Tag Archives: dhee show

Adhire Abhi: ఢీ షో కన్నా జబర్థస్త్ లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వటానికి అదే కారణం: అదిరే అభి

Adhire Abhi: ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోకి మంచి రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా కమెడియన్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో అదిరే అభి కూడా ఒకరు. అయితే అభి చాలాకాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు.

ఇది ఇలా ఉండగా తాజాగా డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవటానికి మల్లెమాల వారు ఇచ్చే తక్కువ పారితోషితమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవటానికి ముందు వీడియోలో
ప్రస్తావించిన విషయాల గురించి అదిరే అభి స్పందించాడు. .ఈ క్రమంలో అభి మాట్లాడుతూ..” జబర్దస్త్ ఆర్టిస్టులు, ఢీ కంటెస్టెంట్లకు ఇచ్చే పారితోషికం మధ్య భేదాలు ఉన్న సంగతి వాస్తవమేనని తెలిపాడు.

జబర్దస్త్ ఆర్టిస్టులతో పోలిస్తే ఢీ వారికి పారితోషకం తక్కువగానే ఉంటుందని తెలిపాడు. అయితే ఇలా వ్యత్యాసం ఉండటానికి కూడా ముఖ్య కారణం ఉందని అభి చెప్పుకొచ్చాడు. షో రేటింగ్స్ ని బట్టి ఆ షో కోసం పనిచేసే వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుందని తెలిపాడు. జబర్దస్త్ షో కి ఎక్కువ రేటింగ్స్ ఉండటం వల్ల జబర్దస్త్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. మల్లెమాల వారు శ్రమ దోపిడి చేస్తున్నారు అనే వార్తలను అభి ఖండించాడు.

Adhire Abhi: పది రోజులు మాత్రమే…

నెలలో పది రోజులు మల్లెమాల కోసం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 రోజులు ఇతర ఈవెంట్స్ చేసుకోండి.. లేదంటే మరేదైనా చేసుకోండి అన్నట్లుగా వారు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తారు అంటూ అభి తెలిపాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అవకాశాల కోసం చాలా కష్టపడాలి. ఒకవేళ అవకాశాలు వచ్చినప్పటికీ మనం సంపాదించిన దానిలో కొంతవరకు భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ అభి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Aata Sandeep: డాన్సర్స్ అంటే చులకన… పేమెంట్ అడిగితే బేరాలు చేస్తారు….ఆట సందీప్ కామెంట్స్ వైరల్!

Aata Sandeep: డాన్స్ మాస్టర్ చైతన్య ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసింది. ఆత్మహత్యకు ముందు చైతన్య మాస్టర్ ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో తాను అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే ఆయన మరణానికి ఢీ షో నిర్మాతలే కారణమని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఢీ షో లో కొరియోగ్రాఫర్లకి సరైన రెమ్యూనరేషన్ ఇవ్వటం లేదని, అందువల్ల కొరియోగ్రాఫర్లు బయట అప్పులు చేసి డాన్సర్లకు డబ్బులు ఇస్తూ వారు అప్పుల పాలవుతున్నారని తెలుపుతున్నారు. తాజాగా చైతన్య మాస్టర్ మరణం గురించి ఆట సేమ్ సందీప్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చైతన్య మాస్టర్ చనిపోవడానికి ఢీ షో నిర్మాతలే పరోక్షంగా కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఢీ షో లో ఒక్కో పాటకి 30,000 మాత్రమే రెమ్యూనరేషన్ ఇస్తారని, ఆ డబ్బుతోనే డాన్సర్లకు కాస్ట్యూమ్స్ వల్లి ట్రావెలింగ్ చార్జెస్ డాన్సర్లకు ఫుడ్ అలాగే డాన్సర్లకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని సందీప్ వెల్లడించాడు. అయితే ఢీ నిర్మాతలు ఇచ్చే 30000 సరిపోక బయట అప్పులు చేసి మరి డాన్సర్లకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సందీప్ వెల్లడించాడు.
అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్లకు ఇచ్చి రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఢీ లో కొరియోగ్రాఫర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని తెలిపాడు.

Aata Sandeep: అప్పులు చేయాల్సి వస్తుంది…


కష్టం అంతా డాన్సర్స్ దే అయినప్పటికీ డాన్సర్స్ ని చిన్న చూపు చూస్తారు. డబ్బుల విషయంలో బేరాలు ఆడతారు అని సందీప్ వెల్లడించాడు. చైతన్య మాదిరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ ఎంతో మంది ఉన్నారు. ఢీ షోలో పని చేసే డాన్సర్స్ కి కనీస గౌరవం, సంపాదన లేదని ఆట సందీప్ నేరుగా చెప్పారు. చైతన్య సూసైడ్ చేసుకోవడానికి ముందు వీడియోలో కూడా ఇదే మెల్లడించాడు. ఢీ షో వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ ఆదాయం ఉండదు అని తెలిపాడు.

