Tag Archives: nellore

Kirak RP: ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్నేం చేయలేరు… నెగిటివిటీ పై స్పందించిన కిరాక్ ఆర్పీ!

Kirak RP: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఆర్పి అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు ఇలా ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఇలా హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఈయన ఓన్ బ్రాంచెస్ ఓపెన్ చేశారు.

ఇక హైదరాబాద్ బెంగళూరు విజయవాడ వంటి ప్రాంతాలలో ప్రాంచైజీస్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో సక్సెస్ఫుల్ కావడంతో కొందరు ఓర్చుకోలేక తన రెస్టారెంట్ బిజినెస్ పై దెబ్బ కొట్టాలని ఉద్దేశపూర్వకంగానే చేపల పులుసు రుచి బాగాలేదు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై ఆర్పి స్పందించారు.

ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ… పెయిడ్ బ్యాచ్ నన్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి నా చేపల పులుసు బిజినెస్ ను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా చేపల పులుసు రుచి బాగాలేదని ప్రచారం చేస్తున్నారు అయితే ఇలా ప్రచారం చేసిన నాకు వచ్చే నష్టం ఏమీ లేదని ఈయన తెలిపారు ఎందుకంటే నేను హై క్వాలిటీ పులుసును అందిస్తున్నాను కనుక నాకు ఎలాంటి భయం లేదని తెలిపారు.

Kirak RP: నాకు ఎలాంటి నష్టం లేదు…

నేను తయారు చేసే చేపల పులుసు కోసం నెల్లూరు నుంచి చేపలు తెప్పిస్తానని తెలిపారు.క్వాలిటీ విషయంలో తాను ఏ మాత్రం రాజీపడలేదు కనుక నా బిజినెస్ కి ఎలాంటి ఢోకా లేదని ఇలాంటి నెగటివ్ ప్రచారం చేసిన నాకు వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. ఒకవేళ రుచి బాగా లేకపోతే ఎంతోమంది స్టార్స్ చేపల పులుసు తీసుకోవడానికి ఇక్కడికి రారు.ఈ చేపల పులుసుకు చాలా డిమాండ్ ఉంది కొన్నిసార్లు అనుకున్న స్థాయిలో తానే సప్లై చేయలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా అర్పి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chaitanya Master: చైతన్య చనిపోవటానికీ అప్పులు కాకుండా ఏదో కారణం ఉంది: చైతన్య మేనమామ

Chaitanya Master: ఢీ ఫేమ్ చైతన్య మాస్టర్ తాజాగా ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఢీ షో ద్వారా డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య చాలా కాలంగా డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడనీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నెల్లూరులోనే ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చైతన్య మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన కెరీర్ కోసం, కుటుంబం కోసం చైతన్య మాస్టర్ అప్పులు చేశాడని, అయితే అప్పులు తీర్చే స్తోమత లేక మరణించాడని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైతన్య ఆత్మహత్య గురించి తాజాగా ఆయన మేనమామ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చైతన్య మరణానికి అప్పులు కారణం కాదని, మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.

లక్షల్లో అప్పు చేసే అవసరం చైతన్యకు లేదని తాను చిన్నప్పటినుండే హైదరాబాదులో ఉంటున్నాడని చైతన్య మేనమామ వెల్లడించాడు. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బు మీద అతన్ని కుటుంబం ఆధారపడలేదని, చైతన్యకి అవసరమైనప్పుడు అతని కుటుంబ సభ్యులే డబ్బు పంపేవారని ఆయన తెలిపాడు..అంతేకాకుండా ఇటీవల చైతన్య చెల్లి పెళ్లి కోసం కూడా ఒక రూపాయి ఇవ్వలేదని కుటుంబ సభ్యులే పెళ్లి భారాన్ని భరించారని ఆయన తెలిపాడు.

