Tag Archives: pooja hedge

Pooja Hedge: ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ అవుతుంది.. మొదటిసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజ హెగ్డే!

Pooja Hedge: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలపరంగా కాస్త స్పీడ్ తగ్గించారనే చెప్పాలి.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపిన పూజా హెగ్డే ఎక్కువ ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గాయి.

ఇక ఈమె నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త స్లో అయిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాను కమిట్ అయిన పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంది.ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజా హెగ్డే మొదటిసారి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ కాస్టింగ్ కౌచ్ పైనోరు విప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పూజా హెగ్డే కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో ఇప్పటికి
కాస్టింగ్ కౌచ్ఉందని ఈమె తెలియజేశారు ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్స్ కావాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు.

Pooja Hedge: కఠినంగా శిక్షించాలి…


ఇలా తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి ఇండస్ట్రీలోకి వచ్చిన వారిని అవకాశంగా భావించి కొందరు దుర్మార్గులు వారి పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని అలా వేధింపులకు గురి చేసే వారిని కాల్చిపడేయాలని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఈ సందర్భంగా పూజ హెగ్డే కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే తాను మాత్రం ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కోలేదని తెలిపారు.

Pooja Hedge: అటువంటి దుస్తులను సౌకర్యంగా భావిస్తాను… పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్…?

Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిని పూజా హెగ్డే కూడా ఒకరు. ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో ఫ్యాషన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తుంటారు. ఇక పూజ హెగ్డే కూడా ఈ కోవకు చెందినదే.

ఒకవైపు సినీ ప్రయాణాన్ని, మరొకవైపు ఫ్యాషన్ ప్రయాణాన్ని సమానంగా కొనసాగిస్తూ అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఫ్యాషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇక ఈ ఇంటర్వ్యు లో మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏమిటి అని ప్రశ్నించగా..” సౌకర్యం అంటూ సమాధానం ఇచ్చింది. మన శరీరానికి,మన ఆలోచనలకు తగ్గట్టు ఉండే దుస్తులు ధరించినప్పుడు సౌకర్యంగా ఉంటుంది. అలా సౌకర్యంగా భావించినప్పుడు మనకు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాయి.

Pooja Hedge: ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి…


మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి అంటూ చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ కొత్తగా కనిపించటానికి ఇష్టపడతా. అందువల్ల బ్రాండ్స్ కి , డిజైన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ పూజా తెలిపింది. ఫ్యాషన్ గురించి పూజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే…ఇటీవల ” కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ” అనే సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఇక ప్రస్తుతం ఒక హింది సినిమాతో పాటు తెలుగులో మహేశ్ బాబు సరసన కూడా నటిస్తోంది.

Pooja Hedge: అలా ప్రచారం చేయాలంటే నాకు కారు గిఫ్ట్ గా ఇవ్వండి… పూజ హెగ్డే కామెంట్స్ వైరల్!

Pooja Hedge: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సరసన నటించిన తాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

సల్మాన్ ఖాన్ హీరోగా ఈమె నటించిన కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూజా హెగ్డే తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఇదివరకే ఈమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని అయితే ఈ విషయాలన్నింటినీ కూర్చొని అందరికీ సమాధానం చెప్పే సమయం తనకు లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఓ నిర్మాత పూజా హెగ్డే కు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.

Pooja Hedge: తప్పుడు ప్రచారాలు చేయొద్దు…

ఈ వార్తలపై కూడా పూజా హెగ్డే స్పందించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నా గురించి వచ్చే వార్తలన్నింటినీ కూడా నేను చదువుతూ ఉంటాను అయితే నాకు ఓ నిర్మాత ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.ఒకవేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలి అనుకుంటే తనుకు కారును గిఫ్ట్ గా ఇచ్చి ప్రచారం చేయవచ్చు అంటూ పూజా హెగ్డే ఈ సందర్భంగా తప్పుడు వార్తలను ఖండించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pooja Hedge: ఘనంగా పూజా హెగ్డే సోదరుడి వివాహం..ఎమోషనల్ నోట్ షేర్ చేసిన బట్టబొమ్మ ..?

Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల సౌత్ లో వరుసగా ప్లాప్ లు అందుకున్న పూజా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తన వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది.

తాజాగా పూజా హెగ్డే సోదరుడు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇంస్టాగ్రామ్ నోట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో పూజా హెగ్డే చాలా అందంగా ఎప్పుడూ లేనంత ఆనందంగా కనిపిస్తూ పెళ్లిలో హైలైట్ గా నిలిచింది. పూజా హెగ్డే సోదరుడు రిషబ్‌ హెగ్డే వివాహ వేడుక ఇటీవల చాలా ఘనంగా జరిగింది. శివానీశెట్టి అనే అమ్మాయిని రిషబ్‌ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది పూజా. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా పూజ ఎమోషనల్ అవుతూ..” నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక మొదలైన సందర్భం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. ఈ వేడుకలో నా ఆనందానికి ఆనందభాష్పాలు వచ్చాయి.

Pooja Hedge: సోదరుడి వివాహం సంతోషంలో పూజా హెగ్డే..

అన్నా మీరు మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అ నియంత్రితంగా ప్రేమిస్తారని, నిండు హృదయాన్ని అందిస్తారని, శాంతి, అవగాహనతో ముందుకు సాగుతారని ఆశిస్తున్నా” అంటూ ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బంగారు వర్ణం పట్టు చీరలో పూజా హెగ్డే కుందనపు బొమ్మలా అందరిని ఆకట్టుకుంటుంది.

Salman Khan -Pooja Hedge: సల్మాన్ పూజ డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ స్నేహితుడు.. ఏమన్నారంటే?

