Tag Archives: mahesh

Comedian Mahesh: అవకాశం ఇస్తే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేస్తా… రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

Comedian Mahesh:జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ మెల్లిగా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు కమెడియన్ మహేష్.ఈయనకు రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చింది అయితే ఈ సినిమాలో తన పాత్రకు మంచి మార్కులు పడటంతో ఏకంగా రంగస్థలం మహేష్ గా మారిపోయారు.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేశ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని మాది ఈస్ట్ గోదావరి జిల్లా అని తెలిపారు.

ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు కష్టపడుతున్నారు. దేవుడి దయవల్ల నాకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటూ మహేష్ తెలిపారు. ప్రస్తుతమైతే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని ఒకవేళ ఎమ్మెల్యేగా టికెట్ వస్తే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు.

Comedian Mahesh: ఎంతో మంచి వ్యక్తిత్వం….

ఇక తాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించాను. పవన్ కళ్యాణ్ గారిది చాలా మంచి వ్యక్తిత్వం.షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి ఫుడ్ అయితే వస్తుందో అందరికీ కూడా అదే ఫుడ్ పెట్టాలని అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Namrata: ఆ డీల్ ప్రకారమే మహేష్ తో పెళ్లికి ఒప్పుకున్నా…. అసలు విషయం బయటపెట్టిన నమ్రత!

Namrata: మహేష్ బాబు భార్యగా, ఘట్టమనేని కోడలుగా, నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమ్రత అందరికీ సుపరిచితమే. ఈమె 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించారు.ఇలా మహేష్ బాబుతో కలిసి తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే ఈమె మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు.

ఇలా దాదాపు 5 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమ విషయాన్ని దాచిన ఈ జంట 25వ సంవత్సరంలో ఇంట్లో వారికి వీరి ప్రేమ విషయాన్ని తెలియజేసే చాలా సింపుల్ గా వీరి వివాహాన్ని చేసుకున్నారు. ఇకపోతే వివాహం అనంతరం నమ్రత సినిమాలకు దూరంగా ఉండి కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నమ్రత ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ…తాను మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకునే సమయంలోనే మా ఇద్దరి మధ్య ఒక డీల్ కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నామని తెలిపారు.పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో తాను పెళ్లయిన తర్వాత సినిమాలలో నటించననీ ఒక సాధారణ గృహిణిగా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటానని మహేష్ బాబుతో చెప్పాను.

Namrata: నమ్రత పై ప్రశంసలు కురిపిస్తున్న మహేష్ ఫ్యాన్స్….


నేను చెప్పిన మాటలు విన్న మహేష్ కూడా చాలా సంతోషించారు. ఇలా మా ఇద్దరి మధ్య ఈ డీల్ కుదుర్చుకున్న అనంతరం మేము వివాహం చేసుకున్నామని ఈమె తాజాగా వారి పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.దీంతో నమ్రత చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మహేష్ అభిమానులు ఘట్టమనేని కోడలు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈమెను చూసి నేర్చుకోవాలని మరికొంతమంది హీరోయిన్లను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Namrata: వారి వల్లే నాకు మహేష్ కు మధ్యలో గొడవలు… జీవితంలో బెస్ట్ అదే: నమ్రత

Namrata: నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి పేరు పొందారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు అయితే మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో ఈమె బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రత తన గురించి తన భర్త పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.మహేష్ బాబుతో పెళ్లి జరిగిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని అందుకే తాను సినిమాలకు దూరంగా ఉండి ఒక భార్యగా అమ్మగా పూర్తిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని తెలియజేశారు.

ఇక మహేష్ బాబుతో పెళ్లి జరిగినటువంటి సందర్భం నా జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటూ నమ్రత ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక మీకు మహేష్ బాబుకు ఏవైనా గొడవలు వస్తాయా అంటూ ప్రశ్నించగా మా ఇద్దరి మధ్య పిల్లల వల్ల గొడవలు తలెత్తుతాయని ఈమె తెలియజేశారు. పిల్లలు నన్ను ఏదైనా అడిగితే అది మంచిది కాకపోతే నో అని చెబుతాను.

Namrata: పిల్లలు ఏది అడిగినా మహేష్ నో చెప్పరు…


అందుకే పిల్లలు ఎప్పుడూ ఏదీ నన్ను అడగరని మహేష్ ని అడుగుతారని మహేష్ వారు ఏది అడిగినా నో అని సమాధానం చెప్పరని నమ్రత తెలిపారు. ఇలా పిల్లల వల్ల మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని ఈమె తెలియజేశారు.చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేయడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Actress Sangeetha: మహేష్ సినిమాలో చేసిన ఎలాంటి ఉపయోగం లేదు.. ఇప్పటికీ ఆ డైరెక్టర్ ను తిట్టుకుంటూనే ఉంటా: సంగీత

Actress Sangeetha: ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగుతో ఖడ్గం సినిమా ద్వారా అందరిని మెప్పించారు నటి సంగీత. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత అనంతరం ఖుషి ఖుషి సంక్రాంతి పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలలో నటించి నటిగా సందడి చేశారు.ఇలా పలు సినిమాలలో నటించిన సంగీత చివరిగా కారా మజాకా అనే చిత్రంలో నటించి తెలుగు తెరకు దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరికెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఈ సినిమాలో రష్మిక తల్లి పాత్రలో సంగీత నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగీత తాజాగా ఈమె నటించిన మసూద్ అనే హర్రర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఓ బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అని యాంకర్ ప్రశ్నించగా ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలగలేదని సమాధానం చెప్పారు. ఇప్పటికీ ఈ సినిమా డైరెక్టర్ ను తాను తిట్టుకుంటానని ఈమె వెల్లడించారు.

Actress Sangeetha: అనిల్ రావిపూడి కనపడితే తిట్టేస్తా…

ఇకపోతే ఈ సినిమా చేసే ముందు డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చే తనకు కథ వివరించారని, ఇప్పుడు కనుక డైరెక్టర్ కనపడితే రేయ్ నన్ను ఇలా చేసావ్ ఏంట్రా అని తిడతానంటూ ఈ సందర్భంగా ఈమె ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సంగీత రష్మిక తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.

Tollywood Stars: ఆ విషయంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను బీట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీస్?

Tollywood Stars: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునే వారు అయితే ప్రస్తుతం అన్ని తారు మారయ్యాయి బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఎంతో గొప్పగా చెప్పుకునే సెలబ్రిటీలు చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు అంటే బాలీవుడ్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

 

కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి. భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఎన్నో సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేస్తున్నాయని చెప్పాలి.
ఈ విధంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పూర్తి కష్టకాలంలో ఉంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఆసక్తి కనబరచడం గమనార్హం.

సినిమాల విషయంలో మాత్రమే కాదు..ఏకంగా యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి. సాధారణంగా ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటారు. గతంలో ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలో బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున నటించేవారు.

 

 

 

 

Tollywood Stars: అగ్రిమెంట్ రద్దు చేసుకొని మరి సౌత్ సెలబ్రిటీలకు అవకాశం…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసినటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ రష్మిక, మహేష్, సమంత వంటి సెలబ్రిటీలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు బాలీవుడ్ సెలబ్రిటీలతో కుదుర్చుకున్న అగ్రిమెంటు సైతం రద్దు చేసుకొని టాలీవుడ్ సెలబ్రిటీలకు అవకాశం కల్పిస్తున్నారు.ఇలా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా చివరికి యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి.

Sudheer Babu -Payal Rajputh: పాయల్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తా మంచి డ్రెస్ కొనుక్కో.. వేదికపైనే పాయల్ పరువు తీసిన సుధీర్ బాబు?

Sudheer Babu -Payal Rajputh: కృష్ణ మేనల్లుడిగా, మహేష్ బావగా సుధీర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈయన హీరోగా పలు సినిమాలలో నటించినా ఈయనకు ఏది సరైన బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని ఈయన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టితో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సుధీర్ బాబు హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా తాజాగా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు హాజరయ్యారు.ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం పాయల్ రాజ్ పుత్ వేసుకున్న డ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈమె తన ప్యాంటు మొత్తం చిరిగిపోయి ఉన్న విధంగా డిజైన్ చేశారు.ఇలా ఈ ప్యాంటు వేసుకొని రావడంతో ఒక్కసారిగా తన డ్రెస్సింగ్ స్టైల్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే సుధీర్ బాబు తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనసులో దాచుకోలేక తన డ్రెస్ పై దారుణమైన కామెంట్ చేశారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ పాయల్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను ఓ మంచి డ్రెస్ కొనుక్కో అంటూ వేదికపైనే తన పరువు తీశాడు.