Chaitanya Master: చైతన్య చనిపోవటానికీ అప్పులు కాకుండా ఏదో కారణం ఉంది: చైతన్య మేనమామ

Chaitanya Master: ఢీ ఫేమ్ చైతన్య మాస్టర్ తాజాగా ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఢీ షో ద్వారా డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య చాలా కాలంగా డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడనీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నెల్లూరులోనే ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చైతన్య మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన కెరీర్ కోసం, కుటుంబం కోసం చైతన్య మాస్టర్ అప్పులు చేశాడని, అయితే అప్పులు తీర్చే స్తోమత లేక మరణించాడని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైతన్య ఆత్మహత్య గురించి తాజాగా ఆయన మేనమామ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చైతన్య మరణానికి అప్పులు కారణం కాదని, మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.

లక్షల్లో అప్పు చేసే అవసరం చైతన్యకు లేదని తాను చిన్నప్పటినుండే హైదరాబాదులో ఉంటున్నాడని చైతన్య మేనమామ వెల్లడించాడు. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బు మీద అతన్ని కుటుంబం ఆధారపడలేదని, చైతన్యకి అవసరమైనప్పుడు అతని కుటుంబ సభ్యులే డబ్బు పంపేవారని ఆయన తెలిపాడు..అంతేకాకుండా ఇటీవల చైతన్య చెల్లి పెళ్లి కోసం కూడా ఒక రూపాయి ఇవ్వలేదని కుటుంబ సభ్యులే పెళ్లి భారాన్ని భరించారని ఆయన తెలిపాడు.

Chaitanya Master: పేమెంట్ ఆగిపోవడమే…


ఒకవేళ అప్పులు ఉన్న వేళల్లోనే కానీ లక్షల్లో అప్పులు చేసే అవసరం చైతన్యకి లేదని చైతన్య మేనమామ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చైతన్య మాస్టర్ మరణం గురించి తోటి డాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ ఇటీవల ఒక ఈవెంట్ ఒప్పుకున్నాడని అయితే కొంతమంది డాన్సర్లు అతనికి హ్యాండ్ ఇవ్వటంతో దాదాపు లక్షల్లో పేమెంట్ ఆపేసారని , అందువల్ల చైతన్య మాస్టర్ బయట అప్పు చేసి డాన్సర్లకు ఇచ్చినట్లు తెలుపుతున్నారు.

Chaitanya Master: సమస్యకు చావు పరిష్కారం కాదు… చైతన్య మృతి పై రష్మి ఎమోషనల్ పోస్ట్!

Chaitanya Master: ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి చిన్న కష్టానికి కూడా చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య తాజాగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మాస్టర్ చైతన్య మరణం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చైతన్య ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు.

ఈ వీడియోలో చైతన్య తన బాధ వెల్లడించాడు. ఆర్థిక సమస్యలు అధికమవడం వల్ల అప్పులు చేశానని. అప్పులు తీర్చే సత్తా ఉన్నప్పటికీ ఒకదాని వెంట సమస్యలు తలెత్తడంతో వాటిని భరించటం తన వల్ల కావడం లేదని చైతన్య చెప్పుకొచ్చాడు. అప్పులు అధికం అవటం వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. ఇక నా జీవితంలో ఇదే చివరి రోజు అంటూ తల్లిదండ్రులతో పాటు తన వల్ల బాధపడిన అందరికీ క్షమాపణలు తెలియజేశాడు.

చైతన్య మరణ వార్త గురించి తెలియగానే అతని సన్నిహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చైతన్య కుటుంబ సభ్యులు సన్నిహితులు చివరిసారిగా చైతన్య పార్టీల దేహాన్ని చూడటానికి వెళ్లారు. పలువురు సినీ ప్రముఖులు స్నేహితులు చైతన్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రష్మీ కూడా చైతన్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.

Chaitanya Master: సమస్యకు ఇది పరిష్కారం కాదు…


డాన్స్ మాస్టర్ చైతన్య తో రష్మీకి మంచి స్నేహబంధం ఉంది. అయితే చైతన్య ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించటంతో రష్మి చాలా ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో ” ‘నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. ఫ్యామిలీకి సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ రష్మీ గౌతమ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Bigg Boss Jaswanth: పూజకి పనికి రాని పువ్వు..బిగ్ బాస్ జెస్సీ పరువు తీసిన హీరోయిన్..?

