Tag Archives: Siddharth

Siddharth -Aditi Rao: సహజీవనం చేస్తున్న నటుడు సిద్దార్థ్ అదితి రావ్.. మరి పెళ్లి సంగతేంటి..?

Siddharth -Aditi Rao: బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్ వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొంది ఎంతోమంది యువతకు అభిమాన హీరోగా నిలిచాడు సిద్దార్థ్. ఆ తర్వాత సిద్ధార్థ నటించిన సినిమాలు సరైన హిట్ అందుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మఖాం వేశాడు. అయితే అక్కడ కూడా సరైన హిట్లు లేక చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమా ద్వారా సిద్ధార్థ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు నష్టాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా ద్వారా నిర్మాతలు నష్టపోయిన కూడా సిద్ధార్థ మాత్రం బాగా లాభపడ్డాడు. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవడమే కాకుండా ఇక హీరోయిన్ అదితి రావుతో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.

ఆ తర్వాత వీరిద్దరూ కూడ రిలేషన్ లో ఉన్నారని, అంతేకాకుండా సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఇటీవల హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇలా కపుల్స్ లాగా వీరిద్దరూ శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి హాజరు కావడంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి నిజమే కానీ పెళ్ళికి మాత్రం నో చెబుతున్నట్లు తెలుస్తోంది.

Siddharth -Aditi Rao: పెళ్లికి నో అంటున్న సిద్ధార్థ అదితి..

ఎందుకంటే గతంలో కూడా వీరిద్దరికీ వివాహం అయ్యి విడాకులకు కూడా తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి వివాహం చేసుకొని ఆలోచన లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరూ ఎంత కాలం ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తారో చూడాలి మరి.ఇలా వీరి రిలేషన్ గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

Aditi Rao -Siddharth: శర్వానంద్ నిశ్చితార్థంలో సందడి చేసిన అదితి రావు, సిద్ధార్థ్… వీరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా?

Aditi Rao -Siddharth: టాలీవుడ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.ఈయన నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. రామ్ చరణ్ దంపతులతో పాటు నాగార్జున దంపతులు చిరంజీవి దంపతులు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలలో నటి అదితి రావు హైదరి నటుడు సిద్ధార్థ్ కూడా సందడి చేయడం గమనార్హం.

గత కొద్దిరోజులుగా అదితి రావు సిద్ధార్థ్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. అలాగే నటి అదితి రావు పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హాట్ అంటూ తనకు స్పెషల్ విషెస్ తెలియజేయడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ కు మరింత బలం చేకూరింది.

ఇలా తరచూ వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇద్దరిలో ఎవరు కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే వీరి గురించే వచ్చే వార్తలు నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి శర్వానంద్ నిశ్చితార్థానికి రావడంతో మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ నిశ్చితార్థ కార్యక్రమంలో సిద్ధార్థ్, అదితి ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Aditi Rao -Siddharth: మహాసముద్రం సినిమాలో జోడిగా నటించిన అదితి,సిద్ధార్థ్

ఇకపోతే శర్వానంద్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాల్లో సిద్ధార్థ్ కు జోడిగా అదితి రావు హైదరి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండడంతోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు బలమయ్యాయి. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థంలో సందడి చేయడంతో వీరి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Sharwanand: సిద్ధార్థ్ అదితీ రావు హైదరి రిలేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన శర్వానంద్.. ఏమన్నారంటే?

Sharwanand: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ అతిథి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కలిసే పలుసార్లు మీడియా కంటపడటమే కాకుండా అదితి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక యువరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇకపోతే సిద్ధార్థ్ అతిధి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాలయ్య శర్వానంద్ ప్రశ్నిస్తూ మీ సినిమాలో హీరోయిన్లను ఎలా ఎంపిక చేసుకుంటారని ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ హీరోయిన్ల విషయంలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదని డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేయడమేనంటూ సమాధానం ఇచ్చారు. మరి అదితీ సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ మహాసముద్రం సినిమాలో తను నటించింది అయితే తాను సిద్ధార్థ్ కి జంటగా నటించిందని తెలిపారు. శర్వానంద్ ఇలా చెప్పగానే రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్ధార్థకి జంటగా మారిందా అని ప్రశ్నించడంతో శర్వానంద్ నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పారు.

Sharwanand: నిజజీవితంలోనూ సిద్ధార్థకు జంటగా అదితీ..

వీరి రిలేషన్ గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తను హృదయపూర్వక యువరాణి అని పోస్ట్ చేసినప్పుడు నాకు కూడా వారు రిలేషన్ లో ఉన్నారేమో అనిపించింది అంటూ ఈయన వారిద్దరి రిలేషన్ గురించి సమాధానం చెప్పారు. అంటే పలికిందంటావా అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ఏమో పలికిందేమో అటు శర్వానంద్ సమాధానం చెప్పారు.

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

Jabardasth Movie:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతా విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత ఈ ఏడాది శాకుంతలం, యశోద వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సమంత నాగ చైతన్య ప్రేమలో పడకు ముందు ఈమె హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటం.వల్ల వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత సిద్ధార్థ్ 2013వ సంవత్సరంలో నటించిన సినిమా జబర్దస్త్. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అనుష్క శర్మ జంటగా నటించిన బ్యాండ్ బాజా భారత్ అనే చిత్రాన్ని కాపీ చేశారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

ఈ విషయంపై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టుకి కూడా వెళ్ళింది.ఇకపోతే ఈ సినిమా సమయంలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమంత సిద్దార్థ్ కిమంచి క్రేజ్ ఉండేది ఈ క్రమంలోనే వీరికి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకున్న డైరెక్టర్ లింగుస్వామి జబర్దస్త్ సినిమాని తమిళంలో డబ్ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశారు.

ఆ కారణం వల్లే సిద్ధార్థ్ తో సమంత బ్రేకప్…

అయితే ఈ సినిమాని రీమేక్ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టుకు వెళ్లడంతో ఈ సినిమా రీమేక్ చేయకూడదని కోర్టు స్టే విధించింది. ఇక చేసేదేమిలేక డైరెక్టర్ లింగుస్వామి వెనక్కి తగ్గడంతో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని వాణి కపూర్, నాని జంటగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా సమయంలో జబర్దస్త్ సినిమా ఎన్నో వివాదాలను సృష్టించిందని చెప్పవచ్చు.అయితే సిద్ధార్థ వేరొకరితో ప్రేమలో ఉన్నారని తెలియడంతో సమంత అతని నుంచి విడిపోయి నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే నాలుగేళ్ల తరువాత సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన చేయడంతో సిద్ధార్థ్ సమంత గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

Saina Nehwal-Siddharth: యాక్టర్ సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల పంజాబ్ లో ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధాని భద్రత వైఫల్యంపై స్పందిస్తూ… ఆ ఘటనను ఖండించింది సైనా నెహ్వాల్. అయితే ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ..ట్విట్టర్ వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాను కూడా ఆదేశించింది. మహారాష్ట్ర డీజీపీకి కూడా సిద్ధార్థ్ పై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. 

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

ఈ విషయంపై సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్‌ సింగ్‌ ఫైర్‌ అయ్యారు. తన కుమార్తెపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించిన హర్వీర్‌ సింగ్‌.. దేశం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. `నా కూతురుని ఉద్దేశించి సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. అసలు ఆయన దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది. దేశ ప్రతిష్టని పెంచిందని అన్నాడు. 

మేజర్‌ ధ్యాన్‌చంద్‌, ఖేల్ రత్న అవార్డు..

బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా అనేక పథకాలను దేశానికి తెచ్చింది సైనా నెహ్వాల్. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఇండియాకి ఆమె చేసిన సేవలకుగానూ 2009లో కేంద్ర ప్రభుత్వం అర్జున పురస్కారంతో, అలాగే మేజర్‌ ధ్యాన్‌చంద్‌, ఖేల్ రత్న అవార్డుని అందజేసింది. అలాగే 2010లో పద్మ శ్రీ పురస్కారం, 2016లో పద్మ భూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్‌ ప్రస్తుతం బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు.

Siddharth : మరో వివాదంలో హీరో సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను అంత మాట అంటావా అంటూ నెటిజన్ల ఫైర్..!

Siddharth: హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్విట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల ప్రధాని భద్రతా వైఫల్యంపై ప్రముఖ బ్యాట్మిటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ ఓ ట్వీట్ చేశారు. సైనా ఏమని ట్వీట్ చేశారంటే.. ప్రధాని కాన్వాయ్ ని పంజాబ్ లో అడ్డగించడంపై ఆమె ఖండించింది. ప్రధానిపై దాడికి యత్నించడం

పిరికిపంద చర్య అని.. ప్రధానిపైనే ఇలా జరిగితే ఆ దేశంలో భద్రంగా ఉన్నట్లు కాదని.. ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ రీ ట్వీట్ ఇలా అన్నాడు. చిన్న కాక్ తో ఆడే ఓ ఛాంపియన్.. దేవుడి దయ కారణంగా.. మన దేశాన్ని కాపాడే వాళ్లు ఉన్నారు అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాదు.. షేమ్ ఆన్ యూ అంటూ..యాష్ ట్యాగ్ రిహానా అంటూ ముగించాడు.

Siddharth: హీరో సిద్ధార్థ్ పై మహిళా కమిషన్ సీరియస్.. సైనా నెహ్వాల్ ను అంత మాట అంటావా అంటూ నెటిజన్ల ఫైర్..!

ఇది చాలా వ్యంగ్యంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక దీనిపై రిహానా, సైనా నెహ్వాల్, చిన్మయి శ్రీపాద కూడా రీ ట్వీట్ చేశారు. సిద్దార్థ్ చేసిన ట్వీట్ కు చిన్మయి తప్పు పడుతూ ట్వీట్ చేశారు.

Siddharth : అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని..

దేనికైతే తాము పోరాటం చేస్తున్నామో.. ఇంకా తాము మళ్లీ పోరాటం చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఇది అత్యంత దారుణం అంటూ చెప్పారు. ఇక మహిళల పట్ల ఇంత దారుణమైన భాషను మాట్లాడం ఏంటని నెటిజన్లు కూడా మండిపడుతన్నారు. హీరోయిన్లను రక్షించే సిద్ధార్థ్.. బయట మాత్రం మహిళలను హింసించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్‌ను డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సిద్ధార్థ్ ప్రతిస్పదించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వ్యాఖ్యలను మరో విధంగా అన్వయించడం అనైతికమని మరో ట్వీట్ చేశాడు. తన ఉద్దేశ్యం ఎవరినీ అవమాన పర్చాలని కాదన్నారు.

మహా సముద్రం సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న సమంత… కారణం అదేనా?

ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం “మహా సముద్రం”. లవ్ అండ్ త్రిల్లింగ్ ఎమోషన్ జానర్ లో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఇకపోతే ఈ సినిమా గురించి సరికొత్త సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించగా వారి సరసన హీరోయిన్ పాత్రలో అదితిరావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో సమంత చేయాల్సి ఉండేదని సమంత ఈ సినిమాలో నటించక పోవటం వల్ల వేరే హీరోయిన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ ముందుగా సమంత వరకు వెళితే కథ మొత్తం నచ్చిన సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇలా సమంత ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి కారణం బహుశా సిద్ధార్థ్ ఇందులో హీరోగా నటిస్తుండటం ప్రధాన కారణం అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ సమంత కాంబినేషన్ లో ఇదివరకే జాను చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా సమంత మహా సముద్రం సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 వ తేదీ విడుదల కానుంది. గత కొన్ని రోజుల నుంచి ఫ్లాప్ లను చవిచూస్తున్న ఈ హీరో హీరోయిన్లకి మహా సముద్రం సినిమా ద్వారా విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి.

