Tag Archives: dance

Amalapaul: బేబీ బంప్ తో పబ్ లో డాన్స్ చేస్తున్న అమలాపాల్.. ఏం సందేశం ఇస్తునావంటూ ట్రోల్స్?

Amalapaul: అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో పలు భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించినటువంటి అమలాపాల్ ప్రస్తుతం అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఈమె ఇది వరకే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం ఈమె కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఇటీవల జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక వీరి వివాహం గత ఏడాది నవంబర్ నెలలో జరగగా పెళ్లయిన రెండు నెలలకి ఈమె ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ కూడా తెలియజేశారు. ఇలా తరచూ తన బేబీ బంప్ ఫోటోలతో ఈమె పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

భర్తతో డాన్స్…
ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన భర్తతో కలిసి పబ్ లో పెద్ద ఎత్తున డాన్స్ చేస్తూ కనిపించారు. ఏడు నెలల గర్భంతో ఇలా పబ్ లో అమలాపాల్ డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కడుపుతో డాన్సులు చేస్తూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Ramcharan: ఖాన్స్ తో కలిపి కాలు కదిపినందుకు చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ramcharan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ తారలందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసినందుకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే వేదికపై వీరందరూ ఫర్ఫార్మెన్స్ చేసినందుకు మరికొంత మొత్తంలో చార్జ్ చేశారని వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు స్టెప్పులు వేశారు అనంతరం వీరితో పాటు రామ్ చరణ్ ని కూడా వేదికపైకి పిలిచి మరి అతనితో కలిసి డాన్సులు వేశారు. ఇలా వీరందరూ కలిసి వేదికపై డాన్స్ చేసినందుకు భారీగా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నార్త్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు. తాము ఈ పెళ్లి వేడుకలను ఎంతో ఎంజాయ్ చేశామని తెలిపారు.

రూపాయి కూడా తీసుకోలేదు…
ఇక తాము డబ్బు తీసుకొని మరి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని నార్త్ సెలబ్రిటీలు కొట్టి పారేశారు. ఇక రామ్ చరణ్ అయితే కనీసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని ఈయన అంబానీ పిలుపుమేరకు పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారని తెలుస్తోంది. ఇలా పెర్ఫార్మెన్స్ చేసినందుకు డబ్బు తీసుకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈ వార్తలను ఖండిస్తున్నారు.

Allu Arjun: హీరోలు అవ్వాలంటే డాన్స్ అవసరం ఏ మాత్రం లేదు… అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బేబీ సినిమా అప్రిషియేషన్ ఈవెంట్లో పాల్గొన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జులై 14వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఇలా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా పట్ల ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ అప్రిషియేషన్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ తనకు డాన్స్ రాదని కానీ అల్లు అర్జున్ చూసి నేర్చుకుంటున్నానని తెలిపారు..

ఆనంద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. హీరోలు కావాలి అంటే డాన్స్ అవసరం లేదని తెలిపారు.నాకు డాన్స్ వచ్చు కనుక నాలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెట్టి వారిని వారు నిరూపించుకోవాలని తెలిపారు.

Allu Arjun:

ఇక హీరోలు అవ్వాలి అంటే ఫైట్స్ డాన్స్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈయన ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆగిరిపోయే అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోష పరిచారు.

Sai Dharam Tej: స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నాను… సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాటలలో సాయి ధరమ్ చేసినటువంటి డాన్స్ చూసి నేటిజన్స్ విమర్శలు కురిపించారు.

ఈ విధంగా సాయిధరమ్ తేజ్ డాన్స్ సరిగా చేయకపోవడంతో ఈయన ప్రమాదం జరిగిన తర్వాత డాన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే సాయి ధరంతేజ్ తాజాగా తన డాన్స్ గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో తనకు స్టెరాయిడ్స్ ఇచ్చారని తెలిపారు.