Sudheer Babu -Payal Rajputh: అభిమానులకు ఇలా ఉంటేనే ఇష్టమేమో….

ఇలా పాయల్ డ్రెస్ గురించి సుదీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా అభిమానులను ఉద్దేశిస్తూ… మీరు ఒప్పుకోరేమో మీకు ఇలాగే బాగున్నట్టుంది అంటూ సుధీర్ బాబు మరో సెటైర్ వేశారు. మొత్తానికి ఈమె డ్రెస్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే అయినప్పటికీ సుధీర్ బాబు మాత్రం తన ఫీలింగ్ దాచుకోకుండా బయటకు చెప్పడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

MS Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి పుత్రుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాయి.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ప్రొడక్షన్ బ్యానర్ లో, ఆయనే దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌ .

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఒక మీడియాతో ముచ్చటించిన ఎమ్మెస్ రాజు ఇండస్ట్రీలో అగ్ర హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్టార్ హీరోలను ఏమాత్రం నమ్మనని కథను మాత్రమే నమ్ముతానని తెలిపారు. గతంలో రవితేజ, మహేష్, త్రివిక్రమ్, గుణశేఖర్ వంటి సెలబ్రిటీలు నాతో కలిసి సినిమా చేద్దాం అని అడిగారు.

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా సినిమా చేయమని అడిగితే నిర్మొహమాటంగా చేయనని సమాధానం చెప్పానని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ఒట్టేసి చెబుతున్నా… ప్రభాస్,మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు నాతో సినిమా చేస్తామని డేట్స్ ఇచ్చిన కూడా నేను వారితో సినిమా చేయను. కేవలం స్టార్ హీరోలని నమ్ముకుని నేను సినిమా చేయనని కథకు ప్రాధాన్యత ఇచ్చి కథ బాగుంటేనే సినిమా చేస్తానని తెలిపారు.

హీరోలను చూసి సినిమా చేయను..

నిజం చెప్పాలంటే తాను అగ్రహీరోలతో చేసిన సినిమాలకన్నా కథను నమ్ముకుని చేసిన మనసంతా నువ్వే సినిమాతో తనకు ఎక్కువగా లాభాలు వచ్చాయని,ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు నచ్చిన సినిమాలను మాత్రమే నేను చేస్తాను తప్ప హీరోలని చూసి సినిమా చేయనని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sada Nannu Nadipe: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ.. ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ప్రేమకథ?

Sada Nannu Nadipe: హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్ధన్ జంటగా నటించిన తాజా చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీక్ ప్రేమే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వీరితో పాటుగా ఈ సినిమా లో రాజీవ్ కనకాల,నాజర్, నాగేంద్రబాబు, అలీ, రంగస్థలం మహేష్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం,స్క్రీన్ ప్లే, సంగీతాన్ని హీరో ప్రతీక్ అందించారు.

కథ: ఇందులో మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహాని (వైష్ణవి పట్వర్దన్) ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఆమె ఎంత కాదన్నా కూడా ఆమెనే ఎంతో సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా మైఖేల్ జాక్సన్ ప్రేమని అంగీకరించడు. దీనితో మైఖేల్ జాక్సన్ ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ,మొత్తానికి మైఖేల్ జాక్సన్ సాహాని వివాహం చేసుకుంటాడు. కానీ సాహా మాత్రం పెళ్ళైన మొదటి రోజు నుంచే మైఖేల్ జాక్సన్ ని దూరం పెడుతుంది. పెళ్లి తర్వాత కూడా సాహా మైఖేల్ జాక్సన్ ను ఎందుకు దూరంగా పడుతుంది. దూరం పెట్టడానికి గల కారణం ఏమిటి? మరి మైఖేల్ జాక్సన్ చివరికి ఆమెకు దగ్గర అవుతాడా లేదా అన్న అంశాలతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు.

కథా కథనం విశ్లేషణ :ఈ సినిమా కంటే ముందు వచ్చిన కలిసుందాం రా, గీతాంజలి లాంటి సినిమాల మాదిరిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ ఎంతో అద్భుతంగా ఎమోషనల్ గా, స్వచ్ఛమైన ప్రేమకథతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడం జరిగింది. అయితే మనకు బాగా కావాల్సిన వ్యక్తి చనిపోతున్నారు అని తెలిసిన తరువాత వారితో గడిపిన ఆ చివరి క్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాం అన్నది ఇందులో బాగా చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే వచ్చు అన్న అంశాన్ని ఇందులో ఎమోషనల్గా తెరకెక్కించడంతో దానికి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు.

నటీనటుల పనితీరు :ఇందులో హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ ప్రేమ్ కరణ్ అద్భుతంగా నటించడంతో పాటుగా దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అదే విధంగా హీరోయిన్ కూడా తన పాత్రకు బాగా న్యాయం చేసింది. అలాగే ఇందులో కమెడియన్ ఆలీ ఉన్నంతవరకు బాగానే నవ్వులు పూజించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు :ఈ సినిమాలో సంగీతం బాగుంది. అలాగే నందు కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగా రిచ్ గా ఉంటుంది.

చిత్రం: సదా నన్ను నడిపే (UA)

రిలీజ్ డేట్: 2022-06-24

బ్యానర్: ఆర్ పి మూవీ మేకర్స్

నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , వైష్ణవి పట్వర్ధన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ తదితరులు

డీవోపీ: ఎస్ డి జాన్

ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , ప్రభు ప్రవీణ్

నిర్మాతలు: ఆర్ పి మూవీ మేకర్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్

రేటింగ్: 2.75/5

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

S.S Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన చేసిన సర్కారీ వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ పాట గురించి తమన్ ప్రస్తావిస్తూ తన కేవలం పల్లవి మాత్రమే చెప్పానని ఈ పాటను అనంతశ్రీరాం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా తమన్ వెల్లడించారు. అయితే ఈ సినిమాలో మ.. మ మహేషా అనే పాటను తమన్ కాపీ కొట్టారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

తమన్ సంగీతంలో ఈ విధంగా కాపీ మార్క్ రావడం ఇది మొదటిసారి కాదు ఈయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కాపీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా లోని ఈ పాట కాపీ ప్రస్తావన వచ్చింది. ఈ పాట గురించి తమన్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

మాకు ఎక్కడ అనిపించలేదు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దగ్గర 14 మంది పని చేస్తున్నారని, అలాగే మన దగ్గర ఎన్నో బెస్ట్ యాప్స్ కూడా ఉన్నాయి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి అయితే ఇలా ఎప్పుడు కాఫీ అనేది రాదని, అయితే అక్కడ అక్కడ సిమిలారిటీ ఉండొచ్చు కానీ నాకైతే ఈ పాట ఈ విషయంలో ఎక్కడ కాఫీ అనిపించలేదని, మాకి కంపోజ్ చేసేటప్పుడు ఏ మాత్రం తెలియలేదు. ప్రజలు చెప్పిన తర్వాత మాకే అర్థమవుతోంది. కంపోజ్ చేసేటప్పుడు ఫ్లోలో వెళ్లిపోయిందని మాకైతే ఎక్కడ కాపీ అనేది అనిపించలేదు అంటూ ఈ సందర్భంగా తమన్ తెలిపారు.

మహేష్ కుటుంబానికి దీపావళి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్ దంపతులు..!

దీపావళి పండుగ సందర్భంగా సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.దేశవ్యాప్తంగా జనాలు ఈ దీపావళి పండుగను నిన్న ఘనంగా జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాణాసంచాలను కాలుస్తూ ఈ పండుగను జరుపుకున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

పలువురు సెలబ్రిటీలు అయితే వారి స్టైల్ లో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి పండుగకు మహేష్ అభిమానులు, పవన్ అభిమానులు ఆనందించే సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ కి దీపావళి గిఫ్ట్స్ పంపించారు.

అవును మీరు విన్నది నిజమే స్వయంగా పవన్ కళ్యాణ్, అన్నాలెజినోవా దంపతులు మహేష్ బాబు ఫ్యామిలీకి దీపావళి కానుకలు పంపారు. పవన్ పంపిన గిఫ్ట్స్ లో స్వీట్స్, టపాకాయలు లాంటివి ఉన్నాయి.ఇక ఇదే విషయాన్ని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. థాంక్యూ అన్నా, పవన్ అని కామెంట్ పెట్టారు.ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో పవన్, మహేష్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. వారిద్దరి మధ్య ఇంతటి మంచి విశేషం జరిగితే ఇరు హీరోల అభిమానులకు పండగ అనీ చెప్పవచ్చు.అలాగే దర్శకుడు హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి లకు కూడా పవన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలతో కానుకలు పంపారు. పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రంలో నటించబోతున్నారు.. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.