Tag Archives: property

Jayasudha: ఆ పొరపాటుతో వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న జయసుధ… అసలేం జరిగిందంటే?

Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని సీనియర్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోల సరసన నటించి మెప్పించినటువంటి వారిలో నటి జయసుధ ఒకరు ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ బామ్మ పాత్రలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జయసుధ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఆస్తులను కోల్పోవడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆస్తులను సంపాదించడానికి కూడా అదృష్టం ఉండాలని ఈమె తెలియజేశారు. తాను హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో చెన్నైలోని ఒక ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసే బిల్డింగ్ కట్టానని తెలిపారు.

ఇలా బిల్డింగు కట్టడంతో శోభన్ బాబు గారు చాలా మంచి పని చేశారు అంటూ నన్ను మెచ్చుకున్నారు అయితే ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ స్లంప్ రావడంతో రెంట్ కు కూడా ఎవరూ రాలేదు దీంతో ఆ బిల్డింగ్ అమ్మేశాను కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ బిజీ ఏరియాగా మారిపోయిందని ఇప్పుడు దాని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉందని తెలిపారు.

ఆ పొరపాట్లే కారణం..
ఇక చెన్నైలో తాను 9 ఎకరాల పొలం కొన్నాను. అందులో బోర్ పడకపోవడంతో తాను ఆ పొలం ఇక ఉన్న వేస్ట్ అని తాను అమ్మేశానని తెలిపారు. అయితే ఆ పొలం ఇప్పుడు వందల కోట్ల విలువ చేస్తుంది అంటూ జయసుధ ఈ సందర్భంగా తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లు కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను కోల్పోయాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jr.NTR: నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత ఇచ్చిన ఆస్తి ఎంతో తెలుసా..?

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాగే ఆయన వారసులుగా కొడుకు నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.

ఇదిలా ఉండగా నందమూరి తారకరామారావు సొంత ఊరు నిమ్మకూరు అంటే ఎంతో ఇష్టమని కనీసం 10 రోజులకు ఒకసారి అయినా అక్కడికి వెళ్లి కొంతకాలం ఉంటారని మంత్రి కొడాలి నాని వెల్లడించాడు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. కొడాలి నాని రాజకీయాలలోకి రాకముందు నుండి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. ఇప్పటికీ మీరు మధ్య ఆ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల వివరాల గురించి కొడాలి నాని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత ఆస్తి నుండి ఐదు ఎకరాలు వారసత్వంగా వచ్చిందని కొడాలి నాని తెలిపాడు. అయితే తన తాత గుర్తుగా సొంత ఊరిలో పొలం ఉండాలన్న భావనతో ఎన్టీఆర్ ఆ పొలాన్ని అమ్మకుండా దానికి తోడు మరొక 25 ఎకరాలు భూమి కొన్నాడని కొడాలి నాని చెప్పుకొచ్చాడు.

Jr.NTR: వారసత్వంగా వచ్చిన ఆస్తి…


ప్రస్తుతం నిమ్మకూరులో తాత వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమి విలువ 10 కోట్ల రూపాయల విలువ ఉంటుందని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ ఊరి కోసం నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో చేశారని, అయితే చంద్రబాబు మాత్రం తన అత్తగారింటికి ఒకరోజు కూడా వచ్చిన పాపాన పోలేదని చంద్రబాబుపై విమర్శలు కురిపించాడు.

Chakri Brother: అన్నయ్య భార్య ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్లి పోయింది.. ఆమెతో మాకు సంబంధం లేదు: చక్రి సోదరుడు

Chakri Brother: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, శివమణి, సత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించారు.

ఇలా సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చక్రి అనూహ్యంగా 2014వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. ఇలా చక్రి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇక తాజాగా ఈయన సోదరుడు మహిత్ నారాయణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చక్రి భార్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అన్నయ్య చనిపోక ముందు మా కుటుంబంలో ఎలాంటి గొడవలు విభేదాలు లేవు అన్నయ్య చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు వచ్చాయని తెలిపారు. అన్నయ్య చనిపోయారనే బాధ ఒకవైపు ఈ గొడవలు ఒకవైపు చాలా నరకంలా అనిపించిందని తెలిపారు.ఇక అన్నయ్య ఆస్తులలో కొన్నింటిని వదిన అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంది.