Bigg Boss Jaswanth: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెస్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జెస్సి ఢీ షోలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఢీ 15 లో జెస్సీ టీం లీడర్ గా సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ షో లో జెస్సీ ని దారుణంగా అవమానించారా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈవారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో యాంకర్ ప్రదీప్, జడ్జ్ లు శేఖర్ మాష్టర్, హీరోయిన్ శ్రద్దా దాస్ జెస్సిని దారుణంగా అవమానించారు. దీంతో జెస్సీ కి ఏం మాట్లాడాలో తెలియక ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. ఈ ప్రోమో లో జెస్సీ యాంకర్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు.

దివ్యకి బాగా చలిగా ఉందని చెప్పటంతో వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ ఫన్నీగా చెబుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ రీయాక్ట్ అవుతూ.. ఆమెకి వెచ్చదనం రావాలంటే ముందు మనలో వేడి ఉండాలి అని జెస్సీ పరువు తీసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ప్రదీప్ మాట్లాడుతూ.. ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన కూర్చుని ఏడుస్తుంటాడు.. నువ్వు ఆ టైపా అని అంటాడు.దీంతో జెస్సీ ఉక్రోషంగా ఏమనుకుంటున్నారు నా గురించి.. నేనేంటో మీకు తెలియదు అని అంటాడు .

Bigg Boss Jaswanth: వల్గర్ కామెంట్స్ మంచిది కాదు..

జెస్సీ అలా అనగానే శ్రద్దా దాస్ స్పందిస్తూ.. నాకు తెలుసు అని అందుకుంటుంది. దీంతో జెస్సీ.. ఆ చెప్పండి అని ఆమె తనని పోగుడుతుందేమో అని ఆశగా చూస్తాడు. కానీ శ్రద్దా మాత్రం.. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంట కదా అంటూ దారుణంగా జెస్సీ పరువు తీసింది. దీంతో జెస్సీ పరువు పోయినట్టుగా అనిపించి ముఖం తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ప్రదీప్,శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద సెటైర్లు వేయొచ్చు కానీ.. అందరి ముందు ఇలా ఒక వ్యక్తిపై వల్గర్ కామెంట్స్ మంచిది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyper Aadi: ఆ హీరోను పవన్ కళ్యాణ్ తో పోల్చిన హైపర్ ఆది.. దానితో కొట్టాలంటూ ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో వంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇకపోతే తాజాగా ఢీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ బేసిగ్గా తాను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై హైపర్ ఆది మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ సినిమా చూసిన, ఆయన పాట విన్న నాకు తెలియకుండానే అరుపులు చేతులతో చెప్పట్లు వేళ్ళతో విజిల్స్ వస్తుంటాయనీ తెలిపారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో అని అయితే పవన్ కళ్యాణ్ తర్వాత అలాంటి స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కిరణ్ అబ్బవరం అంటూ ఈయన నోరు జారారు. ఇలా ఈ హీరోని పవన్ కళ్యాణ్ రేంజ్ తో పోల్చడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

Hyper Aadi: ఆది కెరియర్లో అతిపెద్ద జోక్ ఇదే..

ఈ క్రమంలోనే హైపర్ ఆది పై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ నిన్ను చెప్పుతో కొట్టిన పాపం రాదంటూ కొందరు దారుణమైన కామెంట్లు చేయగా మరికొందరు నీ జీవితంలో అతిపెద్ద జోక్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో హైపర్ ఆది నోరు జారగా ఒక్కసారిగా అభిమానుల ట్రోలింగ్ కి గురైపోయారు.

Sridevi Drama Company: ఇక మీరు మారరా… మరి ఇంత దిగజారి పోయారా.. మల్లెమాలపై మండిపడుతున్న నెటిజన్స్?

Sridevi Drama Company: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రోమోలు కట్ చేయడం మనం చూస్తున్నాము.

ఈ ప్రోమోలు చూడగానే అసలు ఏం జరిగిందోననే కంగారు ఆత్రుత ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగేలా కట్ చేస్తున్నారు. వేదికపైనే గొడవపడి సెట్ లో నుంచి వెళ్లిపోవడం, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తూ ప్రోమోలు కట్ చేశారు.ఇలా ప్రోమోలు చూసిన అభిమానులు ఈ కార్యక్రమాన్నిఅంతే ఆత్రుతగా చూసినప్పటికీ చివరికి అక్కడ ఏమీ లేకపోవడంతో కార్యక్రమ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంతో మల్లెమాల వారిపై ప్రేక్షకులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.

