Tag Archives: Jayasudha

Jayasudha: మూడో పెళ్లిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జయసుధ…నేను ఇలాగే ఉంటానంటూ?

Jayasudha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జయసుధ ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ పలు సినిమాలలో అమ్మ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా జయసుధ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను మూడో పెళ్లి చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల కాలంలో జయసుధ ఎక్కడికి వెళ్లినా ఆమెతోపాటు మరో వ్యక్తి కూడా కనిపిస్తూ ఉండడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జయసుధ మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నేను కూడా రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాను అంటూ వచ్చిన వార్తలను చదివానని తెలిపారు. అయితే ఆ వార్తలు రాసే వారి కంటే కింద కామెంట్లు చేసేవారు చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.

దారుణమైన కామెంట్లు..
ఇక నేను నా విషయాల గురించి ఎవరికీ చెప్పదలుచుకోలేదు. నేను చెప్పిన చెప్పకపోయినా నా గురించి రాసే రాతలు రాస్తుంటారు అందుకే నేను ఈ విషయంపై మౌనంగా ఉన్నానని తెలిపారు. ఇక ఇటీవల కాలంలో తాను సోషల్ మీడియాను ఫాలో అవడం కూడా పూర్తిగా మానేశానని ఎవరు ఎన్ని అన్న నేను నా ఆలోచన విధానాన్ని నా వ్యవహార శైలిని మార్చుకోను అంటూ ఈ సందర్భంగా జయసుధ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jayasudha: నా భర్త చనిపోతారని ముందే తెలుసు.. షాకింగ్ విషయాలు చెప్పిన జయసుధ?

Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయసుధ ఒకానొక సమయంలో హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే తాజాగా ఈమె హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే గత ఏడు సంవత్సరాల క్రితం నితిన్ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించడానికి కారణం అప్పులేనని ఆర్థిక సమస్యలు ఎక్కువై అప్పుల అధికంగా ఉండడంతో మరణించారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించారు. అంతేకాకుండా తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని ముందే నాకు తెలుసు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పుల బాధతోనే తన భర్త మరణించాడు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు మేము చేసిన అప్పులు తీర్చుకోలేనంత పెద్దవి కాదని ఈమె తెలియజేశారు.

సినిమాలు చేసి నష్టపోయాము అనేది వాస్తవం కానీ దానివల్ల తన భర్త చనిపోయారన్నది అవాస్తవమని తెలిపారు. అంతేకాకుండా తన భర్త ముందే చనిపోతారు అనే విషయం మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరిది చాలా వీక్ మైండ్ అని ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దానిని బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ ఆలోచనలు చేస్తారని ఇదివరకే తన భర్త అన్నగారు అలాగే తన అత్తయ్య వాళ్ళు కూడా అలాగే సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ తెలిపారు.

సినిమాలు చేసే నష్టపోయాం..
ఆర్థిక ఇబ్బందులు రావడంతో తను చాలా టెన్షన్ పడ్డారు. ఎక్కడ సూసైడ్ చేసుకుంటారోనని మేము ముందుగానే గ్రహించి తనని ఎప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండే వాళ్ళం అయితే మేము ఇంట్లో లేని సమయంలో తాను సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ ఈ సందర్భంగా తన భర్త మరణం గురించి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Jayasudha: ఆ పొరపాటుతో వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న జయసుధ… అసలేం జరిగిందంటే?

Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని సీనియర్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోల సరసన నటించి మెప్పించినటువంటి వారిలో నటి జయసుధ ఒకరు ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ బామ్మ పాత్రలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జయసుధ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఆస్తులను కోల్పోవడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆస్తులను సంపాదించడానికి కూడా అదృష్టం ఉండాలని ఈమె తెలియజేశారు. తాను హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో చెన్నైలోని ఒక ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసే బిల్డింగ్ కట్టానని తెలిపారు.

ఇలా బిల్డింగు కట్టడంతో శోభన్ బాబు గారు చాలా మంచి పని చేశారు అంటూ నన్ను మెచ్చుకున్నారు అయితే ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ స్లంప్ రావడంతో రెంట్ కు కూడా ఎవరూ రాలేదు దీంతో ఆ బిల్డింగ్ అమ్మేశాను కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ బిజీ ఏరియాగా మారిపోయిందని ఇప్పుడు దాని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉందని తెలిపారు.

ఆ పొరపాట్లే కారణం..
ఇక చెన్నైలో తాను 9 ఎకరాల పొలం కొన్నాను. అందులో బోర్ పడకపోవడంతో తాను ఆ పొలం ఇక ఉన్న వేస్ట్ అని తాను అమ్మేశానని తెలిపారు. అయితే ఆ పొలం ఇప్పుడు వందల కోట్ల విలువ చేస్తుంది అంటూ జయసుధ ఈ సందర్భంగా తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లు కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను కోల్పోయాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sreeleela: నటి శ్రీ లీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మాజీ…. ఆమె కూడా అదే స్థాయికి వెళ్తుంది అంటూ కామెంట్స్!

Sreeleela: శ్రీ లీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల గురించి నటుడు బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బ్రహ్మాజీ ప్రస్తుతం తన కుమారుడు సంజయ్ రావు నటిస్తున్నటువంటి స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి ఈయనకు యాంకర్ ప్రశ్నిస్తూ ఇప్పుడు కనుక మీకు హీరోగా అవకాశం వస్తే ఏ హీరోయిన్ పక్కన నటించాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ తాను నటి శ్రీ లీల పక్కన నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈమె ఎంతో టాలెంట్ కలిగినటువంటి హీరోయిన్ డాన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అయితే నాకు డాన్స్ రాదు అనుకుంటే పొరపాటు నేను కూడా డాన్స్ చాలా బాగా చేస్తానని బ్రహ్మాజీ తెలిపారు.

Sreeleela: స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళుతుంది…


ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు ఈమెకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అలాగే తన టాలెంట్ కనుక చూస్తే ఈమె కూడా స్టార్ హీరోయిన్స్ అయినటువంటి శ్రీదేవి జయసుధ జయప్రద వంటి వారి స్థాయికి చేరుకుంటుందని ఇండస్ట్రీలో అంతే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందని శ్రీ లీల గురించి బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

JD Chakravarthy: జయసుధను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా తన భర్తనే అడిగాను… ఆయన రియాక్షన్ ఇదే: జేడీ

JD Chakravarthy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జే డీ చక్రవర్తి ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా ఈయన ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా జెడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో జయసుధ విషయంలో తన భర్తతో తనకు జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ గురించి తెలియజేశారు.జయసుధ భర్త నితిన్ వద్దకు వెళ్లి తాను నేరుగా జయసుధని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను అంటూ ఈయన కామెంట్ చేశారు. నితిన్ చూడటానికి ఆరడుగుల ఉంటారు. లాగిపెట్టి కొడితే ఒక మూడు నెలలు నేను పైకి లేవలేను.

అయినప్పటికీ చాలా డేర్ చేసి నేను జయని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. తాను ఇలా చెప్పడంతో నేను కూడా సరదాగా చెబుతున్నానని తనకు అర్థం అయింది.నేను జయని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే నితిన్ ఒకటే మాట మాట్లాడారు నేను జయసుధ పెళ్లి చేసుకున్న రోజునే మీరు కూడా పెళ్లి చేసుకోండి ఎందుకంటే ఇద్దరిదీ ఒకటే పెళ్లి రోజు అవుతుంది కేవలం హస్బెండ్ మాత్రమే వేరే అవుతారు అంటూ సమాధానం చెప్పారు.

JD Chakravarthy: మా పెళ్లి రోజే పెళ్లి చేసుకో అన్నారు…


జయసుధను పెళ్లి చేసుకుంటాను అంటే తన భర్త ఇలాంటి సమాధానం చెప్పారంటూ చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జయసుధ భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక జయసుధ ప్రస్తుతం పలు సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు.

Jayasudha -Jayarada: కంగనాకు పద్మశ్రీ… మమ్మల్ని మాత్రం గుర్తించలేదు.. ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నటీమణులు!

Jayasudha -Jayarada: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిమణులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జయసుధ జయప్రద తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లను ఎన్నో ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డుల గురించి వీరిని ప్రశ్నించారు.