Chakri Brother: మరొక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది..


ప్రస్తుతం మాకు ఆవిడతో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవని మహిత్ వెల్లడించారు. ఇకమరి కొన్ని ఆస్తులు కోర్టులో ఉన్నాయని ఈ సందర్భంగా మహిత్ చక్రి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన పరారీ అనే సినిమాకి సంగీతం అందించారు. ఇలా తన ఫ్యామిలీ గురించి మహిత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kakinada Shyamala: మా ఆయన 600 ఎకరాల ఆస్తిని పోగొట్టారు… నటి కాకినాడ శ్యామల కామెంట్స్ వైరల్

Kakinada Shyamala: సాధారణంగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. సినిమాలలో మాత్రం తాగుడుకు చెడు అలవాట్లకు బానిసైన భర్తలను మార్చుకునే ఇల్లాలుగా నటించిన నిజ జీవితంలో మాత్రం తమ భర్తలను మార్చుకోలేక ఇబ్బంది పడుతున్న నటీమణులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.

ఇలాంటి కోవకు చెందిన వారే నటి కాకినాడ శ్యామల. ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అనంతరం ప్రొడ్యూసర్ గా కూడా మారారు.అయితే డిస్ట్రిబ్యూటర్ల మోసం వల్ల కొన్ని సినిమాలు విడుదల కాకపోగా మరికొన్ని సినిమాలు మంచిగా కలెక్షన్లు సాధించినప్పటికీ మోసపోయానని తెలిపారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన భర్త గురించి మాట్లాడుతూ తన భర్త మంచి రసికుడని తనకు ఎలాంటి పని పాట లేదని తెలిపారు. మా పెళ్లి తర్వాత మా మామయ్య మా ఆయనకు ఏకంగా 600 ఎకరాల ఆస్తిని రాసించారు. అయితే తాగుడుకు బానిసైన తన భర్త చివరికి 30 ఎకరాల ఆస్తిని మాత్రమే మిగిల్చారని ఈ ఆవేదన చెందారు.

Kakinada Shyamala: సంపాదనతో భార్య పిల్లలను పోషించే వారే నిజమైన మగాడు….

ఇలా తాగుడికి బానిసైన తన భర్తను తరచు తాను తిట్టేదాన్ని తెలిపారు. తన దృష్టిలో నిజమైన మగాడు అంటే తన సంపాదనతో భార్యాబిడ్డలను పోషించే వారే నిజమైన మగాడని తరచూ తన భర్తను కూడా ఇలాగే తిట్టేదాన్ని అంటూ ఈమె తెలిపారు. ఇక తన భర్త 63 సంవత్సరాల వయసులో కాలం చేశారని ఈ సందర్భంగా కాకినాడ శ్యామల తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి తెలియజేశారు.

Tamannaah: వామ్మో.. ఇన్నేళ్ల సినీ కెరియర్లో తమన్నా భారీగానే ఆస్తులు సంపాదించిందిగా… ఈమె ఆస్తి విలువెంతో తెలుసా?

Tamannaah: తమన్నా పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్నా గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గోవాలో తమన్నా నటుడు విజయ్ వర్మకు లిప్ లాక్ ఇవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి. మరి నిజంగానే తమన్నా విజయ్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారా లేదా అనే విషయం తెలియాల్సి.

తెలుగు చిత్ర పరిశ్రమకు తమన్నా శ్రీ అనే సినిమా ద్వారా పరిచయమైనప్పటికీ ఈమెకు మాత్రం హ్యాపీ డేస్ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో తర్వాత వరుస అవకాశాలను అందుకొని తమన్నా వెను తిరిగి చూసుకోలేదు.ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ భారీగా ఆస్తులు కూడ పెట్టినట్లు తెలుస్తుంది.

Tamannaah: కోట్లలో తమన్నా వార్షిక ఆదాయం…

తమన్న కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అలాగే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈమె ఏడాదికి సుమారు 12 కోట్ల రూపాయల వరకుసంపాదిస్తున్నారట ఇక ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ తమన్న ఏకంగా 110 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

Shoban Babu: అందంలోనే కాదు ఆస్తిలో కూడా సంపన్నుడే.. శోభన్ బాబు ఆస్తులు విలువ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

Shoban Babu: సోగ్గాడు అందాల నటుడు అంటే టక్కున అందరికీ శోభన్ బాబు గుర్తుకొస్తారు. తన అందంతో అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శోభన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శోభన్ బాబు తన వారసులని మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.