Chaitanya Master: పేమెంట్ ఆగిపోవడమే…


ఒకవేళ అప్పులు ఉన్న వేళల్లోనే కానీ లక్షల్లో అప్పులు చేసే అవసరం చైతన్యకి లేదని చైతన్య మేనమామ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చైతన్య మాస్టర్ మరణం గురించి తోటి డాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ ఇటీవల ఒక ఈవెంట్ ఒప్పుకున్నాడని అయితే కొంతమంది డాన్సర్లు అతనికి హ్యాండ్ ఇవ్వటంతో దాదాపు లక్షల్లో పేమెంట్ ఆపేసారని , అందువల్ల చైతన్య మాస్టర్ బయట అప్పు చేసి డాన్సర్లకు ఇచ్చినట్లు తెలుపుతున్నారు.

Dancer Jhansi: ఎందుకింత పని చేశావు అన్నయ్య… చైతన్య మృతి పై ఎమోషనల్ అయిన కండక్టర్ ఝాన్సీ!

Dancer Jhansi: డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరి ఆయన నెల్లూరు క్లబ్ హోటల్లో ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా చైతన్య ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి పలువురు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే పలువురు కొరియోగ్రాఫర్లు డాన్స్ మాస్టర్లు చైతన్య మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బస్సు కండక్టర్ ఝాన్సీ సైతం సోషల్ మీడియా వేదికగా చైతన్య మృతిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా చైతన్య మృతిపై ఝాన్సీ మాట్లాడుతూ ఎందుకు ఇంత పని చేసావ్ అన్నయ్య… మీరు తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో కుటుంబం మొత్తం బాధపడుతుంది.తాను డబ్బులు ఇవ్వాల్సిన వారితో కూర్చొని మాట్లాడాల్సింది తన పరిస్థితి ఇది అని చెప్పి ఉండాల్సింది.అందరూ కూడా మీతో కలిసి ప్రయాణం చేసిన వారే నా పరిస్థితి ఇది అని చెప్పి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో..

Dancer Jhansi: కళాకారులు కఠినాత్ములు కాదు…


మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించే అంత కఠినాత్ములు కాదు కానీ ఎందుకు ఇంత తొందర పడ్డావు అన్నయ్య అంటూ ఎమోషనల్ అయ్యారు.మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటి వారికి సహాయం చేసే గుణం మీది గత నాలుగు రోజుల క్రితం కూడా నేను తనని కలిసి ఒక డాన్స్ షోలో కనిపించాలనుకుంటున్నాను తనకు అవకాశం కల్పించండి అని అడిగితే తరువాత సీజన్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామంటూ తనకు మాట ఇచ్చారు కానీ ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం అంటూ ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు.

Rocking Rakesh: ఆర్పీ చేపల పులుసు వారు పెట్టిన భిక్ష… రాకింగ్ రాకేష్ కామెంట్స్ వైరల్!

Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పీ వంటి వాళ్ళు ఒకరు అయితే మల్లెమాల వారితో మనస్పర్ధలు కారణంగా ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ కార్యక్రమం అలాగే మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఆర్పీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రి పాయింట్ నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలోనే బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా ఈయన రెస్టారెంట్ గురించి నెగిటివ్ రివ్యూలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా తన రెస్టారెంట్లో ఫుడ్ ఏమాత్రం టేస్ట్ గా లేదంటూ నెగిటివ్ రివ్యూ రావడంతో ఈ వార్తలపై స్పందించిన ఆర్పీ కొందరు ఉద్దేశపూర్వకంగానే తన చేపలు పులుసు పై కుట్ర చేస్తున్నారని ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే అంటూ ఈయన ఈ వార్తలపై స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నీతిగా నిజాయితీగా చేస్తున్న తన బిజినెస్ ను దెబ్బతీయలేరని తెలిపారు.

