Tag Archives: soundarya

Rashmika: సౌందర్య బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన రష్మిక!

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ దివంగత సీనియర్ నటి సౌందర్య బయోపిక్ చిత్రం గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఇప్పటికే సౌందర్య బయోపిక్ చిత్రం గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య బయోపిక్ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ అలాంటి ఒక గొప్ప నటి బయోపిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

చిన్నప్పుడు నన్ను చూసి మా డాడీ అచ్చం సౌందర్య లాగే ఉన్నావు అంటూ చెప్పేవారు అలాంటి ఒక గొప్ప నటితో పోల్చడం నిజంగా చాలా గౌరవంగా అనిపించింది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక సౌందర్య కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

గౌరవంగా భావించాను..

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె రాజకీయాలలోకి వెళ్లారు 2004 బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Ramya Krishna: ఆ సీన్ చేసే ముందు ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించాను… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ గారితో కలిసి నరసింహ సినిమాలో నటించాలని ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ కావడం చాలా విశేషమైన తెలిపారు. అయితే ఈ సినిమాలో తాను నీలాంబరి అనే పాత్రలో నటించానని ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ఉన్న పాత్ర అని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నీలాంబరిగా నేను సౌందర్య చెంపపై కాలు పెట్టే సన్నివేశంలో నటించాను. అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను చాలా ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఈమె తెలియజేశారు.

Ramya Krishna: నటించలేకపోయాను…


ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ సౌందర్య పై పగ తీర్చుకోవడం కోసం అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది అయితే ఈ సన్నివేశం విన్న తర్వాత అది నేను చేయలేనని డైరెక్టర్ గారికి చెప్పడంతో ఆయన ఈ సీన్ చాలా అవసరమని చెప్పారు. ఇక డైరెక్టర్ గారు అలా చెప్పేసరికి చేసేది ఏమీ లేక తాను ఈ షాట్ పూర్తి చేశానని తెలిపారు. అయితే ఈ షార్ట్ చేయడానికి ముందు నేను దేవుళ్లను ప్రార్థించి మరి ఈ షార్ట్ చేశానని ఈమె తెలియజేశారు. ఈ సన్నివేశం షూట్ చేయడం పూర్తి అయిన తర్వాత కూడా రెండు మూడు రోజులపాటు తాను ఎంతో కంగారుగా ఆందోళనగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Soundarya: ఇప్పటికి నా కూతురు సౌందర్య కలలోకి వస్తుంది… ఎమోషనల్ కామెంట్స్ చేసిన సౌందర్య తల్లి!

Soundarya: వెండితెర నటిగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సౌందర్య ఒకరు.కేవలం 30 సంవత్సరాల వయసులోనే దాదాపు 100 సినిమాలలో నటించే అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో అతి చిన్న వయసులోనే మరణించారు. ఇప్పటికీ ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావు లేకుండా అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటు.ఇక సౌందర్య మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఈమె జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

తాజాగా సౌందర్య తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కుమార్తె సౌందర్య కుమారుడు అమర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు ప్రమాదంలోసౌందర్య తన సోదరుడు అమర ఇద్దరు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మాట్లాడుతూ తనకు మనసు బాగా లేకపోయినా తాను ఏదైనా బాధగా ఆలోచిస్తూ పడుకున్న ఆరోజు రాత్రి తన పిల్లలు కలలోకి వస్తారని ఈమె తెలియజేశారు.

Soundarya: నీకెందుకు నేనున్నాగా అంటుంది…


ఇలా నా మనసు బాధగా ఉన్నప్పుడు నా పిల్లలు తప్పకుండా కలలోకి వస్తారని ఇక సౌందర్య అయితే మమ్మీ నీకెందుకు నేను ఉన్నాను కదా అంటుంది కానీ ఆ కల మధ్యలోనే ఆగిపోతుంది అలా ఎందుకు ఆగిపోతుందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు. అంటూ ఈమె తన కూతురు కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Soundarya: సౌందర్య చేసిన పొరపాటు ఆమె కుటుంబసభ్యులకు శాపం అయ్యింది..?