Sridevi Drama Company: కన్నీళ్లు పెట్టుకున్న ఆది…

ఈ కార్యక్రమంలో భాగంగా మీకు నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చివేయడం చేయండి అంటూ రష్మి టాస్క్ ఇస్తుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ హైపర్ ఆది ఫోటోలను చింపడంతో ఆయన ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమో కాస్త ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేలా ప్రోమో కట్ చేయడంతో ఇది చూసిన నెటిజన్ లు మరోసారి మీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున మల్లెమాలపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Actress Poorna: ఒక్క పోస్టుతో పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన పూర్ణ..అలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

Actress Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇలా ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె నిశ్చితార్థం జరిగిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వెల్లడించారు.

ఈ విధంగా పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీతో నిశ్చితార్థం జరుపుకున్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు.అయితే త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోందని సంతోషించిన కొన్ని రోజులకే ఈమె పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి.

నటి పూర్ణకు ఒక డైరెక్టర్ తో సంబంధం ఉందని అందుకే తన పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి.ఇలా తన పెళ్లి గురించి ఇలాంటి వార్తలు షికార్లు చేయడంతో పూర్ణ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Actress Poorna: ఫరెవర్ మైన్…

ఈ విధంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరెవర్ మైన్ అని క్యాప్షన్ పెట్టారు. ఇలా పూర్ణ ఈ ఫోటో ద్వారా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా తనకు కాబోయే భర్త పై తనకున్న ప్రేమను కూడా చాటుకున్నారు. మొత్తానికి ఒక్క పోస్టుతో పూర్ణ తన గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టారు.

Shraddha Das: ఢీ డాన్స్ షో కోసం శ్రద్ధాదాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Shraddha Das: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ఎంతో మంది డాన్సర్లను పరిచయం చేసింది. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతు దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.శ్రద్ధాదాస్ నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోని ఈమె ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Shraddha Das: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రద్ధాదాస్..

ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒకరోజు షూటింగ్ జరుగుతుందని ఇలా ఈమె రెండు ఎపిసోడ్లకు ఏడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నారని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకున్నారని తెలుస్తోంది.

Dhee 14: ఢీ షో నుండి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వీడియో వైరల్.. కంటెస్టెంట్ పర్ఫామెన్స్ పై అసంతృప్తి?

Dhee 14: బుల్లితెర మీద ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం మొత్తం ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న షోలలో ఢీ డాన్స్ షో కూడా ఒకటి. ఈ డాన్స్ షో దేశవ్యాప్తంగా ఏంతో మంచి గుర్తింపు పొందింది. ఈ షో ద్వారా ఎంతోమంది డాన్సర్ లు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Dhee 14: ఢీ షో నుండి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వీడియో వైరల్.. కంటెస్టెంట్ పర్ఫామెన్స్ పై అసంతృప్తి?

ప్రతి వారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో లో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు ప్రదీప్, ఆదిమధ్య జరిగే సరదా సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఢీ షో ఇంత సక్సెస్ కావడానికి అధ్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు ప్రదీప్ ఆది వేసే పంచ్ డైలాగులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు . ఈ ఢీ షో లో ప్రియమణి, నందిత శ్వేత తమ జడ్జిమెంట్ తో పాటు తమ అందంతో కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Dhee 14: ఢీ షో నుండి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వీడియో వైరల్.. కంటెస్టెంట్ పర్ఫామెన్స్ పై అసంతృప్తి?

తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ వీడియోలో ఒక రష్యన్ భామ సందడి చేసింది. ఇలా ఆది ఆ రష్యా అమ్మాయితో పులిహోర కలపటానికి నానా తంటాలు పడ్డాడు. పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ ఊ ఊ అంటావా మామ అనే పాట ఆమెతో పాడించటానికి ప్రయత్నం చేశాడు. ఇక డాన్స్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లు తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపారు. అందరు గడ్డ స్టెంట్లు నువ్వా ? నేనా? అంటూ డాన్స్ తో పోటీ పడ్డారు.

కొరియోగ్రఫీ ఏ మాత్రం బాగా లేదు…

ఇక ‘వందే మాతరం.. మనదే ఈ తరం’ అనే పాటకి చేసిన డాన్స్ చూసి జడ్జి లు ఫిదా అయ్యి లేచి నిలబడి సెల్యూట్ చేసారు. అయితే ఒక్కసారిగ ఢీ సెట్ లో వాతావరణం మారిపోయింది. అప్పటి వరకూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్న జానీ మాస్టర్ ఒక్కసారిగా చాలా సీరియస్ అయ్యాడు. ” ఢీ షో అనేది చాలా పవర్ ఫుల్.. చాలా సీరియస్ గా చెబుతున్నా.. పర్ఫామెన్స్ బాగాలేదు, కొరియోగ్రఫీ బాగాలేదు.. అసలు ఏదీ బాగాలేదు” అంటూ జానీ మాస్టర్ తన సీట్ నుండి లేచి వెళ్లిపోయారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు.