Tag Archives: pushpa 2

Allu Arjun: అల్లు అర్జున్ ను మూడు గంటల పాటు ఎండలో నిలబెట్టిన సుకుమార్… ఎందుకో తెలుసా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి అయితే ఈ సినిమాలో రిపోర్టర్ గా నటిస్తున్నటువంటి బిగ్ బాస్ బ్యూటీ దివి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు రిపోర్టర్ గా నటించడం అంటే మామూలు విషయం కాదని కొన్ని సన్నివేశాలలో నిజమైన రిపోర్టర్స్ తో కలిసిన నటించాల్సి వచ్చిందని ఈమె తెలియజేసారు ఇక సుకుమార్ గారు చిన్న సన్నివేశమైన చాలా పర్ఫెక్ట్ గా రావాలని భావిస్తారు అందుకోసం ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారని తెలిపారు.

40 టేకులు…
ఒక సన్నివేషంలో అల్లు అర్జున్ దాదాపు 40 టేకులు తీసుకున్నారని ఈ షార్ట్ కంప్లీటవ్వడం కోసం సుకుమార్ గారు అల్లు అర్జున్ ఎండలో దాదాపు 3 గంటల పాటు నిలబెట్టారు అంటూ సుకుమార్ ఫర్ఫెక్షన్ గురించి ఈ సందర్భంగా దివి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmika: పుష్ప భార్యగా నాపై బాధ్యత పెరిగింది.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందంతో కలిసి తాను కలిసి షూటింగ్లో పాల్గొనడం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారుని రోజులు నేను పుష్ప రాజ్ ప్రేయసిగా మాత్రమే ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం పుష్ప భార్య. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ లో ఎక్కువగా మసాలా ఉంటుందని తెలిపారు.

భార్యగా నాపై బాధ్యతలు పెరిగాయి…
డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని అయితే ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక పుష్ప సీక్వెల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Pushpa: మూడు భాగాలుగా రాబోతున్న పుష్ప.. సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్స్?

Pushpa: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న తరుణంలో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు మూడో భాగం కూడా రాబోతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో పలువురు ఈ వార్తలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనడం సరైన విషయం అయినప్పటికీ మూడు భాగాలుగా రాబోతుంది అనడం పెద్దగా ప్రేక్షకులు స్వీకరించలేకపోతున్నారు. ఇలా ఈ సినిమా మూడు భాగాలుగా విడుదలయితే మొదటికే మోసం వస్తుందని పలువురు భావిస్తున్నారు. మూడో భాగం చిత్రీకరణ కోసం రెండో భాగంలో కథను పెద్దగా చూపించారని దీంతో ఈ సినిమాకు మైనస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.

జనాలు ఇష్టపడరు..

ఇక అల్లు అర్జున్ కు పుష్ప సినిమా మాత్రమే కాకుండా ఇతర డైరెక్టర్లతో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక సుకుమార్ కూడా అల్లు అర్జున్ తోనే కాకుండా ఇతర హీరోలతో సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అంతేకాకుండా సినిమా చేయడానికి మహేష్ బాబు రామ్ చరణ్ వంటి హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక సినిమా నచ్చింది కదా అని వరుస పెట్టి ఆ సినిమాలను చేసుకుంటా పోతే జనాలు కూడా ఆ సినిమాలను పెద్దగా చూడరు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Pushpa 2: బెయిల్ మీద బయటకు వచ్చిన పుష్ప కేశవ.. వారి వల్లే బయటకు వచ్చాడా?

Pushpa 2: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి సన్నిహితంగా ఉన్నటువంటి కేశవ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేశవ పాత్రలో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి జగదీష్ అనే వ్యక్తి ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగదీష్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

తాను ప్రేమించిన అమ్మాయి తనకు తెలియకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో వారి ఫోటోలను తీసిన జగదీష్ ఆ ఫోటోలను చూపించి ఆ యువతని బెదిరించారు. తనకు దూరంగా ఉండకపోతే ఈ ఫోటోలను ఇంటర్నెట్లో పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక నిజంగానే అనంతపని చేస్తారన్న ఆ యువతి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఇలా ఆ యువతి మరణించడంతో తన ఆత్మహత్యకు జగదీష్ కారణమని పోలీసులు తనని అరెస్టు చేశారు కానీ పుష్ప టు సినిమాలో అల్లు అర్జున్ జగదీష్ మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉన్నాయి. దీంతో ఈయన జైలు పాలు కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని అందరూ భావించారు కానీ తనను బెయిల్ మీద బయటకు తీసుకురావడం కోసం పుష్పం మేకర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారని వారి వల్లే ఈయన బయటకు వచ్చారని తెలుస్తుంది.

