Tag Archives: krishna

Naveen: మహేష్ అన్నతో మంచి బాండింగ్ ఉంది… వైరల్ అవుతున్న నరేష్ కుమారుడు నవీన్ కామెంట్స్!

Naveen: నవీన్ అంటే తెలియకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరూ తప్పక గుర్తుపట్టారు. ఈయన కెరియర్లో హీరోగా ఒకే ఒక సినిమాలో నటించారు. హీరోగా నవీన్ మెప్పించకపోవడంతో ఈయన దర్శకుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలింకి దర్శకుడిగా వ్యవహరించారు.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈయన వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తన నానమ్మ విజయనిర్మల చనిపోవడంతోనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక అదే బాధలో ఉండే కృష్ణ గారు కూడా చనిపోయారు అంటూ నవీన్ తెలియచేశారు.

నానమ్మ చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు కృష్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా బ్రతిమలాడారు. కానీ అక్కడ 40 సంవత్సరాలు పాటు నాన్నమ్మతో కలిసి ఉన్నటువంటి కృష్ణ గారు ఆ జ్ఞాపకాలను విడిచి వెళ్లలేక అదే ఇంట్లోనే ఉండే వారిని నవీన్ తెలిపారు. ఇక కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబుతో నాకు మంచి బాండింగ్ ఉందని తెలిపారు.

Naveen: రమ్య రఘుపతి గారు నాతో మాట్లాడేవారు…


ఇప్పటికి కూడా మహేష్ అన్న రెండు మూడు రోజులకు ఒకసారి కాల్ చేసి నాతో మాట్లాడతారని లేదా నేనైనా తనుకు చేస్తూ ఉంటానని నవీన్ తెలిపారు. ఇలా మహేష్ గారితో తనకు మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు. ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ ఆమె నా వరకు చాలా మంచిగానే ఉండేదని ఎప్పుడు మాట్లాడిన మంచిగానే మాట్లాడించేవారు అంటూ ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. నాన్నతో ఆమెకు ఉన్నటువంటి గొడవలు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అని నా వరకు అయితే చాలా మంచిగా ఉండే వారని తెలిపారు.

Ghattamaneni Family: ఘట్టమనేని కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీని గుర్తించారా?

Ghattamaneni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఘట్టమనేని ఫ్యామిలీ ఒకటి. సూపర్ సార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈయన బాల నటుడిగాను హీరో గాను ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

da

తాజాగా మహేష్ బాబు కుటుంబానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది ఘట్టమనేని కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వాలిటీ ఉంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మరి మహేష్ బాబు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఈ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే… సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే అదే అలవాటు మహేష్ బాబుకి కూడా వచ్చింది ఈయన ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి పలు హాస్పిటల్స్ తో అనుసంధానం అయ్యి పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

Ghattamaneni Family: జాలి దయ అనే కామన్ క్వాలిటీస్ ఉన్నాయి…


ఇక మహేష్ బాటలోనే తన పిల్లలు కూడా నడుస్తున్నారు సితార ఇంత చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాను నటించిన మొదటి యాడ్ కి గాను ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఈ డబ్బు అంతటినీ కూడా ఈమె మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా సైకిళ్లు కొనిచ్చారు. ఇక గౌతమ్ సైతం మహేష్ బాబు ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చిన్నారులను పలకరించి వారికి కానుకలు ఇవ్వడమే కాకుండా వారి ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశారు. ఇలా ఘట్టమనేని కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా సహాయం చేయడం జాలి దయ అనే కామన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి.

Mahesh Babu: మహేష్ బాబు ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాల నటుడిగా సుమారు పది సినిమాలకు పైగా నటించినటువంటి ఈయన అనంతరం హీరోగా మారిపోయారు ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు ఏవి కూడా పాన్ ఇయర్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక హీరోగా మహేష్ బాబు ఇప్పటివరకు 27 సినిమాలు చేశారు. తన 28వ సినిమా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నేడు మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నేడు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇప్పటివరకు సినిమాలలో నటిస్తూ యాడ్స్ చేస్తూ సంపాదించినటువంటి ఆస్తులు ఎంత అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆయన ఆస్తులను ఏమాత్రం తీసుకోలేదని తెలుస్తుంది. కృష్ణ తన ఆస్తులు అన్నింటిని కూడా తన మనవడు మనవరాలు పేరిట రాశారట.