Soundarya: అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ప్రేక్షకుల మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం కుటుంబ కథా సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్య హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రఘు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

వివాహం జరిగిన సంవత్సరంలోపే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందింది. సౌందర్యం మృతితో సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య లేని లోటు ఎవ్వరూ పూర్తి చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జీవితంలో సౌందర్య చేసిన ఒక పొరపాటు వల్ల ఆమె కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..

కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి వందల కోట్లు ఆస్తులు కూడా పెట్టిన సౌందర్య వివాహం తర్వాత తన ఆస్తులు అన్నీ కూడా భర్త పేరున రాసింది. వివాహం జరిగిన ఏడాదిలోపే సౌందర్య మరణించటంతో సౌందర్య భర్త రఘు ఆమె తన పేరున రాసిన ఆస్తులను తీసుకొని సౌందర్య కుటుంబ సభ్యులను బయటికి గెంటేసినట్లు తెలుస్తోంది.

Soundarya: భర్త పై నమ్మకమే..

సౌందర్యం మరణించిన తర్వాత రఘు రెండవ వివాహం చేసుకొని సౌందర్య ఆస్తులతో జీవితం ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సౌందర్య తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన ఆస్తులు మొత్తం భర్తకు చెందాలని వీలునామా రాసింది. అయితే సౌందర్యం మరణించగానే రఘు ఆస్తులు మొత్తం తన సొంతం చేసుకొని సౌందర్య తల్లి వదినను బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య చేసిన ఆ ఒక్క పొరపాటు వల్ల ఈరోజు ఆమె కుటుంబ సభ్యులు రోడ్డున పడవలసి వచ్చింది.

Actress Soundarya: నటి సౌందర్యకు కొడుకు ఉన్నారా… వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు?

Actress Soundarya: వెండితెరపై మహానటి సావిత్రి తర్వాత అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇలా ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తన స్నేహితుడు రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికే ఈమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.ఇలా ఈమె రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం ఆయన పేరు మీద రాసేశారు.అయితే సౌందర్య మరణించిన తర్వాత ఆస్తి విషయం గురించి రఘు సౌందర్య తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

ఇక సౌందర్యం మరణించిన తర్వాత కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నటువంటి రఘు అనంతరం రెండవ వివాహం చేసుకొని ప్రస్తుతం ఈయన గోవాలో స్థిరపడ్డారు.అయితే సౌందర్య చనిపోక ముందే ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించారని అయితే ఈ విషయాన్ని సౌందర్య రహస్యంగా దాచిపెట్టారనే వార్త వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈ బాబు బాగోగులు అన్నింటిని కూడా తన తండ్రి రఘు చూసుకుంటున్నారట.


Actress Soundarya: సౌందర్యకు పిల్లలు లేరు


సౌందర్యకు కొడుకు ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ విషయం గురించి సౌందర్య సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. సౌందర్య పెళ్లి తర్వాత రెండు సంవత్సరాల వరకు పిల్లలు వద్దని భావించారట. అయితే సౌందర్య కొడుకు ఉన్నారని వచ్చే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ సౌందర్య సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తూ అసలు విషయం తెలియజేశారు.

Nivetha Pethuraj: ఆ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది… నివేతా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్!

Nivetha Pethuraj: నివేత పేతురాజ్ నటుడు విశ్వక్ తో కలిసి ఈమె పాగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తిరిగి ఈ జంట తాజాగా విడుదలైన దాస్‌ కీ ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి నివేత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావు’ అని అడిగారట. ‘బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్‌’ అని చెప్పారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గ్లామర్ షో చేయాలంటే కాస్త భయం వేసిందని ఈ సినిమా కోసం తాను పూర్తిగా శరీర బరువు తగ్గానని తెలిపారు.