పుష్ప 2 షూటింగ్లో కేశవ..

ఇలా ఈ విషయం గురించి ఎక్కడా అధికారక ప్రకటన లేకపోయినా ఈయన జైలు నుంచి సరాసరి పుష్ప షూటింగ్ లోకేషన్ కి వెళ్ళారని ముందుగా అల్లు అర్జున్ కేశవ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో ఒక భారీ సెట్ వేసి గంగమ్మ జాతరకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా యధావిధిగా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుందని చిత్ర బృందం ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

Anasuya: పుష్ప పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైన దాక్షాయని… పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టిన అనసూయ!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన అనసూయ అనంతరం వెండితెరపై వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇలా వెండితెరపై వరుస సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ తిరిగి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సునీల్ భార్యగా అనసూయ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. మొదటి పార్ట్ లో చాలా వైలెంట్ గా కనిపించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈమె పుష్ప 2 లో పుష్పపై పగ తీర్చుకునే పాత్రలో నటించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. పుష్ప సినిమాలో అనసూయ తమ్ముడిని పుష్పరాజ్ చంపడంతో తనపై పగ పెంచుకున్నటువంటి దాక్షాయని పాత్రలో అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి ఈమె అడుగుపెట్టడంతో తనకు మేకప్ వేస్తున్నటువంటి ఫోటోలను అలాగే షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈమె షేర్ చేశారు.

Anasuya: పుష్పపై పగ తీర్చుకొనున్న దాక్షాయని…


ఈ విధంగా అనసూయ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె పుష్ప 2 లొకేషన్ లోకి అడుగు పెట్టారని అర్థమవుతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ అనసూయ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేయడంతో ఈమె ఈ సెట్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అనసూయ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు,పుష్పరాజ్ పై ఏ విధంగా పగ తీర్చుకోపోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Rashmika: ఆ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక.. ఏకంగా 80 లక్షలు మోసం?

Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు మేనేజర్ లో ఉండడం సర్వసాధారణం.హీరో హీరోయిన్లకు అవకాశాలు రావాలన్న మేనేజర్ల కృషి ఎంతో ఉంటుంది అలాగే వారి ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలన్నా కూడా మేనేజర్ పాత్ర ఎంతో ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మేనేజర్లను నియమించుకొని వారి బాధ్యతలు అన్నిటిని వారికి అప్పజెబుతారు.సెలబ్రిటీలకు మంచి సినిమా అవకాశాలను కనుక తీసుకువస్తే మేనేజర్లకు కూడా భారీగా లాభాలు ఉంటాయి.

అందుకే సెలబ్రిటీలకు మేనేజర్లగా వ్యవహరించడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇదే అదునుగా భావించి చాలామంది మేనేజర్లు సెలబ్రిటీలను మోసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది సెలబ్రిటీలు మేనేజర్ల చేతిలో మోసపోయి కొన్ని లక్షలు కోట్ల రూపాయలను నష్టపోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నటి రష్మిక మందన్న సైతం తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా తన వద్ద మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి రష్మికకు తెలియకుండా దాదాపు 80 లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ చేశారని తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా ఆమెకు తెలియడంతో తీవ్రస్థాయిలో సదరు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనని తొలగించారని సమాచారం. ఈ విధంగా రష్మిక మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తుంది.

Rashmika:

ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉండగా తన వ్యవహారాలన్నింటిని మేనేజర్ చూసుకోవడంతో ఈమె పెద్దగా ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదట దీంతో ఆయన మోసానికి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి రష్మిక ఎక్కడ అధికారక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో పాటు ఇతర సినిమాల్లో షూటింగ్లలో కూడా బిజీ అయ్యారు.