బాలీవుడ్ నటి కంగనా రౌనత్ పట్టుమని పది సినిమాలు కూడా నటించక ముందే ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మరి మీకెందుకు రాలేదు అని బాలయ్య ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు జయసుధ సమాధానం చెబుతూ ఆమెకు అవార్డు వచ్చిందని విషయాన్ని మేము తప్పు పట్టడం లేదు కానీ పది సినిమాలలో నటించిన తనకు పద్మ అవార్డు ఇచ్చారు. కానీ మేము ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రభుత్వం మా సేవలను గుర్తించలేదని సమాధానం చెప్పారు.

ఈ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది సినీ సెలబ్రిటీలకు పూర్తిగా అన్యాయం చేస్తుందని మా పరిస్థితి అటు ఉంచితే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన లేడీ డైరెక్టర్ విజయనిర్మల సేవలను కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని సమాధానం చెప్పారు. ఈ విషయం గురించి జయప్రద కూడా స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పారు.

Jayasudha -Jayarada: అవార్డులు అడిగి తీసుకోవడం ఇష్టం లేదు..

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ అవార్డులు అడిగి తీసుకోవడం మాకు ఇష్టం లేదు…సీనియార్టీని గుర్తించి మమ్మల్ని గౌరవించాలని కోరుకున్నాం అంటూ ఈ సందర్భంగా పద్మ అవార్డుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఈ ఇద్దరు సీనియర్ నటి మనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీరు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jayasudha: నా భర్త చనిపోయిన విషయాన్ని కూడా దాచి పెట్టారు…. ఎమోషనల్ అయిన జయసుధ!

Jayasudha: తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ ఎంతో మంది అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈమె పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న జయసుధ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

ముఖ్యంగా తన భర్త మరణం గురించి మాట్లాడుతూ జయసుధ ఎమోషనల్ అయ్యారు.తన భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించారని అయితే ఆయన మరణించే సమయంలో తాను వేరొక చోట ఉండటం వల్ల చివరికి తన భర్త మరణించిన విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఈమె తెలిపారు.

Jayasudha: జయప్రద తనకు ఎంతో ఆసరాగా నిలిచారు…..

తన భర్త మరణించిన విషయాన్ని తన పిల్లలకు మాత్రమే చెప్పి అమ్మకు చెప్పద్దని చెప్పారు.ఇలా తన భర్త మరణం గురించి తనకు తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే ఆ సమయంలో జయప్రద నా పక్కనే ఉండి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా మరోసారి అప్పటి సంఘటనలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జయసుధ తన భర్త మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jagan Movie: ఏపీ సీఎం జగన్ పేరుతో సినిమా ఉందని మీకు తెలుసా?

Jagan Movie: జగన్ అంటేనే టక్కున అందరికీ ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు. అయితే జగన్ పేరు మీదగా ఓ సినిమా కూడా ఉందండోయ్.. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే 1972లో వచ్చిన మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇందులో శోభన్ బాబు జగన్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో చాలామంది తమ పిల్లలకు జగన్ అనే పేరు కూడా పెట్టారు.

ఇక జగన్ పాత్రకు వచ్చిన ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకొని దాసరి నారాయణరావు రాజకీయాల నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం, మాజీ ముఖ్యమంత్రుల మధ్య డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

అభ్యంతరం తెలిపిన సెన్సార్…


ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ వెళ్ళినప్పుడు సినిమాకు అభ్యంతరం వచ్చింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సన్నివేశాలు ఉండటం చేత సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వెలువడ్డాయి. అయితే దాసరి సినిమాలకు ఇలాంటి అభ్యంతరాలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే దాసరి రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ పలు సమస్యలు ఎదురైనా, అనంతరం ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా మరికొద్ది రోజులు విడుదలకు వాయిదా పడింది. అలా ఈ సినిమా 1984 మార్చి 10 వ తేదీ విడుదల అయింది. ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం శోభన్ బాబు జగన్ సినిమాపై పడింది.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

Jayasuda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి గా,సహజనటిగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

నిర్మాతగా మారిన జయసుధ ఆశించినంత ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. అయితే ఆమె నిర్మాతగా ఎందుకు విజయం సాధించలేకపోయిందనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన హ్యాండ్సప్ సినిమా గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

జయసుధ నిర్మాతగా మారిన తర్వాత ఆత్మబంధువులు, ‘కాంచన సీత’ సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకి మంచి లాభాలు వచ్చాయి ఈ సినిమా తరువాత ఏకంగా బాలీవుడ్ చిత్రం ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’  చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కొంత మేర నష్టాలను తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే జయసుధ హ్యాండ్సప్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసిందని జయసుధ తెలిపారు.