ఈ విధంగా తాను కోలుకోవడానికి స్టెరాయిడ్స్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాటి ప్రభావం తనలో ఇంకా ఉందని అందుకే తాను సరిగా డాన్స్ చేయలేకపోతున్నానని తెలిపారు. నా డాన్స్ పట్ల అభిమానులు మాత్రమే కాదు నేను కూడా తృప్తి పొందలేదని తెలిపారు.అయితే ప్రమాదం జరిగిన తర్వాత తాను మాట్లాడలేకపోయానని ఇప్పుడిప్పుడే వాటిని అధిగమించి మాట్లాడగలుగుతున్నాను.

Sai Dharam Tej: నా డాన్స్ నాకే నచ్చలేదు…


దీనిని సాకుగా చెప్పినేను అలాగే ఉండను త్వరలోనే డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాను. తాను ప్రమాదం తర్వాత ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ కోల్పోయాను అయితే ఆ ఫిట్నెస్ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నానని అలాగే డాన్స్ కూడా మునుపటిలాగే చేసి మీ అందరిని సంతోష పెడతాను అంటూ ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Saidharam Tej: సాయిధరమ్ తేజ్ కి ఇది పునర్జన్మ… ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుకుమార్!

Saidharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకున్నటువంటి సాయి ధరంతేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ హీరో సాయిధరమ్ తేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఎంతో చలాకీగా ఉండేవారు.

ఇక ఈయన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి ఈయనని తిరిగి షూటింగ్ లొకేషన్లో చూసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.ఎంతో అద్భుతమైన నటనను కనబరిస్తూ, ఎంతో అవలీలగా డాన్స్ చేసే సాయి తేజ్ ప్రమాదం తర్వాత నటించడానికి, డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ క్షణం తనని చూసి కన్నీళ్లు ఆగలేదని ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు.

Saidharam Tej:డాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు…

ఈ ప్రమాదం నుంచి బయటపడి ఈయన కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ లొకేషన్లోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది.నిజంగానే ఇది ఈయనకు పునర్జన్మ అంటూ సాయి తేజ్ గురించి సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా రాబోతున్న ఈ హీరోకి ఎలాంటి సక్సెస్ అందుతుందో తెలియాల్సి ఉంది.

Rashmika: డాక్టర్ ను సంప్రదించిన రష్మిక.. అసలేమైందంటూ కంగారు పడుతున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మరోవైపు సినిమా షూటింగులతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా ఎంతో చలాకిగా ఉండే రష్మిక డాక్టర్ వద్దకు వెళ్లిందని తెలియగానే అసలు ఆమెకు ఏం జరిగింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈమె హైదరాబాద్లోనే ఆర్థోపెడిక్ గురువారెడ్డిని సంప్రదించినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా రష్మిక తన వద్దకు చికిత్స కోసం వెళ్ళినట్టు తెలియజేశారు.అయితే ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని ఆమె గత కొద్ది రోజులుగా మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడటం వల్ల చికిత్స కోసం తన వద్దకు వచ్చిందని ఈయన తెలియజేశారు.

రష్మిక సామి సామి అంటూ డాన్స్ చేస్తూ బరువు మొత్తం మోకాలి పై వేయటం వల్ల ఇలా నొప్పులు వచ్చాయి. అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లికి సరదాగా పెద్దవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి అభినందించాలనుకున్నాను అయితే మోకాలి నొప్పి ద్వారా నన్ను కలిసే సందర్భం వచ్చిందని డాక్టర్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Rashmika: భుజం నొప్పి అంటూ బన్నీ వస్తాడేమో…

ఇలా రష్మిక మోకాళ్ళ నొప్పుల గురించి ఈయన తన ఫేస్ బుక్ స్టోరీ ద్వారా షేర్ చేయడమే కాకుండా త్వరలోనే అల్లు అర్జున్ కూడా తన వద్దకు వస్తాడేమో తనకు కూడా భుజం నొప్పిగా ఉందంటూ వస్తాడేమోనని ఈ సందర్భంగా డాక్టర్ గురువారెడ్డి ఫేస్ బుక్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

TikTok Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయిన దుర్గారావు దంపతులు!