ప్రస్తుతం శోభన్ బాబు కుమారులు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.ఇకపోతే సినిమాలలో నటించిన శోభన్ బాబు సినిమాలలో నటిస్తూనే చాలా ముందు చూపుతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్నేహితుడు చంద్రమోహన్ శోభన్ బాబు ఆస్తులు గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ శోభన్ బాబు అందరిలాగా తన వారసులను ఇండస్ట్రీకి తీసుకురావడం కోసం తాపత్రయపడలేదు వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పారు. చెన్నైలో అన్నా నగర్ ఏరియాలో శోభన్ బాబుకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ తన ప్రాపర్టీస్ చూడడానికి ఒక పూట మొత్తం సరిపోతుందని చంద్రమోహన్ వెల్లడించారు.

Shoban Babu: వేల కోట్ల రూపాయలు ఆస్తిని కలిగిన శోభన్ బాబు…

శోభన్ బాబు అప్పట్లోనే ఒక ఎకరం 5000 రూపాయలతో కొనుగోలు చేశారు. ఇప్పుడు అక్కడ ఎకరం విలువ 50 కోట్ల వరకు ఉంది.ఇలా చెన్నైలో కొన్ని వందల ఎకరాల భూములను అప్పట్లోనే శోభన్ బాబు కొనుగోలు చేశారని అయితే ఇప్పుడు ఆ ఆస్తి విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చంద్రమోహన్ తెలిపారు. శోభన్ బాబు మరణించే సమయానికి ఆయనకు 80 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆస్తి మరింత పెరిగి ఉంటుందని చంద్రమోహన్ వెల్లడించారు. ఇలా ముందు చూపుతో అప్పట్లోనే భూమిని కొనుగోలు చేసిన శోభన్ బాబు అప్పటికి ఇప్పటికీ చాలా రిచెస్ట్ పర్సన్ అని చెప్పాలి.

Chiranjeevi: ఎవరి ఒత్తిడితోనో చిరంజీవి ఆస్తి అమ్మ లేదు.. ఆస్తి అమ్మకం వెనుక ఉన్న అసలు కథ ఇదే?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫిలింనగర్ లో ఉన్నటువంటి ఓ ఖరీదైన ఫ్లాట్ అమ్మారని గత రెండు రోజులగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం ఒక దినపత్రిక యజమాని ఒత్తిడి చేయడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ఆస్తిని దాదాపు 70 కోట్లకు అమ్మినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా చిరంజీవి ఆస్తి గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై మెగా సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు అమ్మారంటూ వస్తున్నటువంటి వార్తలలో కొంతవరకు మాత్రమే నిజం ఉందని కొన్ని మీడియా చానల్స్ అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవి ఆస్తి అమ్మారనీ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలను కొట్టి పారేశారు.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మొదట్లో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఆస్తికి భారీ మొత్తంలో డీల్ రావడంతోనే ఆయన ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ ఆస్తిని అమ్మినట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఫినిక్స్‌ అనే రియల్‌ ఎస్టేట్ సంస్థకు తన ఆస్తిని అమ్మారని వెల్లడించారు.

Chiranjeevi: భారీ డీల్ రావడం వల్లే…

ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సమస్త మెగాస్టార్ చిరంజీవి ప్రాపర్టీ కి ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేయడంతోనే తన ప్రాపర్టీకి మంచి ధర పలుకుతుందని భావించిన చిరంజీవి స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఈ ఆస్తిని అమ్మారని ఎవరో ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆస్తిని అమ్మలేదని క్లారిటీ ఇచ్చారు. ఒత్తిడి వల్లే చిరంజీవి అమ్మారంటూ వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

Shivaji Ganesan: ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీని శాసించిన దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ గణేషన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

ఇకపోతే శివాజీ గణేషన్ వారసులుగా ఇండస్ట్రీలోకి హీరో ప్రభు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అలాగే మరొక కుమారుడు రామ్ కుమార్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా శివాజీ గణేష్ వారసులుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి వివాదాలు చెలరేగాయి.

