Tag Archives: Poonam Kaur

Poonam Kaur: స్క్రిప్ట్ దొంగతనం చేయొచ్చు.. దానిని లాక్కోలేరు..మరోసారి మంట పెట్టిన పూనమ్?

Poonam Kaur: పూనమ్ కవర్ పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పరోక్షంగా ఈమె చేసే పోస్టులు మాత్రం సంచలనంగా మారాయి. ఇక ఈమె ఇటీవల రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుని సిగ్గు పడిన పూనమ్ కౌర్..?

అయితే తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. గతంలో ఈమె దాసరి నారాయణరావు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఎంతో హుందాగా నడుచుకునే వారని అందరికీ సమన్యాయం చేసేవారు అంటూ దాసరి గారి గురించి చెబుతూ తనని ఆరాధించేవారు.

తాజాగా దాసరి నారాయణరావు గారితో కలిసి దిగినటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి పూనమ్ దాసరి గారు ఇండస్ట్రీ పెద్దగా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా అందరికీ సమన్యాయం చేసేవారు. ఇక టాలెంట్ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించే విషయంలో ముందుంటారు. ఈయనే ఇండస్ట్రీకి అసలైన గురువు అంటూ ఈమె చెప్పుకోవచ్చారు.

అర్హత దాసరి గారికే..
ఇక కొంతమంది స్క్రిప్టులను దొంగతనం చేయవచ్చేమో కానీ ఆయన వద్ద నుంచి గురువు అనే పదాన్ని లాక్కోలేరని ఆ పదానికి సరైన అర్థం,ఆ బిరుదు అందుకొనే సమర్థత దాసరి నారాయణరావు గారికి మాత్రమే ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ పోస్టు సంచలనంగా మారింది..

Poonam Kaur: వైయస్ షర్మిలపై సెటైర్స్ వేసిన పూనమ్.. తన మౌనం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్!

Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో సంచలన తారగా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి పూనమ్ కౌర్ తరచు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈమె రాజకీయాలను కూడా టచ్ చేస్తూ చేస్తున్నటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ట్వీట్లు చేసినటువంటి ఈమె వైయస్ జగన్మోహన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈమె పొలిటికల్ లీడర్స్ ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెనాలికి చెందిన మహిళ గీతాంజలి ఇటీవల సోషల్ మీడియాలో టిడిపి జనసేన పార్టీ వాళ్లు చేసినటువంటి ట్రోల్స్ కు తీవ్రమైనటువంటి మనస్థాపానికి గురై ఈమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా జనసేన టిడిపి కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ కారణంగా ఈమె మరణించారని తెలుస్తుంది. అయితే ఈమె మరణం పట్ల ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ తనకు న్యాయం జరగాలి అంటూ పోస్టులు చేశారు. ఇక పూనమ్ కవర్ కూడా ఈమెకు న్యాయం జరగాలని నిందితులకు శిక్ష పడాలని కోరుకున్నారు.

గుణ పాఠం చెప్పాలి…
ఇక ఈ విషయం గురించి ఏపీ కాంగ్రెస్ పీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల మౌనంగా ఉండడంతో పూనమ్ షర్మిలపై సెటైర్స్ వేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం స్త్రీలు పిల్లల పట్ల ఎంతో కనికరంగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి ఘటన గురించి వైయస్ షర్మిల మౌనంగా ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ఈమె పోస్ట్ చేశారు. తెనాలిలోని మహిళలు, బాలికలు బయటకు వచ్చి వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Poonam Kaur: టీడీపీ జనసేన సీట్లు ప్రకటన.. కుక్క ఫోటోని షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన పూనమ్?

Poonam Kaur: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం కోసం ఇతర పార్టీలన్నీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.

ఈ క్రమంలోనే తొలి జాబితా కింద టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 99 అభ్యర్థులను ప్రకటించగా 94 టిడిపి అభ్యర్థులు కాగా మిగిలిన 5 సీట్లను జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ లిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి.