విడుదలయ్యే వరకు చిరంజీవి ఉన్నారనే విషయం తెలియదు.

ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల అయి ఫస్ట్ షో చూసే వరకు ఎవరికీ కూడా ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారనే విషయం తెలియదు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పోస్టర్లలో చిరంజీవి పేరు వేసినా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని, పోస్టర్ వేద్దామంటే చిరంజీవి గారు వద్దన్నారని..అలా ఆయన సలహా వల్లే ఈ సినిమా నష్టాలలోకి వెళ్లిపోయిందని జయసుధ తెలిపారు. చిరంజీవి అలా చెప్పడానికి గల కారణం అప్పటి వరకు ఒక స్టార్ హీరో ఇలాంటి చిన్న పాత్రలో నటించలేదు. అలా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేసి తీరా థియేటర్లకు వెళ్లిన తర్వాత మా హీరోకి ఇంత చిన్న పాత్ర ఇవ్వడం ఏంటి అని ఫీల్ అవుతారని అందుకే చిరంజీవి వద్దన్నారని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

Jayasudha : ఒకే ఏడాదిలో 25 సినిమాలు.. అందుకే ఆమె సహజ నటి అయింది.!

Jayasudha : సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మర్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఎందుకంటే ఎక్కువశాతం ఇక్కడ కమర్షియల్ చిత్రాలే రూపొందుతుంటాయి. హీరోలు దాదాపుగా అందరు కమర్షియల్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తే హీరోయిన్స్ మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. భానుమతి, సావిత్రి, జమున లాంటి హీరోయిన్స్ వారి తరంలో కథకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు. ఆకాలంలో ఎక్కువగా జానపదం, పౌరాణిక చిత్రాలే ఎక్కువగా రూపొందాయి.

ఆ తర్వాత శ్రీదేవి, జనరేషన్‌లో విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, రాధిక లాంటి వారు హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు. వీరంతా ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేయడానికి ఆసక్తి చూపించారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, సుమన్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, నాగేశ్వర రావు లాంటి వారు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. వారి పక్కన ఈ హీరోయిన్స్ అందరూ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలపైనా ఫోకs పెట్టారు.

అయితే వీరిలో గ్లామర్ రోల్స్ చాలా తక్కువ చేసింది మాత్రం జయసుధనే. ఆమె ఏ హీరో పక్కన నటించిన గ్లామర్ పాత్రలు కాకుండా కథా బలమున్న చిత్రాలను ఎంచుకున్నారు. ఇక ఇంతమంది గ్లామర్ హీరోయిన్స్ మధ్య తన అద్భుతమైన నటనతో సహజ నటి అని విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద జయసుధ పాత్ర కనిపిస్తే ప్రేక్షకులు చాలా ఎమొషనల్ అయ్యేవారు. అగ్ర దర్శకులకు బెస్ట్ ఛాయిస్‌గా జయసుధ నిలిచారు. అసలు పేరు సుజాత అయితే సినిమా రంగానికి జయసుధగా పరిచయమయ్యారు.

నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా జయసుధ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె 300లకు పైగా సినిమాల్లో నటించగా వాటిలో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దాదాపు 25 సినిమాలు, దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించి అగ్ర స్థానంలో నిలిచారు. అంతేకాదు జయసుధ నటించిన సినిమాలు 25 ఒకే సంవత్సరంలో విడుదలవడం ఇప్పటికీ గొప్ప విశేషంగా చెప్పుకంటారు. ఇక జయసుధను అందరూ నిర్మాతల హీరోయిన్ అని చెప్పుకుంటుంటారు. రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టని నటి అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు.