచేసి ఎవరూ మా ఇంటికి రావద్దు అమ్మ నాన్నలను విసిగించవద్దు. ఎవరు పేదవారు అనే విషయాలను మేమే తెలుసుకొని స్వయంగా వారి దగ్గరకు మేమే డబ్బు తీసుకువస్తామని అంతవరకు ఎవరు మా ఇంటికి రావద్దు అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Pallavi Prashanth: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. ఏకంగా లక్ష సాయం?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని అనుభవిస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తాను కనుక విజేతగా నిలబడితే నాకు వచ్చే ప్రైజ్ మనీ రైతుల కోసం ఇస్తానని పేద రైతులకు ఆ డబ్బును ఇచ్చి వారికి కుటుంబాలకు అండగా నిలబడతానని తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయి దాదాపు మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు ఈయన ఎవరికి సహాయం చేయలేదు.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ రైతులకు సహాయం చేయకపోవడంతో ఈయన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మాట ఇచ్చి మర్చిపోయారని చాలామంది ఈయన పట్ల ట్రోల్ చేశారు అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి డబ్బును రైతులకు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

సందీప్ మాస్టర్ సహాయం..
ఈ క్రమంలోనే గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయల సహాయం అందించారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల కోసం ఈయన లక్ష రూపాయలు సహాయం చేయడమే కాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా పంపించారు. అయితే ఈయనకు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందించటం విశేషం.

https://www.instagram.com/reel/C4hFzPoy1FW/?utm_source=ig_embed&ig_rid=86493dee-ff8d-4225-aa50-19b92221d241

Bigg Boss 7: రికార్డ్ స్థాయిలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే… రేటింగ్ ఎంతో తెలుసా?

Bigg Boss 7: తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఇటీవల ఏడవ సీజన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్లో కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టి ఒక కామన్ మెన్ విజేతగా నిలవడం అనేది బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు.

అయితే గత సీజన్లో మాదిరి కాకుండా ఈసారి మాత్రం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎవరు ఊహించని విధంగా టాస్కులను పెట్టడం ఎలిమినేషన్లలో ట్విస్టులు ఇవ్వడం వంటివి ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో టైటిల్ రేసులో అమర్ శివాజీ అర్జున్ వంటి వారు వచ్చారు.

ఇక వీరందరిని కాదని పల్లవి ప్రశాంత్ కూడా టైటిల్ రేసులోకి రావడంతో ఈ కార్యక్రమం పై ఆసక్తి నెలకొంది పల్లవి ప్రశాంత్ విజేత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కావడంతో ఈ ట్రోఫీ ఎవరికి అందిస్తారు అన్న ఆత్రుత అందరిలోనూ కలిగింది. దీంతో ఈ ప్రభావం గ్రాండ్ ఫినాలేపై పడిందని చెప్పాలి ఈ గ్రాండ్ ఫినాలే కూడా ఎంతో ఘనంగా జరిగింది.

రికార్డ్ స్థాయిలో రేటింగ్..

ఇకపోతే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు వచ్చినటువంటి రేటింగ్ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. టెలివిజన్ రేటింగ్ లో ఏ షోకి రాని విధంగా బిగ్ బాస్ ఈ గ్రాండ్ ఫినాలే షో ఏకంగా 21.7 రేటింగ్ సంపాదించుకుందని తెలుస్తుంది. ఇలా ఒక బుల్లితెర షో ఈ స్థాయిలో రేటింగ్ సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ సీజన్ మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే ఓటీటీ సీజన్ 2 కూడా నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

Priyanka Jain: 15 వారాలకు బిగ్ బాస్ నుంచి ప్రియాంక జైన్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Priyanka Jain: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు ఈమె బుల్లితెర సీరియల్ నటిగా పలు సీరియల్స్ లో నటిస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటి కంటెస్టెంట్గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె మొదటి కొన్ని వారాలలోనే హౌస్ నుంచి బయటకు వస్తుందని భావించారు. కానీ ప్రియాంక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా ఆట ఆడుతూ 15వ వారం వరకు కొనసాగారు.

ఇలా 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఏకైక లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక పేరు పొందారు. ఇక ఈమెను హౌస్ నుంచి నాగార్జున 15వ వారం బయటకు తీసుకోవచ్చారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు కొనసాగినటువంటి ఈమెకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి బిగ్ బాస్ నుంచి ప్రియాంక జైన్ ఎంత మొత్తంలో సంపాదించారు అనే విషయానికి వస్తే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికంటే ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులతో వారానికి 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈమె 15 వారాలపాటు హౌస్ లో కొనసాగగా తనకు 37.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వచ్చిందని తెలుస్తుంది.