నాలుగు సీట్లు పొందడం కోసం ఒక పార్టీ పెట్టి తిరిగి ఆ పార్టీని టిడిపితో కలపడం దేనికి అంటూ పలువురు విషయంపై విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా ఈ విషయంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇవ్వటం వల్లే టీడీపీతో కుమ్మక్కయ్యారు అంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

జనసేనకు ఐదు…
ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా వేదికగా దివంగత నటి శ్రీదేవి కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి వైసీపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఏం టైమింగ్ అక్క మీది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు టైం చూసి కుక్క ఫోటో వదిలింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.

Poonam Kaur: యూస్ లెస్ ఫెలో అంటూ గురూజీని డైరెక్ట్ గా అటాక్ చేసిన పూనమ్.. ఏమైందంటే?

Poonam Kaur: పూనమ్ కౌర్ ఈమె హీరోయిన్ గా కంటే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచేవారు. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పోస్టులు చేసిన పరోక్షంగా ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉంటారు అయితే ఈమె ఎవరిని టార్గెట్ చేశారనే విషయం కూడా అంతు చిక్కదు.

ఇటీవల కాలంలో గురూజీ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేసినటువంటి ఈమె తాజాగా డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ తనపై అటాక్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ని ఉద్దేశించి పూనమ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఇదే విషయం గురించి ఈయన మాట్లాడుతూ జగన్ సిద్ధం అంటున్నారు మేము యుద్ధం అంటున్నాము. సినిమాలలో కూడా నేను పంచ్ డైలాగులు చెప్పడానికి ఇష్టపడను అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ నా చేత సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అనే డైలాగులు కూడా బలవంతంగా చెప్పించారు అంటూ పవన్ తెలిపారు.

పంచ్ డైలాగులు ఇష్టం లేదు..

ఇలా పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పూనమ్ స్పందిస్తూ యూస్ లెస్ ఫెలో అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా హాష్ టాగ్ తో త్రివిక్రమ్ పేరును కూడా జోడించింది. అయితే త్రివిక్రమ్ పై మీకు ఇంత కోపం ఉండటానికి కారణం లేకపోలేదు గతంలో పవన్ కళ్యాణ్ పూనమ్ విషయంలో ఈయన తనకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని అందుకే ఈమెకు త్రివిక్రమ్ అంటే పట్టరాని కోపం అని తెలుస్తుంది.

Poonam Kaur: భయంకరమైన వ్యాధి బారిన పడ్డ .. పూనమ్ బట్టలు వేసుకోవడం కష్టంగా ఉందంటూ?

Poonam Kaur: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన వారి పట్ల పరోక్షంగా పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన సమస్య గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె గత మూడు సంవత్సరాలుగా భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తనకు కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిందని తెలిపారు. మూడు సంవత్సరాలుగా తాను ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు.

ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉండడమే కాకుండా ఉదయం నిద్ర లేవగానే శరీరం మొత్తం బిగిసిపోయినట్టు అనిపిస్తుందని ఈమెకు తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి…

ఇలా తాను భయంకరమైనటువంటి వ్యాధి బారిన పడటంతో గతంలో కేరళలో కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నానని తెలిపారు. తాజాగా ఆయుర్వేద నిపుణులు అయినటువంటి మంతెన సత్యనారాయణ గారిని కలిసి ఈమె తన సమస్యకు తనని సలహాలు సూచనలు కూడా అడిగి తెలుసుకున్నారని అలాంటి ఒక గొప్ప వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ వెల్లడించారు.

Poonam Kaur: గుండె ముక్కలైంది.. చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో పై షాకింగ్ పోస్ట్ చేసిన పూనమ్!

Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యుత్తమైనటువంటి గౌరవం అందజేయడంతో సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి మరి తనని అభినందిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హారిక హాసిని క్రియేషన్ ప్రొడ్యూసర్ చిట్టిబాబుతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా చిరంజీవి త్రివిక్రమ్ ఇద్దరూ నవ్వుతూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలలో త్రివిక్రమ్ పూర్తిగా తనలోకి మార్చేశారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఈయన ఈసారి మాత్రం క్లీన్ షేవ్ తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నటి పూనం కౌర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసంతృప్తి వ్యక్తం చేసిన పూనమ్..