Pushpa 2: లీక్ అయిన పుష్ప 2 యాక్షన్ సీన్స్ …వైరల్ అవుతున్న వీడియో!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి చిత్రం పుష్ప2. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఇలా సినిమా షూటింగ్ సమయంలో సినిమాకు సంబంధించి ఎలాంటి సన్నివేశాలు లీక్ అవ్వకుండా మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమా నుంచి ఎన్నో సన్నివేశాలు లీక్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము.

ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాల నుంచి కీలక సన్నివేశాలు లీకైన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటిని కట్టడి చేయడానికి మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాని పనిలా మారిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpa 2: భారీగా ఎర్రచందనం తరలింపు..


ఇందులో పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలిస్తున్నటువంటి లారీలను చేజ్ చేస్తూ ఉన్నట్టు ఈ వీడియోలో మనం చూడవచ్చు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్ని వేషాలు ఇలా లీక్ అవడంతో ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Pushpa 2: రోడ్డు ప్రమాదానికి గురైన పుష్ప2 ఆర్టిస్టులు… పలువురికి స్వల్ప గాయాలు!

Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం నిర్మాణ విషయంలో మేకర్స్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం బస్సులో తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే పలువురు ఆర్టిస్టులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా నార్కెట్ పల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బస్సును మరొక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది దీంతో ఆర్టిస్టులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇలా ప్రమాదం జరగడంతో స్పందించిన స్థానికులు గాయాల పాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ ప్రమాదంలో పలువురు గాయాలు పాలయ్యారని తెలుస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారని కేవలం స్వల్ప గాయాలు మాత్రమే తగిలాయని తెలుస్తుంది.ఇక ఈ విషయం తెలియగానే డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ క్షతగాత్రులను పరామర్శించినట్టు సమాచారం. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

Pushpa 2: పరామర్శించిన అల్లు అర్జున్.. సుకుమార్


ఇక పుష్ప 2సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

NTR: పుష్ప 2 సెట్ విజిట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్… ఫోటోలు వైరల్…?

NTR: ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప2 . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన పుష్ప సినిమా అందరి అంచనాలు తారుమారు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప 2 సెట్ లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామోజీ ఫిలింసిటీలో పుష్ప2 షూటింగ్ జరుగుతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ బ్రేక్ లో జూనియర్ ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ ని విజిట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.

ప్రస్తుతం పుష్ప 2 లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య పోటి ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇద్దరు మంచి స్నేహితులు.
ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ఆసక్తిగా ఉన్నాయి.

NTR: పుష్ప రాజ్ అడ్డాలో ఎన్టీఆర్..

అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎన్టీఆర్ విషెస్ చెబుతూ.. పార్టీ లేదా పుష్ప అని ఫన్నీగా కామెంట్ చేయడంతో వారి మధ్య ఉన్న బాండింగ్ కి ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇదే చనువుతో పుష్ప 2 సెట్ ని ఎన్టీఆర్ విజిట్ చేశాడు. దీంతో అటు బన్నీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

Sukumar: పుష్ప 2 తరువాత పాన్ ఇండియా హీరోతో సినిమా చేయనున్న సుకుమార్…. ఎవరంటే?

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. జగడం సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సుకుమార్ ఆ తర్వాత ఆర్య రంగస్థలం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక పుష్ప సినిమాతో దర్శకుడుగా సుకుమార్ స్థాయి మరింత పెరిగింది.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులతో సుకుమార్ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ సినిమా గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారింది.
పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా గురించి సుకుమార్ ఎక్కడ ప్రస్తావించలేదు. అంతే కాకుండా ఇప్పుడు ఆ ఊసే లేదు.

ఎక్కడ విజయ్ సుకుమార్ సినిమా గురించి టాక్ వినిపించడం లేదు. అయితే తాజాగా సుకుమార్ మరో స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు.

0

Sukumar: ప్రభాస్ తో సుకుమార్…

ఈ క్రమంలో ఇప్పటికే ఆది పురుష్, ప్రాజెక్ట్ కె , సలార్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో సుకుమార్ తో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తరువాత ప్రభాస్ కోసం సుకుమార్ కథ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది.