Tag Archives: jabardast

Hyper Aadi: హీరోయిన్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్న కమెడియన్ హైపర్ ఆది… ఎవరంటే?

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన ముందుగా జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా వచ్చి అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా ఒక స్కిట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హైపర్ ఆది పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈయన హీరోయిన్ తో కలిసి పెళ్లి పీటలేకపోతున్నారంటే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అయితే నిజంగానే హైపర్ ఆది హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన ఢీ షోలో సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ తో కలిసి పెళ్లికి సిద్ధమైనట్లు నటించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

ఏడడుగులు నడిచిన ఆది….

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమాలోని హీరోయిన్ హ్రితికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. సౌండ్ పార్టీ సినిమా ప్రమోషన్లలో భాగంగా సన్నీ హ్రితిక ఇద్దరు కూడా ఈ షోలో సందడి చేశారు. ఆది ఆమెను చూడగానే ఆది .. పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడమే కాకుండా తనతో కలిసి వేదికపైనే ఏడడుగులు నడిచారు. అయితే ఇదంతా చూసినటువంటి అందరూ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Ritu Chowadary: తండ్రి జ్ఞాపకాలకు దూరంగా జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరి… షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటి!

Ritu Chowadary:జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందింది. ఇలా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సీరియల్ టీవీ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడప్పుడు అమ్మడు చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల రీతు చౌదరి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణంతో రీతు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఆ బాధనుండి బయటపడలేకపోతోంది. అందువల్ల తండ్రి లేడు అన్న బాధనుండి బయటపడటానికి ఆయన జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని రీతూ చౌదరి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో తాను చిన్నప్పటినుండి తన తండ్రితో కలిసి ఉన్న ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్లడానికి సిద్ధపడింది.
ఆ ఇంట్లో తన తండ్రితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు తండ్రి దూరమవడంతో ఆ జ్ఞాపకాల వల్ల ఆయన లేని లోటుని మర్చిపోలేకపోతున్నట్లు రీతు తెలిపింది.

Ritu Chowadary: గతాన్ని మర్చిపోతేనే ముందుకు వెళ్లగలం…

ఎప్పటికైనా గతాన్ని మరిచిపోతేనే భవిష్యత్తులో ముందుకు వెళ్లగలం. అందువల్ల నాన్న లేడు అన్న నిజాన్ని మరిచిపోయి భవిష్యత్తు కోసం ఆయన జ్ఞాపకాలకు దూరంగా వెళ్లడానికి సిద్ధపడినట్లు రీతు తెలిపింది. ఈ క్రమంలో పిల్లో కవర్ మీద తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలు, తన తండ్రి షర్టు చూసి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా రీతూ చౌదరి అభిమానులు, స్నేహితులు ఆమెని ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Singer Mano: సింగర్ మనో జబర్దస్త్ వీడటానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన మనో!

Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.

ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.

ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.

Singer Mano: జబర్దస్త్ కు చిన్న బ్రేక్ ఇచ్చాను..


ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి తట్టుకోవడానికి వారిద్దరే కారణం… అసలు విషయం బయటపెట్టిన అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా గతంలో అనసూయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోందని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గతంలో వెల్లడించారు.

తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం తన ఇద్దరు కుమారులేనని చెప్పేశారు.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలతోను తాను బిజీగా గడుపుతూ తన సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోతున్నానని తెలిపారు.

Anasuya Bharadwaj: పిల్లలకు సమయం కేటాయించలేకపోవడమే కారణం…

ఇలా సినిమాలలో నటించడం వల్ల తనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే జబర్దస్త్ లో చేసిన మరికొంత ఆదాయం వస్తుంది కానీ పిల్లలతో కలిసి సమయం గడపడానికి కుదరకపోవటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి పూర్తిగా తప్పుకున్నాననీ ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nagababu -Roja: నాగబాబు జబర్దస్త్ వీడటానికి రోజానే కారణమా…. అసలు విషయం చెప్పిన రోజా!

Nagababu -Roja: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా నాగబాబు రోజా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా నాగబాబు తప్పుకోవడంతో అందుకు గల కారణం రోజా అనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా రోజా స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని తెలిపారు. ఇక నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయనతో తాను ఎప్పుడు మంచిగానే ఉన్నానని తెలిపారు.

నాగబాబు సైతం తనను పలు సందర్భాలలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారని తెలిపారు. నేను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని నాగబాబు నా గురించి చెప్పేవారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో నాకు నాగబాబు గారికి ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తన వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ వదిలి వెళ్లిపోయారనీ ఈ సందర్భంగా రోజా క్లారిటీ ఇచ్చారు.

Nagababu -Roja: రాజకీయాలతో బిజీగా ఉన్నటువంటి రోజా…

ఇక ఈమె దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. అయితే ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలలో నటించిన రోజా బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటంవల్ల ఇండస్ట్రీకి ఈమె దూరమయ్యారు.

Shanthi Swaroop: మీలా పక్కలోకి వెళ్లి డబ్బు సంపాదించలేదు… జబర్దస్త్ శాంతి స్వరూప్ షాకింగ్ కామెంట్స్!

Shanthi Swaroop: జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శాంతి స్వరూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ గెటప్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శాంతి స్వరూప్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తాను తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను అవమానాలు గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా శాంతి స్వరూప్ మాట్లాడుతూ తాను జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు ఒక కారు పక్కన నిలబడి ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశానని చెప్పారు.ఈ ఫోటో షేర్ చేసిన కొంతసేపటికే చాలామంది నీ మొహానికి అంత ఖరీదు కారు ఎప్పుడు కొన్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఎవరిపక్కలో పడక వేసి ఈ కారు కొన్నావు అంటూ చాలా నీచాతి నీచమైన కామెంట్లు చేశారని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా ఆ రోజు నన్ను కొందరు ట్రోల్ చేయడంతో చాలా బాధపడ్డానని అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కష్టపడి స్కిట్ వేసి ప్రతి రూపాయి పోగు చేసి తాను కూడా అలాంటి కారు కొన్నానని ఈయన చెప్పుకొచ్చారు.ఇలా తన కొన్నకారుతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేను ఎవరి పక్కలోనూ పడక వేసి కారు కొనలేదు అలా కనుక చేసి ఉంటే ఎప్పుడో ఇలాంటి ఖరీదైన కార్లు బంగ్లాలు కొనేవాడిని.

Shanthi Swaroop: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నాను…


నేను నా టాలెంట్ తో జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ప్రతి రూపాయి పోగు చేసి ఈ కారు కొన్నాను అంటూ ఎంతో సంతోషంగా తాను కారు కొన్న విషయాన్ని తెలియజేస్తూనే తన గురించి ట్రోల్ చేసిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఇలా శాంతి స్వరూప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Dhanaraj: అతని వల్లే జబర్దస్త్ కి దూరమయ్యాను.. జబర్దస్త్ వదిలి తప్పు చేశా: ధనరాజ్

Dhanaraj: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధనరాజు ఒకరు.ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అనంతరం టీం లీడర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ అంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలియజేశారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మాటీవీలోఅలీ టాకీస్ అనే ఒక కార్యక్రమం వచ్చేది అయితే కొన్ని కారణాలవల్ల ఆలీ ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

అదే సమయంలో వేణు ఆలీ టాకీస్ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. మనిద్దరం వెళ్దాం అంటూ నన్ను బలవంతం చేసే జబర్దస్త్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ కామెడీ షో అది యాంకర్ గా చేయడం కనుక రెండు ఎంతో విభిన్నమైనవి అంటూ వేణు నచ్చ చెప్పారు. ఇదే విషయం జబర్దస్త్ దీప్తి గారితో చెబితే మీరు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని చెప్పారు.

Dhanaraj: ఇప్పటికీ ఈ విషయంలో వేణుని తిడుతూ ఉంటా..

ఇక వేణు చెప్పిన మాటలు విని తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి ఆలీ టాకీస్ కార్యక్రమానికి వెళ్లామని అయితే పెద్దగా అక్కడ ఏమి కలిసి రాలేదని చెప్పారు.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే టీం లీడర్ గా ఉన్నటువంటి తాము తిరిగి కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. అది నచ్చకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అయితే వేణు మాటలు విని నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ ఈ విషయంలో తనని తిడుతూనే ఉంటానని ధనరాజ్ వెల్లడించారు.

Aadi -Akhil: ఢీ 14 కోసం హైపర్ ఆది, అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Aadi -Akhil: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అఖిల్…

ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Priyanka Singh: ఘనంగా హల్ది వేడుక జరుపుకున్న బిగ్ బాస్ ప్రియాంక సింగ్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Priyanka Singh: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొదట్లో లేడీస్ లేకపోవడం వల్ల మగవారే లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా లేడీ గెటప్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో సాయి తేజ్ ఒకరు. సాయి తేజ్ జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా లేడీ గెటప్స్ ద్వారా ఫేమస్ అయిన సాయి తేజ్ ఏకంగా సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. ఇలా సాయి తేజ్ గా ఉన్నటువంటి ఈయన ప్రియాంక సింగ్ గా మారిపోయింది. ఈమె జెండర్ మార్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మానస్ తో ఈమె లవ్ ట్రాక్ బాగా హిట్ అయిందని చెప్పాలి.ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక సింగ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి ఒక పూజలో కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ ఇట్స్ డన్ అంటూ ఆ ఫోటోని షేర్ చేశారు.

Priyanka Singh: ఘనంగా హల్దీ వేడుక…

తాజాగా ఈమె ఏకంగా హల్దీ ఫంక్షన్ జరుపుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఒకసారిగా వైరల్ అయింది.ఇది చూసిన ఎంతోమంది నెటిజన్లు ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందా అంటూ సందేహం వ్యక్తం చేయడమే కాకుండా తనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.ఈ విధంగా ప్రియాంక సింగ్ హల్ది ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే ఏదైనా షూట్లో భాగంగా ఇలా ఫోటోలు దిగారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rashmi -Anasuya: అనసూయ గొడవ.. రష్మీనీ గెలికిన నెటిజన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్ రష్మి !

Rashmi -Anasuya: జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే వీరిద్దరూ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరిద్దరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.రష్మీ నిత్యం మూగజీవాల గురించి రోడ్లపై వాటిని ఎవరైనా హింసిస్తే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాటి గురించి స్పందిస్తూ వాటిని హింసించిన వారికి శిక్షపడేలా చేస్తూ మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంటారు.

ఇక అనసూయ సైతం తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ తన గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.ప్రస్తుతం అనసూయకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పెద్ద ఎత్తున ట్వీట్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈ గొడవ మధ్యలోకి రశ్మిని లాగారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ రష్మికి ట్వీట్ చేస్తూ అందులో.. ఎవరేమన్నా పట్టించుకోవు నీతో అసలు గొడవే ఉండదు… అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు నీకు తెలుగు అర్థం కాదు అంటూ ఒక నెటిజన్ రశ్మిని ఉద్దేశిస్తూ ఆమె నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మరి ఈ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై రష్మీ ఎంతో భిన్నంగా స్పందించింది.

Rashmi -Anasuya: రష్మీ చాలా క్లాస్…

ఈ విధంగా నేటిజన్ చేసిన ట్వీట్ కు ఈమె రిప్లై ఇస్తూ… పండగ చేసుకో అంటూ కామెంట్ చేసింది.అందరికీ రష్మీలో నచ్చే విషయం ఇదే తను ఏం చెప్పాలనుకున్న సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది. అనసూయతో పోలిస్తే రష్మీ ఎంతో క్లాస్ అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు రష్మి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.