ఈమె సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఉంటారు ఈమె చేసే పోస్ట్ కు అర్థం ఏంటి అనే విషయాలు మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి. అయితే త్రివిక్రమ్ పట్ల తరచూ ఈమె పరోక్షంగా చేసే కామెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోటో ఫై ఈమె పూర్తిగా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోని చూస్తుంటే తన గుండె ముక్కలైంది అంటూ బ్రోకెన్ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Poonam Kaur: ఆ విషయంలో గురూజీ మంచి సమర్థుడే… త్రివిక్రమ్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్?

Poonam Kaur: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమాని త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారంగా చేసుకుని రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన దేనినైనా చేయగల సమర్థుడు అంతేకాకుండా దాని నుంచి ఎలాగా తప్పించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అంటూ కామెంట్ లు చేశారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా చేయగల నైపుణ్యం ఉన్నవారు.

కొంతమంది గుడ్డిగా నమ్ముతారు..

కొంతమంది ఆయనని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రజలకు సహాయం చేయడానికి రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం భారీగా సహాయం చేసిందని అది ఎందుకో ఇప్పటికి నాకు అర్థం కాదు అంటూ ఈమె గురూజీ త్రివిక్రమ్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఈమె పరోక్షంగా పవన్ పై కూడా సెటైర్స్ వేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Poonam Kaur: నీతులు చెబుతూ జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు: పూనమ్ కౌర్

Poonam Kaur: పూనమ్ కౌర్ నటిగా నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈమె ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈమె సినిమాల పరంగా సంపాదించిన క్రేజ్ కన్నా సోషల్ మీడియా వేదికగా చేసే వివాదాస్పద పోస్టులు ద్వారా వార్తల్లో నిలిచారు.ఈమె సోషల్ మీడియా వేదికగా ఒకరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా వారి గురించి సంచలనమైనటువంటి పోస్టులు చేస్తుంటారు.

ఈ విధంగా ఈమె చేసే పోస్టుల కారణంగా వార్తల్లో నిలిచారు. అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ విషయాల గురించి కూడా మాట్లాడుతూ పోస్టులు చేస్తుంటారు. అయితే గురుపౌర్ణమి సందర్భంగా ఈమె గురువు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. గురువును టామ్, డిక్ అని పిలవద్దని. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అంటూ నేటిజన్స్ తలలు పీక్కుంటున్నారు.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారా…

బహుశా ఈమె పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈమె ఇలా పరోక్షంగా గురువు గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. అయితే గతంలో పూనమ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.

Poonam Kaur: ఇది నిర్లక్ష్యమా… అహంకారమా పవన్ సినిమా పోస్టర్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్!

Poonam Kaur: వెండితెర సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు సంపాదించుకున్న దాని కన్నా సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి పూనమ్ కౌర్. ఈమె హీరోయిన్ గా నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇతర సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.ఇలా పలు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పోస్టర్లు సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ కాళ్ల వద్ద ఉంది ఈ విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ ఇది మీ అహంకారమా లేక నిర్లక్ష్యమా.భగత్ సింగ్ వంటి ఒక గొప్ప నాయకుడి పేరును ఇలా కాళ్ళ కింద పెట్టడం అంటే ఆ నాయకుడిని అవమానపరచడమే అంటూ ఈమె కామెంట్ చేశారు.

Poonam Kaur: కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటి…


ఈ విధంగా పూనమ్ కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అటెన్షన్ సీకర్ అంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసే ఫస్ట్ గ్లింప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈమె ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త డిస్టర్బ్ అయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం పూనమ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Poonam Kaur: నేను తెలంగాణ బిడ్డనే…నన్ను వేరు చేయకండి..నటి పూనమ్ ఎమోషనల్ కామెంట్!

Poonam Kaur: మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యారు నటి పూనమ్ కౌర్. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కాలేకపోయినా ఈమె మాత్రం ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు తరచూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఎంతో పేరు పొందారు.

ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేయడం వల్ల తాను చేసే వ్యాఖ్యలు కారణంగా వార్తల్లో నిలుస్తూ ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొని వేదికపై కంటతడి పెట్టుకున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ నేను తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగాను. కానీ నన్ను మాత్రం నా మతం పేరుతో వేరు చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Poonam Kaur: మతం పేరిట నన్ను వేరు చేస్తున్నారు…


నేను పంజాబీ అని, సిక్కు అని నా మతం చూసి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని, అలా నన్ను వేరు చేయకండి నేను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలపై పలువురు యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.