Mahesh Babu: వేల కోట్లు సంపాదించిన మహేష్…


ఈయన నమ్రతను వివాహం చేసుకోవడంతో నమ్రతనుంచి సుమారు 2000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కలిసి వచ్చాయని తెలుస్తుంది. ఇక పలు సినిమాలలో నటిస్తూ మహేష్ బాబు సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు ఒక యాడ్ వీడియో చేస్తే 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఏడాదికి సుమారు 200 కోట్లకు పైగా ఈయన ఆదాయం ఉందని తెలుస్తుంది.ఈ విధంగా మహేష్ బాబు సినిమాలలో కొనసాగుతూనే సుమారు 13 వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.

Mahesh Babu: ఈరోజు ఎంతో ప్రత్యేకం… ఇది మీకోసమే నాన్న.. వైరల్ అవుతున్న మహేష్ ట్వీట్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ గారి 81 వ జయంతి వేడుకలు నేడు జరగనున్నాయి. నేడు కృష్ణ గారి జయంతి కావడంతో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి జయంతిని పురస్కరించుకొని చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇలా మహేష్ బాబుట్విటర్ వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయబోతున్న సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ షేర్ చేశారు. ఇందులో మహేష్ బాబు తలకు ఎరుపు రంగు రిబ్బన్ కట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఇదంతా మీకోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు.

ఇలా మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్ ఈరోజు సాయంత్రం థియేటర్లో 6:03నిమిషాలకు విడుదల చేయనున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu: గుంటూరు కారం…


సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్స్ పెట్టాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక నేడు కృష్ణ గారి జయంతి కావడంతో ఆయన నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాని కూడా విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Naresh: మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తున్నా… నరేష్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!

Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల అయింది.

నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మళ్లీ పెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదని వారికి కూడా మా రిలేషన్ ఇష్టమేనని తెలియజేశారు. ఇక వీరి వ్యవహారంలోకి మహేష్ బాబు పేరుని కూడా లాగడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి మళ్లీ పెళ్లి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

Naresh: కృష్ణ గారికి అంకితం..


మే 31వ తేదీ కృష్ణగారి 81వ జయంతి వేడుక కావడంతో తన మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తాను అంటూ ఈయన కృష్ణ గారికి గురించి ప్రస్తావన తీసుకురావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని కృష్ణ గారికి అంకితం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ramesh Babu: రమేష్ బాబు మరణం గురించి బయటపడిన షాకింగ్ విషయాలు….అసలేం జరిగిందంటే?

Ramesh Babu: మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో సాధించి మంచి గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే. అయితే రమేష్ బాబు కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమై పలు వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రమేష్ బాబు గత ఏడాది మొదట్లో అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా రమేష్ బాబు మరణించిన తర్వాత తన తల్లి ఇందిరాదేవి అలాగే తండ్రి కృష్ణ గారు కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. ఇలా వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఘట్టమనేని ఫ్యామిలీని కృంగదీసిందని చెప్పాలి. కృష్ణ ఇందిరాదేవి వయసు పై పడటంతో మరణించారు. అయితే రమేష్ బాబు మరణం మాత్రం కుటుంబ సభ్యులను బాగా బాధించింది.

అసలు రమేష్ బాబు మరణించడానికి గల కారణాలను తాజాగా ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు రమేష్ బాబు మరణం గురించి మాట్లాడుతూ… రమేష్ బాబు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారని తెలిపారు. ఆయన ఇదివరకు గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారని ఆదిశేషగిరిరావు తెలిపారు.

Ramesh Babu: కార్డియాక్ అరెస్ట్


ఇలా పలుసార్లు గుండె సమస్యలతో బాధపడినటువంటి రమేష్ బాబుకి వైద్యులు స్టంట్ కూడా వేసి సర్జరీలు నిర్వహించారని, ఈ సమస్యల కారణంగానే రమేష్ బాబు మరణించినట్లు ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలియజేశారు. ఇక రమేష్ బాబుకి కూడా కుమారుడు, కూతురు ఉన్న విషయం మనకు తెలిసిందే. తన కుమారుడు ప్రస్తుతం ఉన్నత చదువులు నిమిత్తం విదేశాలలో ఉంటున్నాడని అయితే తనకు సినిమాలలోకి రావాలని చాలా ఆసక్తిగా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియచేశారు.

Pavitra Lokesh: కృష్ణ విజయ నిర్మల ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి… విజయనిర్మల షాకింగ్ కామెంట్స్!

Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ రిలేషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పవిత్ర లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ తిరిగి మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ బ్యానర్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. మాపై విజయనిర్మల కృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి…


మళ్లీ పెళ్లి అనే సినిమాని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఇందులో నరేష్ జీవిత కథ ఆధారంగా ఆయన జీవితంలో చేసుకున్నటువంటి పెళ్లిళ్ల గురించి చూపించబోతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో కృష్ణ కుటుంబ విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ట్రైలర్ లాంచ్ లో పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Namrata: నమ్రతను కోడలిగా కృష్ణ వద్దనడానికి నమ్రతకు ఉన్న ఎఫైర్స్ కారణమా?

Namrata:టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా ఘట్టమనేని కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన వంశీ సినిమాలో ఈమె మహేష్ కి జోడిగా నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. మహేష్ బాబుకు భార్య గాను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి కృష్ణ ఏమాత్రం ఒప్పుకోలేదట. ఇలా కృష్ణ ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు తన తండ్రిని బలవంతంగా ఒప్పించారని తెలుస్తోంది. అయితే నమ్రతను కృష్ణ తన ఇంటి కోడలుగా ఎందుకు అంగీకరించలేదు అనే విషయానికి వస్తే…

నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారట. తెలిసినటువంటి కృష్ణ మహేష్ బాబుకి నమ్రత కోడలుగా వద్దని భావించారట. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపక్ శెట్టి, మహేష్ మంజ్రేకర్ తో ఎఫైర్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది.అయితే మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఇండస్ట్రీలో కొనసాగకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Namrata: నమ్రత విషయంలో గర్వపడిన కృష్ణ…


ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఘట్టమనేని కుటుంబ బాధ్యతలను మోయటమే కాకుండా కుటుంబ పరువు ప్రతిష్టలను కూడా కాపాడుతూ ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు కోడలిగా వద్దనుకున్న కృష్ణ అనంతరం నమ్రత వినయ విధేయతలు ఆమె మంచితనం చూసి ఎంతో గర్వపడ్డారట.

Mahesh Babu: అమ్మ ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడనే…. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్..?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా నిలిచాడు. ఇదిలా ఉండగా తేడా అది మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి.

మొదట మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. రమేష్ బాబు మృతి చెందిన కొంతకాలానికే మహేశ్ బాబు తల్లి వసుంధర దేవి కూడా అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణించి ఆరు నెలలు కూడా గడవకముందే కృష్ణ గారు కూడా మృతి చెందారు. ఇలా తల్లి, తండ్రి, సోదరుడిని పోగొట్టుకొని మహేశ్ బాబు విషాదంలో మునిగిపోయారు. అయితే పోయిన వారు తిరిగి రారు కాబట్టి సినిమా షూటింగ్ పనులతో బిజీ అయ్యి ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నాడు.

ఇక తాజాగా తల్లి ఇందిరా దేవిని గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నేడు ఇందిరా దేవి పుట్టిన రోజు కావడంతో తల్లిని గుర్తు చేసుకుంటూ తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ… ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడను’. అంటూ ఎమోషనల్ అయ్యారు.

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మహేష్…


ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు కూడా ఇందిరా దేవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబుని ఓదారుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటించనున్నాడు.

Mahesh Babu: తల్లిదండ్రులు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. తనతల్లిదండ్రితో పాటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అన్నయ్య కూడా మరణించడం మహేష్ బాబుని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఈ విధంగా మహేష్ బాబు ఈ ఏడాదిలో ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఏడాది మొదట్లో మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణించారు.

ఇక సెప్టెంబర్ చివరి వారంలో మహేష్ తల్లి చనిపోగా నవంబర్ రెండవ వారంలో కృష్ణ మరణించారు. ఇలా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కృష్ణ ఇందిరా దేవి వారసుడిగా మహేష్ తన తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలన్నింటిని పూర్తి చేశారు.సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వారికి కర్మకాండలు చేసిన వారు తప్పనిసరిగా తలనీలాలు తీయించుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తల్లి అలాగే తన తండ్రికి కూడా వారసుడిగా కర్మకాండలను పూర్తిచేసిన గుండు మాత్రం తీయించుకోలేదు. ఈ క్రమంలోని ఇందుకు గల కారణాలు ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి కారణం తన అప్ కమింగ్ సినిమాలు అని మాత్రమే తెలుస్తుంది.

Mahesh Babu: సినిమాల కారణంగానే తలనీలాలు తీయలేదా…

ఇప్పటికే మహేష్ బాబు తల్లి మరణించడంతో తన సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తన తలనీలాలు కనుక తీసివేస్తే మహేష్ బాబు ఆ లుక్ రావడానికి మరింత ఆలస్యం అవుతుందని అదేవిధంగా మహేష్ బాబు హెయిర్ రియల్ హెయిర్ కాదు. సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల ఈయన తలనీలాలు ఇవ్వలేదని సమాచారం.