Tag Archives: rashmika

Rashmika: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. లిప్ లాక్ సన్నివేశాలపై రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నటి రష్మిక మందన్న కన్నడ నటి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతున్నటువంటి ఈమె ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు లిప్ లాక్ సన్ని వేషాలపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్,గీత గోవిందం వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాల్లో కూడా ఈమె లిప్ లాక్ సన్ని వేశాలలో నటించారు.అయితే ఈ సినిమాలలో లిప్ లాక్ సీన్లలో నటించడం వల్ల ఎలాంటి భావన కలిగిందనే విషయంపై రష్మిక స్పందించారు.

Rashmika: ఆ ట్రోల్స్ బాధపెట్టాయి..

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలలో నటించినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సన్నివేశాల గురించి వచ్చిన ట్రోల్స్ తనని చాలా బాధపెట్టాయని రష్మిక వెల్లడించారు. నేటిజన్స్ చేసిన ఆ ట్రోల్స్ గుర్తుచేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడపానని రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pushpa: పుష్ప సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది.. డైరెక్టర్ తేజ కామెంట్స్ వైరల్?

Pushpa:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం పుష్ప.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 9 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్ చేశారు. అందరూ అనుకున్నట్టు పుష్ప సినిమా హిట్ కాలేదని ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా సౌత్ ఇండస్ట్రీలో భారీ నష్టాలను ఎదుర్కొంది. ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. నార్త్ ఇండస్ట్రీలో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా హిట్ అయిందని టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారంటూ ఈయన కామెంట్ చేశారు. ఇలా నష్టపోవడానికి ఓ కారణము ఉందంటూ తేజ వెల్లడించారు.

Pushpa: బయ్యర్లు భారీగా నష్టపోయారు..

పుష్ప సినిమా విడుదల సమయంలో తెలంగాణలో కొంతమేర లాభాలు వచ్చినప్పటికీ ఆంధ్రాలో మాత్రం భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. తద్వారా సినిమా నష్టాలను ఎదుర్కొందని అయితే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రం టికెట్ ధర కన్నా అక్కడ దొరికే కూల్ డ్రింక్, పాప్ కార్న్ ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా చూసే పరిస్థితులు ఏర్పడలేదనీ డైరెక్టర్ పుష్ప సినిమా గురించి తెలియజేశారు.

Rashmika: లైగర్ సినిమా నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

Rashmika: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆ అంచనాలను చేరుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా చూసినటువంటి విజయ్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచడంతో భారీ ధరలకు బయ్యర్లు సినిమాని కొనుగోలు చేశారు.దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తీవ్రస్థాయిలో బయ్యర్లు నష్టపోయారు.

ఇక ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా రష్మిక లైగర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika: మాస్ సినిమాలంటే చాలా ఇష్టం..

లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తనకు మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చిందని ఈ సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా విజిల్స్ వేయడమే కాకుండా డాన్స్ కూడా చేశాను అంటూ ఈ సందర్భంగా రష్మిక ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.తనకు హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేదు మాస్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అందుకే లైగర్ సినిమా కూడా తనకు చాలా బాగా నచ్చిందని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి నేటిజన్స్ చర్చించుకుంటున్నారు.విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి ఫ్లాప్ అయినా ఈ సినిమా తనకు నచ్చిందంటూ రష్మిక కామెంట్లు చేస్తున్నారని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika: డాక్టర్ ను సంప్రదించిన రష్మిక.. అసలేమైందంటూ కంగారు పడుతున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మరోవైపు సినిమా షూటింగులతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా ఎంతో చలాకిగా ఉండే రష్మిక డాక్టర్ వద్దకు వెళ్లిందని తెలియగానే అసలు ఆమెకు ఏం జరిగింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈమె హైదరాబాద్లోనే ఆర్థోపెడిక్ గురువారెడ్డిని సంప్రదించినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా రష్మిక తన వద్దకు చికిత్స కోసం వెళ్ళినట్టు తెలియజేశారు.అయితే ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని ఆమె గత కొద్ది రోజులుగా మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడటం వల్ల చికిత్స కోసం తన వద్దకు వచ్చిందని ఈయన తెలియజేశారు.

రష్మిక సామి సామి అంటూ డాన్స్ చేస్తూ బరువు మొత్తం మోకాలి పై వేయటం వల్ల ఇలా నొప్పులు వచ్చాయి. అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లికి సరదాగా పెద్దవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి అభినందించాలనుకున్నాను అయితే మోకాలి నొప్పి ద్వారా నన్ను కలిసే సందర్భం వచ్చిందని డాక్టర్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Rashmika: భుజం నొప్పి అంటూ బన్నీ వస్తాడేమో…

ఇలా రష్మిక మోకాళ్ళ నొప్పుల గురించి ఈయన తన ఫేస్ బుక్ స్టోరీ ద్వారా షేర్ చేయడమే కాకుండా త్వరలోనే అల్లు అర్జున్ కూడా తన వద్దకు వస్తాడేమో తనకు కూడా భుజం నొప్పిగా ఉందంటూ వస్తాడేమోనని ఈ సందర్భంగా డాక్టర్ గురువారెడ్డి ఫేస్ బుక్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Puspha Movie: సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా అవార్డుల మోత.. ఎన్ని అవార్డ్స్ దక్కించుకుందంటే…?

Puspha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గతేడాది విడుదలైన సూపర్ హిట్ సినిమా పుష్ప. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ఇండస్ట్రీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్ ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల 2022 సైమా అవార్డ్స్ ఫంక్షన్ ని బెంగుళూరులో చాలా ఘనంగా నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన ఈ వేడుకకు టాలివుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు.
ఈ ఏడాది సైమా అవార్డు వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో హిట్ సినిమాలు నామినేషన్ లో ఉన్నాయి.ఈ క్రమంలో జాతి రత్నాలు, అఖండ, ఉప్పెన, పుష్ప వంటి సినిమాలు సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యాయి.

ఈ సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా అన్ని కేటగిరీలలో అవార్డ్స్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డు సొంతం చేసుకోగా .. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహనటుడు, ఉత్తమ సాహిత్య రచయిత, ఉత్తమ చిత్రం ఇలా మొత్తం ఆరు కేటగిరీలలో పుష్ప సినిమా 6 అవార్డులు సొంతం చేసుకుంది.

Puspha Movie: రెండు సార్లు సైమా అవార్డ్ అందుకున్న బన్నీ..

సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నవన్నీ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్..” పుష్ప సినిమాలో నా నటనను ఆదరించిన ప్రేక్షకులకు నాకు నా కృతజ్ఞతలు. సైమా అవార్డ్స్ లో రెండవసారి ఇలా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది” అంటూ అల్లు అర్జున్ పోస్ట్ షేర్ చేశాడు. పుష్ప సినిమా ఇలా ఆరు కేటగిరీలలో అవార్డ్స్ సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tollywood Stars: ఆ విషయంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను బీట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీస్?

Tollywood Stars: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునే వారు అయితే ప్రస్తుతం అన్ని తారు మారయ్యాయి బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఎంతో గొప్పగా చెప్పుకునే సెలబ్రిటీలు చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు అంటే బాలీవుడ్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

 

కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి. భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఎన్నో సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేస్తున్నాయని చెప్పాలి.
ఈ విధంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పూర్తి కష్టకాలంలో ఉంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఆసక్తి కనబరచడం గమనార్హం.

సినిమాల విషయంలో మాత్రమే కాదు..ఏకంగా యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి. సాధారణంగా ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటారు. గతంలో ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలో బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున నటించేవారు.

 

 

 

 

Tollywood Stars: అగ్రిమెంట్ రద్దు చేసుకొని మరి సౌత్ సెలబ్రిటీలకు అవకాశం…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసినటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ రష్మిక, మహేష్, సమంత వంటి సెలబ్రిటీలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు బాలీవుడ్ సెలబ్రిటీలతో కుదుర్చుకున్న అగ్రిమెంటు సైతం రద్దు చేసుకొని టాలీవుడ్ సెలబ్రిటీలకు అవకాశం కల్పిస్తున్నారు.ఇలా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా చివరికి యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి.

Rashmika: రాజకీయాలలోకి రానున్న రష్మిక.. వైరల్ అవుతున్న వేణు స్వామి కామెంట్స్?

Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి రష్మిక ఒకరు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే నటి రష్మిక గురించి గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. రష్మిక స్టార్ నటిగా కొనసాగడం కోసం తన ఇంట్లో పూజలు చేయించుకున్నారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి రష్మిక గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి నటి రష్మిక కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు అంటూ ఈయన ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Rashmika: సినీ ఇండస్ట్రీకి దూరమవుతారా…

ఈ విధంగా ఈయన రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన నెటిజన్స్ కొంచెం స్టార్ డమ్ వస్తేనే రాజకీయాలలోకి రావడం ఏంటి ఇలా రాజకీయాలలోకి వస్తే రష్మిక కెరియర్ పూర్తిగా దెబ్బతింటుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి వేణు స్వామి చెప్పిన విధంగానే రష్మిక రాజకీయాలలోకి వచ్చి సినీ కెరియర్ నాశనం చేసుకుంటుందా లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Krithi Shetty: నితిన్ సినిమాను రష్మిక రిజెక్ట్ చేస్తేనే కృతి శెట్టికి అవకాశం వచ్చిందా.. రష్మిక రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా?

Krithi Shetty: నితిన్,కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన ముందుగా నటించే అవకాశం కృతి శెట్టికి కాకుండా నేషనల్ క్రష్ రష్మికకు అవకాశం వచ్చింది.అయితే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఆమె స్థానంలో కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో నితిన్ రష్మిక ఇద్దరు జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని భావించారు.అయితే భీష్మ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ రష్మిక మధ్య ఏదో మనస్పర్ధలు తలెత్తాయని ఆ కారణం చేత రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వస్తున్నాయి.

Krithi Shetty: నితిన్ తో మనస్పర్ధలే కారణమా….

ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి మరో కారణం కూడా తెలుస్తోంది. రష్మిక అప్పటికే పలు సినిమాలకు కమిట్ కావడం వల్ల తనకు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మాత్రం ఈ సినిమాని వదులుకుంటేనే కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

Rashmika: ఇది మరీ టూ మచ్.. టాలీవుడ్ క్రేజీ హీరో ని గుర్తుపట్టలేవా రష్మిక.. బాలీవుడ్ ముఖాలే గుర్తుంటాయంటూ భారీ ట్రోలింగ్?

అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో పలు చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమెలో ఏం టాలెంట్ గుర్తించారో తెలియదు కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం తను నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఈమెకు వరుస అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కించారు.

ఇలా స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా కొన్నిసార్లు నేటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అయితే రష్మిక సోషల్ మీడియాలో కాస్త ఓవర్ చేస్తారనేది నేటిజన్ల అభిప్రాయం.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన పోస్ట్ పై ప్రస్తుతం భారీ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఒక యాడ్ షూట్ కోసం ట్రెండీ లుక్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Rashmika: అల్లు అర్జున్ గుర్తించలేకపోయిన రష్మిక..

ఈ ఫోటో చూసిన రష్మిక ఓ మై గాడ్ ఒక్క క్షణం పాటు గుర్తుపట్టలేకపోయాను సార్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. అయినా నీకు టాలీవుడ్ హీరోలు ఎందుకు గుర్తుంటారులే..కేవలం బాలీవుడ్ ముఖాలు మాత్రమే గుర్తుంటాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇది చాలా టూమచ్ అల్లు అర్జున్ గుర్తుపట్టలేకపోవడం ఏంటి అంటూ ఈమె పై భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక తన పోస్టుతో తానే చిక్కుల్లో పడింది.

Rashmika: నేను రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోలేదు.. ఏడేళ్లు కష్టపడ్డాను ఎన్నో వదులుకున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక

Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఏకంగా పాన్ ఇండియా సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు నటి రష్మిక.ఇలా ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాడమే కాకుండా రోజురోజుకు తనకు అభిమానులు పెరగడంతో ఎంతో డిమాండ్ ఏర్పడింది.

ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసి వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న రష్మిక క్రేజ్ చూసి ఎంతోమంది హీరోయిన్ల అభిమానులు కుళ్లుకుంటూ ఉన్నారు.ఈమె కన్నా ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నప్పటికీ ఇలా బాలీవుడ్ అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారని రష్మిక అభిమానులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఈమెకు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా వచ్చిందని అందుకే ఇలా తొందరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన రష్మిక తాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ కాలేదని తన స్టార్డం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని తెలిపారు.

Rashmika: ఎన్నో త్యాగాలు చేశాను..

ఈ సందర్భంగా రష్మిక స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తాను రాత్రికి రాత్రి సెలబ్రిటీ కాలేదని, అదృష్టాన్ని తన వెనుక తిప్పుకోలేదని తాను ఈ స్థాయికి రావడానికి ఏడు సంవత్సరాలు కష్టం పడ్డానని, ఈ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో బాధలు దిగమింగుకున్నాను, ఎన్నో త్యాగాలు చేశానని రష్మిక కెరియర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ సందర్భంగా వెల్లడించారు. హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవాలంటే ఒక రాత్రి సరిపోదు ఎంతో ఓపిక శ్రమ పట్టుదల కావాలని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. ఇలా రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.