భారీగా సంపాదించిన ప్రియాంక…

ఇలా 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఈమె సంపాదించినటువంటి ఈ డబ్బులు తన ఫ్యామిలీనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయటానికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలుస్తుంది అయితే ప్రియాంక తల్లిదండ్రులు ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ తన ప్రియుడు శివకుమార్ ఒక వీడియో సందర్భంగా వెల్లడించారు.

Bigg Boss 7: అమర్ జాతకాన్ని మొత్తం బయటపెట్టిన అర్జున్… అమర్ ను ఓ ఆట ఆడుకున్న శివాజీ!

Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం మరొక రెండు రోజులలో పూర్తి కానుంది. సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని మరొక రెండు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ఆరుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఫన్నీ టాస్కులను ఇచ్చారు.

ఈ క్రమంలోనే అమర్ దీప్ జ్యోతిష్యుడుగా హౌస్ లో ఉన్నటువంటి వారి జాతకం చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక జ్యోతిష్యుడుగా అవతారం ఎత్తినటువంటి అమర్ ప్రతి ఒక్కరి గురించి జాతకాలు చెబుతూ ఫన్ క్రియేట్ చేశారు. అయితే అందరి జాతకం చెప్పినటువంటి అమర్ అర్జున్ జాతకం చెప్పబోయేలోపు అర్జున్ అమర్ జాతకాన్ని చెప్పారు.

అమర్ గురించి అర్జున్ చెబుతూ అనగనగా ఒక కారు..నాకు ఆ కారే గుర్తుకు వస్తుందంటూ చెప్పబోతూ ఉండగా వెంటనే అమర్ నీకు ఒక దండం బాబోయ్ ఆపేయండి అంటూ చెప్పుకోవచ్చు అంతేకాకుండా శివాజీ కూడా అమర్ జాతకాన్ని చెప్పారు. అమర్ మొదటి నుంచి కూడా చాలా దూకుడుతో వెళ్తున్నారని ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఇప్పుడు క్లోజ్ అయ్యాం అంటూ చెప్పారు.

కప్పు గెలుచుకునేది ఎవరు..

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకరి జాతకాలను ఒకరి చొప్పుకుంటూ చాలా ఫన్నీగా గడిపారు. ఇక ఆదివారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరగబోతున్నటువంటి నేపథ్యంలో విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్ మాత్రమే కాకుండా అమర్ శివాజీ కూడా ఉన్నారు. మరి టైటిల్ ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది.

Bigg Boss 7: మీడ్ వీక్ ఎలిమినేషన్ బయటకు రానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్…మామూలు ఉల్టా పుల్టా కాదుగా?

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరొక మూడు రోజులలో పూర్తికానుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు అయితే వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి బయటకు రాగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలేకి చేరుకుంటారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ అమర్ శివాజీ ఈ ముగ్గురు కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా యావర్ ప్రియాంక ఇద్దరు కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా కొనసాగడమే కాకుండా ఫిజికల్ టాస్కులలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆట తీరును కనపరుస్తున్నారు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక హౌస్ లో ఉన్నటువంటి ఈ ఆరుగురిలో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చారు. అంతే కాకుండా ఈయన ఒకరి దగ్గర మరొకరి మాటలను మాట్లాడుతూ నెటిజెన్స్ నుంచి కాస్త నెగిటివిటీనీ మూటగట్టుకున్నారు.

ఓటింగ్ లో వెనుకబడ్డ యావర్

ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం యావర్ ఓటింగ్ శాతం తగ్గిందని తెలుస్తుంది. దీంతో మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి యావర్ ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు రాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే యావర్ బయటకు వస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని చెప్పాలి. మరి ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు రాబోతున్నారు ఎవరు కప్ అందుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Tejaswini: ఇప్పటికైనా మనుషులు ఎలాంటివారో అర్థం చేసుకో… ప్రియాంక పై ఫైర్ అయిన అమర్ భార్య తేజు?

Tejaswini: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ భార్య తేజస్విని ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరగగా అందులో అమర్ చాలా వరకు పోరాడారు. అయితే ఈయనకు కొందరు పాయింట్స్ ఇవ్వటం వల్ల చివరి వరకు కొనసాగారు అనే సంగతి మనకు తెలిసిందే అయితే అర్జున్ మొదటి ఫైనల్ లిస్ట్ గా అడుగుపెట్టారు.

ఈ టాస్కులలో భాగంగా అమర్ ప్రియాంక పట్ల కాస్త వైల్డ్ గా వ్యవహరించారు ఆమెపై ఫిజికల్ అటాక్ చేసారు. దీంతో ఆమె అమర్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన పాయింట్స్ ఇవ్వకుండా గౌతమ్ కి ఇచ్చేశారు. దీంతో అమర్ కూడా కాస్త అప్ సెట్ అయ్యారు. ఇలా మొదటిసారి గౌతమ్ కి తన పాయింట్స్ ఇచ్చినటువంటి ఈమె రెండోసారి కూడా అమర్ కి ఇవ్వాలని అనుకోలేదు.

ఇక వీరిద్దరూ కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలుసు. ఇలా తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయకపోవడంతో అమర్ ఫాన్స్ కూడా ఈ విషయంలో కాస్త ఫీలయ్యారు. ఈ క్రమంలోనే అమర్ భార్య తేజు కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె తన భర్తకు ధైర్యం చెబుతూ బలంగా నిలబడు ఇప్పటికైనా మనుషులు ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకో అంటూ పోస్ట్ చేశారు.

బలంగా నిలబడు…

ఈ విధంగా తేజు ఇలాంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె ప్రియాంకను ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఈమె ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రియాంకతో అసలు మాట్లాడలేదు కనీసం తన వైపు కూడా చూడలేదు ఇప్పుడు కూడా తన గురించే ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇక ప్రియాంక బయటకు వచ్చినా కూడా తేజు మాట్లాడే అవకాశం లేదు అని పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 7: మొదటి ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్… అమర్ ను బలి పశువును చేసిన శోభ?

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం 13వ వారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వారంలో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అందరూ కూడా ఈ ఫినాలే రౌండ్ నుంచి తప్పుకోవడంతో చివరికి అర్జున్ డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ కు చేరారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ టాస్కుల నుంచి తప్పుకోవడంతో చివరికి అమర్ అర్జున్ మిగిలారు. ఇక అమర్ కూడా శోభ చెప్పిన విధంగా ఆట ఆడుతూ కన్ఫ్యూజన్ అయ్యారు. దీంతో అర్జున్ ఫినాలేకి చేరుకున్నారు.

ఇలా అర్జున్ ఫైనల్ కు వెళ్లడంతో తిరిగి మరోసారి అమర్ కు నిరాశ ఎదురయింది. అయితే శోభ తన అతి తెలివితేటలను ప్రదర్శిస్తూ అమర్ కు గొడవ పెట్టాలని ప్రయత్నం చేశారు. గౌతమ్ ఈ టాస్క్ నుంచి తప్పుకోవడంతో తన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ సగం తన స్నేహితుడైనటువంటి అర్జున్ కి ఇవ్వాలని అనుకుంటాడు కానీ ప్రియాంక చెప్పడంతో ఆ పాయింట్స్ కాస్త అమర్ కి ఇస్తుంది. అయితే గౌతమ్ తన పాయింట్స్ ఇస్తూ ఇవి ప్రియాంక పాయింట్స్ అయితే ఇకపై తనని ఏమీ అనుకు అంటూ ఇచ్చారు దీంతో అమర్ కూడా సైలెంట్ అయ్యారు.

ఇలా గౌతమ్ పాయింట్స్ అమర్ కి ఇవ్వడంతో మధ్యలో ఇన్వాల్వ్ అయినటువంటి శోభా ఏమనకు అంటే ఏంటీ.. పాయింట్స్ ఇస్తే ఇవ్వు.. అలా అనడం కరెక్ట్ కాదు గౌతమ్ అంటూ గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ గౌతమ్ ఆమె మాటలను పట్టించుకోలేదు. తిరిగి మరోసారి అర్ధరాత్రి ఇదే రచ్చ చేసింది శోభా శెట్టి. పల్లవి ప్రశాంత్ వద్ద ఏవిక్షన్ పాస్ ఉంది. మళ్లీ పవర్ అస్త్రను కూడా తనే గెలిస్తే ఎలాగ అందుకే నీకు సపోర్ట్ చేయమని వెళ్లి అర్జునుని అడుగు అంటూ పంపించింది. అమర్ శోభ చెప్పిన విధంగానే తనని వెళ్లి అడిగారు.

మొదటి ఫైనలిస్ట్ గా అర్జున్…

అమర్ తనకు సపోర్ట్ చేయమని అర్జునుని అడగడంతో అర్జున్ వెంటనే వాడు కూడా మనిషి కదరా తనకు సపోర్ట్ చేస్తే ఏంటి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.దీంతో వాడికి ఎవిక్షన్ పాస్ ఉంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత మూడు టాస్కులలో అర్జున్ గెలిచి మొదటి ఫైనల్ లిస్ట్ కాగా శోభ అతి తెలివితేటలకు అమర్ బలి అయ్యారని తెలుస్తుంది.

