Tag Archives: dubai

Allu Arjun: మైల్ స్టోన్ మూమెంట్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ మైనపు విగ్రహం?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఈయనకు ఉత్తమ జాతీయ నటుడు అనే అవార్డు కూడా వచ్చింది.

ఇలా ఉత్తమ జాతీయ నటుడు అవార్డును అందుకున్నటువంటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈయన హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో 28వ తేదీ మార్చి రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అల్లు అర్జున్ మైల్ స్టోన్ మూమెంట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

పుష్ప రాజ్ గెటప్..
ఇలా దుబాయ్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయటంతో ఎంతోమంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విగ్రహం కూడా పుష్పరాజ్ గెటప్ లో ఉండటం విశేషం. ఇకపోతే దుబాయ్ మ్యూజియంలో ఈ విధంగా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌత్ ఇండియన్ నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇప్పటివరకు ఈ మ్యూజియంలో ఏ సౌత్ సెలబ్రిటీ విగ్రహం లేకపోవడం గమనార్హం.

Allu Arjun: అలాంటి గౌరవం అందుకున్న తొలి నటుడిగా రికార్డ్ సాధించిన బన్నీ.. ఏమైందంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాలో నటించినందుకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు ఏ హీరో అందుకోలేదని, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.

ఇలా పుష్ప సినిమాలోని తన నటనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడమే కాకుండా మరో అరుదైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయిలోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ మైనపు విగ్రహం తయారు చేయడం పూర్తి అయిందని ఈనెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబం మొత్తం దుబాయ్ చేరుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే అవి లండన్ లో ఉన్నాయి.

గోల్డ్ వీసా…
ఇక దుబాయిలో ఈ మ్యూజియంలో ఇప్పటివరకు ఏ సౌత్ సినీ సెలబ్రిటీల విగ్రహాలను ఏర్పాటు చేయలేదు మొదటిసారి అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈయన మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఇక ఈ విగ్రహా ఏర్పాటు మాత్రమే కాకుండా దుబాయ్ గోల్డ్ వీసా అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ ఘనత సాధించడం విశేషం.

Narendra Modi: నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగిన ఇటలీ పిఎం జార్జియా మెలోని!

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దుబాయిలో జరిగినటువంటి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్.. కాన్ఫెరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ (COP28) 28వ సమ్మిట్ కు హాజరైన సంగతి మనకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా ప్రపంచ నేతలంతా కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు. ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఇటాలియన్ ప్రధాని మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

COP28 సమ్మిట్ లో పాల్గొన్న మోడీ…

మోదీ ఇటాలియన్ కౌంటర్‌ గురించి మెలోని ప్రస్తావించారు. స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం రెండు దేశాల ప్రయత్నాల గురించి మాట్లాడారు. అదేవిధంగా సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం భారతదేశం, ఇటలీల మధ్య సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. COP28 సమ్మిట్ UAE ప్రెసిడెన్సీలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనుంది. శుక్రవారం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని తిరిగి ఇండియా చేరుకున్నారు.

Janhvi Kapoor: అమ్మ నన్ను పట్టుకుని కూర్చుంది… శ్రీదేవితో ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా జాన్వీ!

Janhvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతోమంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దుబాయ్ లో టబ్ బాత్ లో మరణించి విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఇలా శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ ధడక్ సినిమా అవకాశాన్ని అందుకొని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తన తల్లి తనతో గడిపిన ఆఖరి క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అప్పటికే దడక్ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో అమ్మతో గడపడానికి సమయం లేకుండా పోయింది.

అమ్మ ఉదయమే దుబాయ్ వెళ్లాలి నైట్ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చి అమ్మ గదికి వెళ్ళగా తన బిజీగా ఉన్నారు. దాంతో నేను నా గదికి వెళ్లి పడుకున్నాను.అమ్మ పనులన్నీ ముగించుకొని నా గదికి వచ్చిందని అయితే అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాను. నేను అలా చెప్పినప్పటికీ అమ్మ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.

Janhvi Kapoor: అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు…


నేను నిద్రపోతూ ఉండగా అమ్మ నా దగ్గరకు వచ్చి నా తలపై చేయి వేసుకొని అలాగే కూర్చున్నారు. ఇదే నేను అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు అంటూ ఈ సందర్భంగా జాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మ మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటే అయ్యాము. కానీ అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: సముద్ర తీరాన ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎక్కడో తెలుసా..?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులో కోట్ల విలువ చేసే ఖరీదైన బంగ్లాలో నివాసం ఉంటున్న మహేష్ బాబు తాజాగా మరొక ఖరీదైన విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆ విల్లా రిజిస్ట్రేషన్ కోసమే దుబాయ్ కి
పయనమైనట్లు సమాచారం. మహేష్ బాబుకు ఇష్టమైన ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ బాబు కొంత తీరిక దొరికితే చాలు కుటుంబంతో కలిసి విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మహేష్ బాబుకి దుబాయ్ అంటే చాలా ఇష్టం అందువల్ల ఏడాదికి రెండుసార్లైనా దుబాయ్ కి వెళ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

Mahesh Babu: విల్లా రిజిస్ట్రేషన్ కోసమే వెళ్లారా …


అయితే దుబాయ్ కి వెళ్ళినప్పుడు తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలన్న కారణంతో దుబాయిలో ఒక ఖరీదైన విల్లా అని మహేష్ బాబు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అది కూడా సముద్ర తీరాన ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో విలాసవంతమైన విల్లానీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్ లోనే మహేష్ బాబు ఇలా విల్లా కొనుగోలు చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. తరచూ దుబాయ్ కి వెళ్లటమే కాకుండా నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా దుబాయిలో సెటిల్ అవ్వటంతో . మహేష్ బాబు కూడా అందరికీ వీలుగా దుబాయిలోనే విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విల్లా రిజిస్ట్రేషన్ కోసం మహేష్ బాబు కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్లినట్లు సమాచారం.

Actress Poorna: తనే నా ప్రపంచం.. ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన నటి పూర్ణ… వీడియో వైరల్!

Actress Poorna: సినీ నటి పూర్ణ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏప్రిల్ నాలుగవ తేదీ ఈమె మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ విధంగా పూర్ణ తలైందనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఈమె ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్ చైర్ లో వస్తుండగా తనకోసం ఒక గదిని ఎంతో అద్భుతంగా అలంకరించి బేబీ బాయ్ అని రాసి ఉంచి తనకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక ఈ వీడియోని పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు.

బాబు పుట్టినప్పటినుంచి అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పూర్ణ ఈ వీడియోని షేర్ చేస్తూ… నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమె నా ప్రపంచం. ఇప్పుడు నేను మరొకరికి తల్లిని అయ్యాను..ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Actress Poorna: పరిపూర్ణ స్త్రీ గా మారాను..


ఇక పూర్ణ గత ఏడాది జూన్ నెలలో ఆసిఫ్ అలీ అనే దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత కొన్ని నెలలకే ఈమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తను కూడా అభిమానులతో పంచుకొని తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈమె పలు తెలుగు సినిమాలతో పాటు తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

Upasana: దుబాయ్ బేబీ షవర్ ఫంక్షన్ లో ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఏడవ నెల గర్భిణీ. మరి కొద్ది రోజులలో మెగా కుటుంబంలోకి బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారు. ఇలా బుల్లి రామ్ చరణ్ లేదా ఉపాసన రాక కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన భర్తతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ ఉపాసన దుబాయ్ వెకేషన్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా దుబాయ్ వెకేషన్ లో తన స్నేహితులు కజిన్ తో కలిసి రాంచరణ్ ఉపాసన ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక దుబాయ్ వెకేషన్ లో భాగంగా తన కజిన్స్ తనకు బేబీ షవర్ వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఉపాసన రాంచరణ్ తెలుపు రంగు దుస్తులు ధరించి కనిపించారు. అయితే ఈ బేబీ షవర్ ఫంక్షన్లో ఉపాసన ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

Upasana: లక్షల విలువ చేస్తున్న ఉపాసన డ్రెస్…


తెలుపు రంగు లేస్ లాంగ్ ఫ్రాక్ ధరించినటువంటి ఉపాసన ఈ డ్రెస్సులో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇక ఈ వేడుకలో ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఆస్ట్రేలియన్ బ్రాండ్ జిమ్మెర్‌మాన్ ద్వారా లారెల్ బ్రోడెరీ ఆంగ్లైస్ మిడి డ్రెస్ ధర రూ. 1,55,568 అని తెలుస్తుంది. ఇలా ఈ డ్రెస్ ఏకంగా 1.5 లక్షల రూపాయలు అని తెలియడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Upasana: దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్… ఫోటోలు వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. గత పది సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోతుండడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఇన్ని రోజులు పిల్లలగురించి ఆలోచించకపోవడానికి కారణం ఉందని ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని ప్లాన్ చేసుకున్నట్లు ఉపాసన తెలిపారు.

ఇక ప్రస్తుతం తమకు పిల్లలు ఉంటే బాగుంటుందనిపించి పిల్లలను ప్లాన్ చేసుకున్నామని తాజాగా ఉపాసన ఓ సందర్భంలో తెలియజేశారు. ఇకపోతే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన భర్తతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ పూర్తి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో సందడి చేసిన ఉపాసన తాజాగా తన భర్త రామ్ చరణ్ తో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.

ఇలా దుబాయ్ లో కొద్ది రోజులపాటు ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ఇండియా రానున్నారు.ఇక దుబాయిలో తన స్నేహితులు కజిన్స్ తో కలిసి ఉపాసన ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే దుబాయ్ లో ఉన్నటువంటి తన స్నేహితులు కజిన్స్ తనకు సీమంతపు వేడుకలను చేసినట్టు తెలుస్తుంది.

Upasana: స్నేహితులు కజిన్స్ సమక్షంలో బేబీ షవర్..

ఈ క్రమంలోనే దుబాయిలో నమ్మోస్ బీచ్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించినట్టు తెలుస్తోంది.ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ ఉపాసన స్నేహితులతో పాటు కజిన్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఉపాసన తెలుపు రంగుగౌనులో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దుబాయ్ వెకేషన్ పూర్తి కాగానే రామ్ చరణ్ తిరిగి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Actress Sana: దుబాయ్ తీసుకెళ్లి ఎన్నో చిత్రహింసలు పెట్టారు… నటి సన సంచలన వ్యాఖ్యలు!

Actress Sana: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 600కు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సన ఒకరు. ఇలా ఈమె సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇక తాజాగా ఈమె రంగ మార్తాండ సినిమాలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చిన్నప్పటినుంచి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టం అయితే పదో తరగతిలోనే తన పెళ్లి జరిగిందని పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తరువాత తన అత్తమామల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తనకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలియడంతో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడినట్లు తెలిపారు.

ఇక హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలని పొట్టి దుస్తులు ధరించాలని స్లిమ్ సూట్ వేసుకోవాలని కండిషన్ లు పెట్టారు. ఈ కండిషన్లకు ఒప్పుకోకపోవడంతో తనకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదని తెలిపారు. ఇక తన కుమార్తె గురించి ఈమె మాట్లాడుతూ తాను తన చేతుల మీదుగా ఎందరికో పెళ్లిళ్లు చేశాను. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ తన కూతురు జీవితం మాత్రం కఠినంగా గడిచిందని తెలిపారు.

Actress Sana: తన కూతురిని ఎన్నో చిత్రహింసలు పెట్టారు…

తన కూతురికి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేయగా తన అత్తమామలు తనని దుబాయ్ తీసుకెళ్లారని తెలిపారు. అయితే అక్కడ తన కూతురిని చిత్రహింసలు పెట్టి డబ్బు బంగారం మొత్తం లాక్కున్నారని తెలిపారు. అయితే ఈ విషయాలు తన కూతురు తన వద్ద దాచి పెట్టిందని నేనే మెల్లిమెల్లిగా అన్ని తెలుసుకొని తనని ఆ నరకం నుంచి బయటకు తీసుకువచ్చి తనని కాపాడుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tollywood Heroines: స్టార్ హీరోయిన్లందరూ దుబాయ్ కు వెళ్ళేది అందుకే… హీరోయిన్ల బాగోతం బయటపెట్టిన డైరెక్టర్!

Tollywood Heroines: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలి అంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది అవకాశాలు రావడమే గగనంగా మారిపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరొక ఎత్తు.అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే హీరోయిన్లు తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి కమిట్మెంట్లను ఇవ్వడం వల్లే హీరోయిన్లుగా అవకాశాలు వస్తాయి అంటూ ఇప్పటికే ఎంతోమంది ఇదే విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు.ఇలా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కమిట్మెంట్లను ఇస్తూ కొందరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మరికొందరు హీరోయిన్లుగా అవకాశాలు లేక పలు ఈవెంట్లకు వెళుతూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచూ దుబాయ్ వెళుతూ ఉండటం మనం చూస్తున్నాము.

ఇలా దుబాయ్ కి వెళ్లి అక్కడ కొన్ని ఈవెంట్లను చేస్తూ కొందరు డబ్బును సంపాదించుకోగా మరికొందరు మాత్రం అక్కడ ఉన్నటువంటి షేక్ లతో కలిసి వారి సరదాలు అవసరాలు తీరుస్తూ డబ్బును వెనకేసుకుంటున్నారు అంటూ ప్రముఖ డైరెక్టర్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tolly Wood Heroines: షేక్ ల అవసరాలు తీరుస్తున్న స్టార్ హీరోయిన్లు…

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నటువంటి హీరోయిన్లకు అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా దుబాయ్ కి వెళ్లి షేక్ లతో సన్నిహితంగా ఉంటూ వారితో సరసాలు ఆడుతూ డబ్బును పోగు చేసుకుంటున్నారంటూ డైరెక్టర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.