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

శివాజీ గణేషన్ మరణించి రెండు దశాబ్దాలు అయిన తరువాత ఈ విధంగా ఈ కుటుంబంలో ఆస్తి వివాదాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తమకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులను ఇవ్వకుండా మోసం చేశారని శివాజీ కూతుర్లు శాంతి, రాజ్వీ తన సోదరులు ప్రభు రామ్ కుమార్ లపై ఫిర్యాదు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.తమ తండ్రి మరణం తర్వాత ఏకంగా 271 కోట్ల రూపాయల ఆస్తులను సరిగా పంచకుండా అన్యాయం చేశారని వీరు ఆరోపించారు.

నకిలీ వీలునామాలు రాసి మోసం చేశారు…

తమకు తెలియకుండానే కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకున్నారని అయితే అలా అమ్ముకోవడం చెల్లదని కోర్టు ప్రకటించాలి అంటూ వీరి పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తి విషయంలోనే కాకుండా 1000 సవర్ల బంగారు ఆభరణాలు 500 కిలోల వెండి ఆభరణాలను కూడా తమ సోదరులు ప్రభు రామ్ కుమార్ అపహరణ చేశారంటూ వీరు కోర్టులో తమ సోదరులపై పిటిషన్ దాఖలు చేశారు. శాంతి థియేటర్లో 82 కోట్ల విలువైన వాటాలను తమ పేరుపై మార్చుకొని మోసం చేశారని పేర్కొన్నారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారంటూ వీరు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా శివాజీ గణేషన్ కుటుంబం ప్రస్తుతం ఆస్తి తగాదాలతో సోషల్ మీడియా వార్తల్లో నిలిచింది

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

soundarya: అలనాటి అందాలతార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య అదే పాపులారిటీతో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

ఈమె మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా ఉండిపోయారు.ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్ నాథ్ కూడా మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వీరిద్దరూ మరణించడంతో వీరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్తిపాస్తుల కోసం పెద్ద ఎత్తున గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మంజుల భర్త రఘు ఒక వైపు ఉండగా.. సౌందర్య సోదరుడు అమర్ భార్య మరోవైపు ఆస్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి 2 ఇండ్లు ఉండగా ఒకటి సౌందర్య, ఆమె సోదరుడు పేరు పై రాసి ఉండగా, మరొకటి అమర్ నాథ్ కుమారుడు సాత్విక్ పేరు పై ఉన్నట్లు సమాచారం.ఇకపోతే వీటితో పాటు హైదరాబాద్లో కొన్ని విలువైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.

కోర్టు మెట్లెక్కిన కుటుంబం..

ఈ ఆస్తి కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ భార్య తన కొడుకు ఆస్తిపాస్తులు సౌందర్య తల్లికి, భర్తకు దక్కకుండా కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు పలు ప్రశ్నలు వేయగ సౌందర్య తల్లి, భర్త దగ్గర సరైన సమాధానాలు లేకపోగా ఆస్తి మొత్తం సౌందర్య మేనల్లుడు సాత్విక్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన నటుడు ప్రదీప్!

Actors Pradeep:యాక్టర్ ప్రదీప్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రదీప్ ముఖ్యంగా బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన డాక్టర్ ప్రదీప్!

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అయితే ఒకానొక సమయంలో ఈయన ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకొని చివరికి ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తులు పోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ప్రదీప్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన డాక్టర్ ప్రదీప్!

తాను సంపాదించిన డబ్బు పోవడానికి కేవలం తనే కారణమని, కొందరిని గుడ్డిగా నమ్మి వ్యాపారాలు చేయడం వల్ల తన ఆస్తుల మొత్తం పోగొట్టుకున్నానని ఈ సందర్భంగా ప్రదీప్ వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.

ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు..

ఇలా డబ్బు మొత్తం పోగొట్టుకున్న సమయంలో చివరికి తాను ఉంటున్న ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉన్నాం అని ఆ తర్వాత అవకాశాలు రావడంతో పలు సినిమాలు సీరియల్స్ లో నటించి తిరిగి తన జీవితంలో సెటిల్ అయ్యానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రదీప్ తన ఆస్తుల విషయం గురించి వెల్లడించారు.