ప్రముఖ ఓటీటీకి ‘మహాసముద్రం’.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నా.

జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్‏ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

మోసం చేసే వారు ఎప్పుడూ బాగుపడరు.. హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్..!

సమంత, నాగచైతన్య విడాకుల విషయంపై నేడు వాళ్లిద్దరు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము ఇక ఎవరిదారి వారు చూసుకుంటామని.. భర్యాభర్తలుగా విడిపోయినా.. తాము స్నేహితులమే అంటూ చెప్పారు. ఇదిలా ఉండగా.. వాళ్ల విడాకుల విషయమై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి.. అటు రాజకీయాలకు సంబంధించి ఏ విషయాలను అయినా సోషల్ మీడియాలో తమ అభిమానులకు పంచుకుంటాడు. ప్రస్తుతం సమంత, చైతూ విడాకుల విషయంపై కూడా పరోక్షంగా ఓ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అందేంటంటే.. తన పాఠశాలలో మొదట నేర్చుకున్న పాఠం ఏంటంటే ‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు’ మీ సంగతేంటి ..? అంటూ ప్రశ్నార్థకం పెట్టాడు.

దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అతడు ఎవరిని గురించి పోస్టు పెట్టాడో చాలామందికి తెలవడం లేదు.. ప్రస్తుతం సమంత విడాకులు తీసుకుంది కావునా.. ఆమె గురించే ఈ పోస్టు పెట్టినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే మొదట్లో సమంత-సిద్దార్థ్ డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఉండేవారు. వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని సిద్దార్థ్ ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.

దీంతో ప్రస్తుత సమయంలో అలాంటి పోస్టు అవసరమా అంటూ తిట్టి పోస్తున్నారు. ఇదిలా ఉండగా..
టాలీవుడ్ లో మొదట అతడు ఎన్నో సినిమాలు చేశాడు. తర్వాత ఎక్కవగా అవకాశాలు రాలేదు. వెంటనే అతడు కోలీవుడ్ బాట పడ్డాడు. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే అతడు ఈ మధ్య ‘గృహం’ అనే సినిమా చేశాడు.. దీనికి మంచి పేరు రావడంతో మళ్లీ.. మళ్లీ తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

ఎక్కడ నుంచి వచ్చారా మీరూ… దరిద్రం అంటూ వయసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్!

ఒకప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండస్ట్రీలో సరైన హిట్ లేక అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమా విషయాలనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్లు పలు వివాదాలకు కారణమయ్యాయి.

ఈ క్రమంలోనే కొందరు సిద్ధార్థను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం అతనికి రక్షణ కల్పించారు. తాజాగా సిద్ధార్థ్ మరో వివాదం ద్వారా వార్తల్లో నిలిచారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్పా చిత్రం నుంచి “ఓ… నారప్ప”అనే పాటను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో లో వెంకటేష్ కి జోడీగా అమ్ము అభిరామి నటించింది. దీంతో వయస్సుని ప్రధానాంశంగా తీసుకుని నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాత్రం ఈ వ్యవహారంలోకి హీరో సిద్ధార్థను లాగాడు. 40 సంవత్సరాలు పైబడిన సిద్ధార్థతో 20 ఏళ్ల హీరోయిన్ నటిస్తే వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. అంటూ ట్వీట్ చేస్తూ ఏకంగా హీరో సిద్ధార్థకు ట్యాగ్ చేశాడు. దీంతో స్పందించిన సిద్ధార్థ్ సదరు నెటిజెన్ కి భారీ కౌంటర్ ఇచ్చారు.”ఈ హీరోల వయసు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?” అంటూ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే మరొకని నెటిజన్ మీరు ప్రకాష్ రాజ్ క్లాస్మేట్స్ అంటగా అంటూ కామెంట్ చేయగా.. దీనిపై స్పందించిన సిద్ధార్థ్ ప్రకాష్ నా దత్తపుత్రుడు… మోహన్ బాబు నా క్లాస్మేట్ ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్త్ పేర్కొన్నాడు.