Salman Khan -Pooja Hedge: సినిమా సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంటుంది.ఓకే జంట రెండు మూడు సినిమాలలో కలిసి నటించిన లేదా కాస్త సన్నిహితంగా మెలిగిన వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తాయి. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు అఫైర్స్ ఉన్నాయంటూ ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉంటాయి.తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా ప్రముఖ క్రిటిక్ కె ఆర్ కె సైతం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ విషయాన్ని అందరికీ తెలియ చేయబోతున్నారు అంటూ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా సల్మాన్ స్నేహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఈ విధమైనటువంటి బాధ్యత రహితమైన వార్తలను వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ కు కూతురితో సమానం.

Salman Khan -Pooja Hedge:పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలు సృష్టించకండి…


ఈ విధంగా వారిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తే ఇలాంటి వార్తలను సృష్టిస్తారా? కొందరు మూర్ఖులు ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం వల్ల వాళ్లకు పబ్లిసిటీ వస్తుందని భావిస్తారు. అయితే ఈ విషయం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని సల్మాన్ స్నేహితుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే డేటింగ్ రూమర్లపై ఘాటుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సల్మాన్ స్నేహితుడు స్పందించడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పడినట్లు అయింది.

Salman Khan -Pooja Hedge: పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డ సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ట్రోల్స్!

Salman Khan -Pooja Hedge: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయసులోకి వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు అయితే ఈయన ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉండి వారితో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఆ హీరోయిన్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ మరోసారి నటి పూజా హెగ్డే ప్రేమలో పడ్డారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.ఇలా ఈయన పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డారనే ఈ విషయాన్ని కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారని.. ఈ క్రమంలోనే తన తదుపరి రెండు సినిమాలు కూడా సల్మాన్ ఖాన్ తోనే చేస్తున్నారనీ తెలిపారు.

ఇక షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వీరిద్దరూ పెద్ద ఎత్తున ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయటం మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరికొందరైతే ఇదేంటిరా అసలు సల్మాన్ ఖాన్ కి పూజ హెగ్డే కి కనెక్షన్ పెట్టడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Salman Khan -Pooja Hedge: సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమిస్తాడు అంతే పెళ్లి చేసుకోడు…

మరికొందరైతే సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమిస్తాడు అంతే పెళ్లి మాత్రం చేసుకోడు అంటూ వీరిద్దరి గురించి వస్తున్న వార్తలపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే తో ప్రేమలో ఉన్నారనే విషయం ప్రస్తుతం సంచలనం సృష్టించినప్పటికీ ఇది పూర్తిగా అవాస్తవమని కొందరు గట్టిగా నమ్ముతున్నారు.

Pooja Hedge: పూజా హెగ్డే పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్… మరింత ఆలస్యం కానున్న SSMB28!

Pooja Hedge:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే మహేష్ బాబు తల్లి తండ్రి ఇద్దరు మరణించడంతో మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.ఇలా ఆయన ఎంతో బాధలో ఉన్నప్పటికీ తన తండ్రి మరణించిన వారం రోజులకే సినిమా షూటింగుకు తాను సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ కు కబురు పంపారు.

ఇలా మహేష్ బాబు సినిమా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణం కేవలం పూజ హెగ్డే అని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నటి పూజా హెగ్డే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఆలస్యమైంది.

ఇక మహేష్ బాబు సినిమా షూటింగ్ కి సిద్ధమని కబురు పంపినప్పటికీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నారు.అందుకు గల కారణం ఈమె రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా వాయిదా వేసినట్టు సమాచారం.ఇలా పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత టాలీవుడ్ సినిమాలకు ఇవ్వలేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Pooja Hedge:బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ హెగ్డే..

ఈ విధంగా తెలుగు సినిమాల పట్ల ఏమాత్రం అంకితభావం లేనటువంటి పూజా హెగ్డేని వెంటనే ఈ సినిమా నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా బారిన పడ్డ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ బుట్టబొమ్మ తాజాగా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే నటి పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. పూజ కరోనా బారిన పడిన విషయం తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు covid-19 పాజిటివ్ గా తేలింది.ఈ క్రమంలోనే క్వారంటైన్ కి వెళ్లాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా జాగ్రత్తలను, ప్రోటోకాల్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పూజా హెగ్డే కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సినదిగా ఆమె తెలియజేశారు. ఈ సమయంలో నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పూజ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే పూజాహెగ్డే అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రాలలో నటించారు.అదేవిధంగా మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఎనిమిదేళ్ల తర్వాత ఆ పని చేయనున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న పూజాహెగ్డే ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా మంచి విజయాలను అందుకుంటూ చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు పూజా హెగ్డే. 2012 వ సంవత్సరంలో కోలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ‘ముగముది’సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం కోలీవుడ్‌లో ‘ముగముది’ అనే సినిమాలో నటించిన తరువాత ఎటువంటి కొత్త ప్రాజెక్టులను చేయలేదు. ఎనిమిదేళ్లలో ఇటు తెలుగు, హిందీ భాష లో వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ భామ ప్రస్తుతం తిరిగి
కోలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మాస్టర్ చిత్రం తర్వాత విజయ్ తన తర్వాత ప్రాజెక్టును నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే విజయ్ హీరోగా ఇది 65 చిత్రం కాగా ఇందులో కథానాయికగా పూజాహెగ్డేను తీసుకోవాలని దర్శకుడు దిలీప్ కుమార్ భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే దర్శకుడు పూజా హెగ్డే తో సంప్రదింపులు జరిపారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో అరుణ్ విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.అయితే ఈ విషయాలన్నీ ఇంటి గురించి చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తెలుగు లో పూజ హెగ్డే ప్రభాస్ సరసన “రాధేశ్యామ్” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.