Bigg Boss 7: కంటెస్టెంట్ల మధ్య జరిగిన నామినేషన్స్ రచ్చ.. నా తల తీసేసిన అంటూ రెచ్చిపోయిన గౌతమ్!

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సరికొత్త టాస్కుల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎదుట ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇక 12 వారాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం 13వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా రచ్చ రచ్చగా కొనసాగిందని తెలుస్తోంది.

u

ఇక ఇందులో ఎవరైతే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారికి రంగులు పూసి నామినేట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలపాలని బిగ్ బాస్ చూచించారు అయితే ఈసారి మాత్రం శివాజీని హౌస్ మెట్ లో టార్గెట్ చేశారని తెలుస్తోంది. సీరియల్ బ్యాచ్ మొత్తం శివాజీని టార్గెట్ చేయడంతో యావర్ ప్రశాంత్ ప్రియాంక శోభ శెట్టిలను టార్గెట్ చేశారు.

ఇక ఈ వారం అమర్ దీప్ మినహా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కూడా జరిగాయి ముఖ్యంగా గౌతమ్ శివాజీ మధ్య పెద్ద గొడవే జరిగిందని చెప్పాలి గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ.. శివాజీ అన్నతో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన మొదటి నుంచి తనకు కంఫర్టబుల్ గా ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్న వచ్చారు నాకు అడ్డుపడుతున్నారు అంటూ శివాజీని నామినేట్ చేయగా శివాజీ కూడా అందుకు దీటుగానే సమాధానం ఇచ్చారు.

స్టెరాయిడ్స్….

ఇక యావరు గౌతమ్ ని నామినేట్ చేశారు. నువ్వు నేను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను అని మాట్లాడావు అంటూ గౌతమ్ ని నామినేట్ చేశారు. ఇంతలో శివాజీ గురించి చర్చ రావడంతో గౌతమ్ రెచ్చిపోయారు మీరు నా తల తీసిన కూడా నేను శివాజీ గురించి ఇలాగే మాట్లాడతాను అంటూ గౌతమ్ చెప్పారు. ఇక శివాజీని సీరియల్ బ్యాచ్ మొత్తం టార్గెట్ చేయడంతో ప్రిన్స్ యావర్ కూడా గౌతమ్ అర్జున్ తో పాటు ప్రియాంక శోభా శెట్టిని కూడా నామినేట్ చేశారు.

Bigg Boss 7: రతికకు షాక్ ఇవ్వబోతున్న రైతు బిడ్డ… బయటకు రాబోతున్న రతిక!

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం నేటితో 12 వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇక ఫైనల్స్ కు మూడు వారాలు మాత్రమే ఉండడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే శనివారం అశ్విని హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక నేడు హౌస్ నుంచి ఎవరు బయటికి రానున్నారు అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ వారం రతిక బయటకు రాబోతున్నారని తెలుస్తుంది.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ప్రియాంక, శోభా శెట్టి మాత్రమే లేరు మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పటికే అశ్విని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. ఇక డేంజర్ పొజిషన్లో ఉన్నది అర్జున్ రతిక. ఈరోజు వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటకు రావాల్సి ఉంది.

ఈవారం హౌస్ నుంచి రతిక నేడు ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తుంది. అర్జున్ కోసం పల్లవి ప్రశాంత్ తన వద్ద ఉన్నటువంటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడబోతున్నారని దాంతో అర్జున్ సేఫ్ అవ్వగా రతిక బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఏవిక్షన్ ఫ్రీ పాస్ రతికకు ప్రశాంత్ అసలు ఉపయోగించరు. ఈమె తిరిగి హౌస్ లోకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ను బాగా టార్గెట్ చేశారు.

ఎలిమినేట్ కానున్న రతిక

ఇలా రతిక కోసం పల్లవి ప్రశాంత్ ఎలాంటి పరిస్థితులలోను ఏవిక్షన్ పాస్ ఉపయోగించే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో రైతుబిడ్డ దెబ్బకు రతిక బయటకు రాబోతుందని తెలుస్తుంది. మొదట్లో కూడా ఈమెను పల్లవి ప్రశాంత్ నామినేషన్ లోకి తీసుకువచ్చారు. అప్పుడు కూడా ఈమె ఎలిమినేట్ అయితే మరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఈసారి కూడా పల్లవి ప్రశాంత్ కారణంగానే బయటకు పోతుందని తెలుస్తోంది.