Rocking Rakesh: వాళ్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు…

ఇదిలా ఉండగా తాజాగా మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయనకు ఆర్పీ రెస్టారెంట్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ పెట్టిన బిక్ష అంటూ కామెంట్లు చేశారు. మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు ఆర్పీను కలిసారా అని అడగడంతో అంత పెద్ద వాళ్లను కలిసే అదృష్టం తనకు ఇంకా రాలేదని మేము ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులం వాళ్లు పెద్దవాళ్లు అంటూ పరోక్షంగా ఆర్పీ పై విమర్శలు చేశారు. దీంతో రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kiraak RP: కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ లో నోరూరించే చేపల పులుసు వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని ప్రస్తుతం రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ఈయన రెస్టారెంట్ బిజినెస్ ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ రెస్టారెంట్లో నెల్లూరు నుంచి చేపల పులుసు తయారు చేయడంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారందరినీ తీసుకువచ్చారు. అలాగేనెల్లూరు స్టైల్ లో చేపల పులుసును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ వంటలన్నీ కూడా కట్టెల పొయ్యి పై వండడం ప్రత్యేకత.

ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ముందు కస్టమర్లు బారులు తీరి ఉంటారు.ఈ విధంగా రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయినటువంటి ఆర్పీ భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన రెస్టారెంట్లో చేపల పులుసు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Kiraak RP:

*బొమ్మిడాయిల పులుసు – 375 రూపాయలు

*చేప తలకాయ పులుసు – 200 రూపాయలు

*కొరమేను పులుసు  – 375 రూపాయలు

*రవ్వ చేపల పులుసు  – 285 రూపాయలు

*సన్న చేపల పులుసు _ 250 రూపాయలు

  • వైట్ రైస్ -75 రూపాయలు

*రాగి ముద్ద -100 రూపాయలు

నెల్లూరులో లోకేష్ పర్యటన!

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబీకులను లోకేష్ పరామర్శించారు. ఉద్యోగాలు లేకపోవడం వలనే నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని విమర్శించారు.

కాగా లోకేష్ పర్యటన సందర్భంగా నగరంలో యువత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాణ సంచా కాల్చారు

చెల్లెలి పై ఉన్న ప్రేమతో.. ఆమెకి తాళిని దూరం చేసిన అన్న?

ఆపదలు చెల్లెకు అండగా ఉంటానని మాట ఇచ్చిన అన్న చెల్లెలు క్షేమం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లెలు క్షేమంగా ఉండాలని ఏకంగా ఆమెకు తన పసుపు కుంకుమలను దూరం చేశాడు. చెల్లెళ్లను తన భర్త హింసిస్తున్నాడు అని తెలుసుకొన్న అన్న ఆవేశంతో ఏకంగా తన భావను హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

నెల్లూరులోని నవాబుపేట ఏరియాకి చెందిన సునీల్‌కి శైలజతో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వీరి కాపురం సజావుగా సాగిన తరువాత సునీల్ తరచూ మద్యం తాగి వచ్చి తన భార్యతో తరచు గొడవ పడేవాడు. కొన్నిసార్లు సునీల్ మితి మీరి ప్రవర్తించి శైలజ పై దాడి చేసే వాడు. ఈ క్రమంలోని శైలజ అన్న ఎలాగైనా తన బావకు బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే పోలీసులు సునీల్ ను పిలిపించి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.తర్వాత కొద్ది రోజులు మంచిగా ఉన్న సునీల్ ఆ తర్వాత యధావిధిగా తాగి వచ్చి తన భార్యను చితకబాది వాడు.ఈ విధంగా తన చెల్లెళ్లను రోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో శైలజా అన్న రాజు ఇక తన బావ నుంచి తన చెల్లెలుకు విముక్తి కల్పించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తన భావ సునీల్ ను అతి కిరాతకంగా చంపివేశాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడు సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

కత్తి మహేష్ కు రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స..!

ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ కు పెను ప్రమాదం తప్పింది.తాజాగా కత్తి మహేష్ వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో కత్తి మహేష్ కు తీవ్ర గాయలయ్యాని తెలుస్తుంది. తృటిలో ఇతనికి పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో మహేష్ కారు మొత్తం నజ్జు నజ్జు అయిపొయింది.

కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయలయ్యని తెలుస్తుంది.. ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ను చికిత్స నిమిత్తం నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల అయన బంధువులు అంధోల వ్యక్తం చేస్తున్నారు.

కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఏ విధంగా ప్రమాదానికి గురైనదనే విషయం తెలియలేదు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కత్తి మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు, వివాదాస్పద పోస్తులలో బాగా పాపులర్ అయ్యారు. అదే విధంగా రామాయణం గురించి కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిని కొన్ని రోజులపాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ చేసిన సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మహేష్ పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తున్న కత్తి మహేష్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆనందయ్య మందు పంపిణీ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే?

ప్రస్తుతం భారతదేశంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇతని దగ్గర మందు తీసుకున్నవారి ఆరోగ్యం నిమిషాలలో కుదుటపడుతుందని, ఈ మందు ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను దక్కించుకున్నారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆయుర్వేద మందు పై ప్రభుత్వం నిషేధం విధించి ఈ మందు పై CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) అధ్యయనం చేపట్టాలని సూచించింది. అయితే ఏ అధ్యయనానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా అధికారులు ఇప్పటి వరకు ఆనందయ్య దగ్గర ఎంతమంది మందు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు, అదేవిధంగా 42 మంది గ్రామస్తులు ఆనందయ్య వద్ద మందు తీసుకోలేదని చెబుతున్నారు. అయితే ఆనందయ్య దగ్గర మందు కోసం వచ్చిన వారు వచ్చినట్టుగా మందు తీసుకు వెళ్తున్నారని, ఎవరు కూడా అతనికి ఫోన్ నెంబర్ లేదా ఇతర వివరాలను కానీ తెలుపలేదని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితుల వివరాలు తెలియకపోతే ఈ అధ్యయనం ఏ విధంగా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలు తెలిస్తే తప్ప నివేదిక తయారు చేయలేమని అధికారులు తెలియజేశారు. ఇటువంటి సమయంలో ఆనందయ్య మందు పై అధ్యయనం చేయడం మరింత ఆలస్యం కావచ్చని, ఈ మందు ఇప్పట్లో పంపిణీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారి వివరాలు తెలిస్తే కానీ నివేదిక ఇవ్వలేరు,నివేదిక ఇవ్వకపోతే ప్రభుత్వం ఈ మందు సరఫరాకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబ సభ్యులు..!

టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయి ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కొందరు టిక్ టాక్ స్టార్ లు ఇప్పటికీ అదే రేంజ్ ను కంటిన్యూ చేస్తూ యూట్యూబ్ చానల్స్ ద్వారా వినోదాన్ని పంచుతారు.కొందరికి బుల్లితెరపై నటించే అవకాశం రాగా దుర్గారావు లాంటి వారికి ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇందులో భాగంగానే టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన షేక్ రఫీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

నెల్లూరు లో కెమెరామెన్ గా పనిచేస్తున్న షేక్ రఫీ అక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో టిక్ టాక్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇంత ఫాలోవర్స్ ఉన్న రఫీ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. రఫీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఓ అమ్మాయని తెలుస్తోంది. రఫీ స్నేహితుడైన ముస్తఫాతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే ముస్తఫా ఒక అమ్మాయితో ఎంతో చనువుగా వుండే వాడు. కానీ ఆ అమ్మాయి ముస్తఫాతో కన్న రఫీ తో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ముస్తఫా తన స్నేహితులతో కలిసి రఫీ పై దాడిచేశాడు. గాయాలతో ఇంటికి చేరుకోగా చికిత్స నిమిత్తం అతనిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

రఫీ తండ్రి రియాజ్ అనంతరం ముస్తఫా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా తన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముస్తఫా రఫీను మరింత ఎక్కువగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో ఎంతో మనస్తాపానికి గురైన రఫీ జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం ముస్తఫా వేధింపులే కారణమని రఫీ తల్లిదండ్రులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.