Tik Tak Durgarao: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎంతగా అంటే ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోయేలా క్రేజ్ దక్కించుకొని ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు.

Tik Tak Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయినా దుర్గారావు దంపతులు?

ఈయన ఎక్కడో మారుమూల గ్రామంలో రోజువారి కూలి పనులు చేస్తూ మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళుతూ సాయంత్ర సమయంలో తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వారు. ఇలా వీరిద్దరి డాన్స్ వీడియోలకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

Tik Tak Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయినా దుర్గారావు దంపతులు?

టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో నే ఏకంగా 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇక ఇలా వీరిద్దరికి వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను, అలాగే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సెలబ్రిటీలుగా మారారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గా రావు దంపతులు వారి జర్నీ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఊర్లో చాలామంది మా పై విమర్శలు చేశారు…

రోజువారీ కూలీ పనులు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న తనకు తన మేనల్లుడు ద్వారా టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నాను. అయితే తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సమయంలో ఊర్లో దాదాపు 80% మంది తనని విమర్శించారని ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. వీడు పెళ్ళాంతో కలిసి చిందులు వేయడం ఏంటి అంటూ సొంత వాళ్లే మమ్మల్ని దారుణంగా తింటారు. అయితే మేం అవేమీ పట్టించుకోకుండా మేము చేసే పని చాలా నిజాయితీగా చేస్తున్నాము, ఎలాంటి తప్పు పని చేయలేదనీ వారి మాటలు పట్టించుకోకుండా మా ప్రయత్నాలు మేము చేసాము. ఆ భగవంతుడి దయవల్ల, అభిమానులు ఎంతగానో ఆదరించి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారని ఈ సందర్భంగా టిక్ టాక్ దుర్గా రావు దంపతులు ఎమోషనల్ అవుతూ ఈ విషయాలను వెల్లడించారు.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని భాషలలో స్టార్ హీరోలతో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల తమిళ హీరో విజయ్ తో బీస్ట్ సినిమాలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన జానీ మాస్టర్ టాలీవుడ్ లో ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తుతుంటాడు. అయితే జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీతో బిజీగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. బుల్లితెర మీద ప్రసారమౌతున్న ప్రముఖ డాన్స్ షో ” ఢీ “. ఈ ఢీ షోతో జానీ మాస్టర్ కి ఎంతో అనుబంధం ఉంది. మొదట ఈ షోలో తన కెరీర్ స్టార్ట్ చేసిన జానీ మాస్టర్ తర్వాత ఆ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

ఇటీవల జానీ మాస్టర్ ఢీ షోలో తెగ సందడి చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, జానీ మాస్టర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఈ షోకి అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇటీవల షోకి సంబంధించిన ప్రోమో మొదలైంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది, జానీ మాస్టర్ కి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. జానీ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటే ఆది కుప్పిగంతులు వేసాడు. తర్వత ప్రదీప్ వచ్చి ఇద్దరికీ ఎన్ని ఓట్లు వచ్చాయని అనగా.. టై అయిందని ఆది అన్నాడు. దీంతో జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

గతాన్ని గుర్తు చేసుకున్న జానీ మాస్టర్…

గతంలో జానీ మాస్టర్ చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ..జడ్జ్‌లను కూడా ఎదురించేవాడు. ఆది టై అయింది అనటంతో జానీ మాస్టర్ గతంలో తను అన్న మాటలు గుర్తు చేశాడు. నాకు డాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు.. అందుకే నేనూ వెళ్ళిపోతా అంటూ స్టేజి దిగి వెళ్లిపోతుంటే ఆది మాట్లాడుతూ.. మాస్టర్ మీరు ఇలా చేయటం వల్లే నేను బ్యాడ్ అవుతున్నా అని అంటాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగ నవ్వారు.

Sreemukhi: శ్రీముఖితో రెచ్చిపోయి డాన్స్ వేసిన యశ్ మాస్టర్… ఆగ్రహం వ్యక్తం చేసిన యశ్ భార్య!

Sreemukhi: సాధారణంగా ప్రతి సంవత్సరం బుల్లితెర చానల్స్ యానివర్సరీ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. ఇలా ఈ వేడుకలలో భాగంగా ఛానల్ లో ప్రసారమయ్యే టివి సెలబ్రిటీలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఆటపాటలతో అభిమానులను సందడి చేస్తారు. ఈ క్రమంలోనే జీతెలుగు 17వ యానివర్సరీ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు.

Sreemukhi: శ్రీముఖితో రెచ్చిపోయి డాన్స్ వేసిన యశ్ మాస్టర్… ఆగ్రహం వ్యక్తం చేసిన యశ్ భార్య!

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఆటపాటలతో అందరిని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తన మాట తీరుతో అందరిని మెప్పించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు.

Sreemukhi: శ్రీముఖితో రెచ్చిపోయి డాన్స్ వేసిన యశ్ మాస్టర్… ఆగ్రహం వ్యక్తం చేసిన యశ్ భార్య!

వేదికపై డాన్స్ మాస్టర్ యశ్ తో కలిసి శ్రీముఖి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఇలా శ్రీముఖి యశ్ మాస్టర్ వేదికపై డాన్స్ చేయడంతో అది చూసిన యశ్ భార్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతలోనే మరొక టీవీ నటుడు కల్పించుకొని చెల్లమ్మ మీ ఆయన నిప్పు అంటూ యశ్ భార్యను కూల్ చేశారు.

కన్నుల పండుగగా…

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఎఫ్3 చిత్ర బృందం ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు. బుల్లితెర నటీనటులందరూ ఒకే చోట ఇలా సందడి చేస్తుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ
ప్రోమో పై లుక్ వేయండి.

Mahesh Babu: సినీ కెరీయర్ లో మొట్టమొదటి సారి స్టేజ్ పై డాన్స్ చేసిన మహేష్ బాబు… వీడియో వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి కార్యక్రమాలలోనూ ఫంక్షన్లలోనూ పాల్గొన్నారు. కేవలం ఆయన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఇలా తన సినిమా ఈవెంట్లకు హాజరైనప్పటికీ కేవలం వేదిక పైకి వెళ్లి సినిమా గురించి మాట్లాడటమే తప్ప ఇప్పటి వరకు ఆయన స్టేజ్ పైకి వెళ్లి డాన్సులు వేస్తూ సందడి చేసింది లేదు.

Mahesh Babu: సినీ కెరీయర్ లో మొట్టమొదటి సారి స్టేజ్ పై డాన్స్ చేసిన మహేష్ బాబు… వీడియో వైరల్!

తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ పార్టీలోపాల్గొన్న మహేష్ బాబు ఎవరు ఊహించని విధంగా తన 23 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడు చేయని విధంగా వేదికపై డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Mahesh Babu: సినీ కెరీయర్ లో మొట్టమొదటి సారి స్టేజ్ పై డాన్స్ చేసిన మహేష్ బాబు… వీడియో వైరల్!

ప్రస్తుతం మహేష్ బాబు డాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా తరువాత సర్కారీ వారి పాట సినిమా కోసం తిరిగి కర్నూల్ రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా కర్నూల్ లోనే ప్లాన్ చేశారు.కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాల్సి వచ్చిందని మహేష్ బాబు వెల్లడించారు.

నాన్నగారు ప్రశంసించారు…

ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా
 ‘మైత్రి వారికి’ ’14 రీల్స్’ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత తన కూతురు సితార ఇందులో చాలా బాగున్నావ్ డాడీ అంటూ అని చెప్పినట్లు మహేష్ బాబు వెల్లడించారు.ఇక నాన్న కృష్ణ గారు కూడా దూకుడు, పోకిరి సినిమాకు మించి సర్కారు వారి పాట సినిమా ఉందంటూ ప్రశంసలు కురిపించారని మహేష్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.