దాస్‌ కీ ధమ్కీ సినిమా కోసం తాను ఎంతో కష్టపడి పూర్తిగా తన స్టైల్ మొత్తం మార్చుకున్నానని తెలిపారు. ఇక ఇందులో పాటలు కొన్ని సన్నివేశాలను అమ్మకు పంపించడంతో తన తల్లి కూడా ఇందులో చాలా అద్భుతంగా నటించానని మెచ్చుకున్నారని వెల్లడించారు. సాధారణంగా హీరోలు సినిమాలను నిర్మిస్తూ ఉంటారు కానీ విశ్వక్ మాత్రం సినిమాకు డైరెక్షన్ చేశారు. తన డైరెక్షన్లో వేరే హీరోతో సినిమా చేయొచ్చు కదా అని తనకు సలహా ఇచ్చానని తెలిపారు.

Nivetha Pethuraj:సౌందర్య బయోపిక్ చిత్రం…

విశ్వక్‌కి గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే పిచ్చి. అప్పుడప్పుడూ కొన్ని కథలు కూడా వినిపించారని ఈమె తెలియజేశారు ఇక తాను బయోపిక్ సినిమాల గురించి మాట్లాడుతూ తనకు ఆస్ట్రానట్ కల్పనా చావ్లా బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ఇక సౌందర్య బయోపిక్ చిత్రంలో కూడా చేయాలని ఉంది కానీ ఆ బయోపిక్ చిత్రంలో నిత్యమీనన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అంటూ ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Tolly wood Actresses: హీరోయిన్లుగా నటిస్తూనే విలన్ పాత్రలో భయపడిన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు వీళ్లే?

Tolly wood Actresses: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మంచి మంచి అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఇలా హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో విలన్ గా ఏకంగా రజనీకాంత్ తో పోటీపడ్డారు. ఇలా నీలాంబరి పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే కనుమరుగయ్యారు నటి సౌందర్య. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సౌందర్య కూడా శ్రీకాంత్ రిచా కలిసి నటించిన నా మనసిస్తారా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.

Tolly wood Actresses: విలన్లుగా భయపెట్టిన నటీమణులు…

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ తో కలిసి విలన్ పాత్ర ద్వారా మెప్పించారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల ద్వారా నటించింది మెప్పించారు. ఇక ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

Actress Amani: సౌందర్య ఎక్స్ పోజింగ్ చేయకపోవడానికి కారణం అదే… ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటి ఆమని?

Actress Amani: నిన్నటి తరం హీరోయిన్లలో సౌందర్య ఆమని రోజా వంటి వారందరూ కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే సౌందర్య కన్నడ నటి అయినప్పటికీ ఈమె అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో తెలుగు సినిమాలలో నటించి విశేషమైన తెలుగు ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.అయితే ఈమె ఎంత తొందరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అంతే తొందరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.

ఇకపోతే నేడు సౌందర్య 50వ జయంతి సందర్భంగా అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే సౌందర్య జయంతి సందర్భంగా ఆమని సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.సౌందర్య సినిమాలలో ఎలాంటి గ్లామర్ పాత్రలకు తావు లేకుండా ఎంతో సాంప్రదాయమైన అమ్మాయిలా కనిపిస్తూ నటించేది.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

సౌందర్యతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఈమె మాత్రం తన పరిధి దాటి ఎప్పుడు నటించలేదు.ఈ క్రమంలోనే నటి ఆమని మాట్లాడుతూ తాను నటించిన పలు సినిమాలలో ఎక్స్పోజింగ్ చేశాను కానీ సౌందర్య మాత్రం అలా నటించలేదు.ఎందుకు అలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలలో నటించవని సౌందర్యను అడిగినప్పుడు తాను ఆసక్తికరమైన సమాధానం చెప్పిందని ఈ సందర్భంగా బయటపెట్టారు.

రేపు నా భర్త నా సినిమాలు చూసి ప్రశ్నించకూడదు…

ప్రస్తుతం తాను ఎక్స్పోజింగ్ చేస్తూ సినిమాలు చేస్తే రేపు నాకు పెళ్లి అయిన తర్వాత నా భర్త ఎందుకు అలాంటి పాత్రలలో నటించావు అని ప్రశ్నించడా? రేపు నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా.. అంటూ సౌందర్య సమాధానం చెప్పిందని ఈ సందర్భంగా ఆమని వెల్లడించారు.ప్రస్తుతం డబ్బు కోసం సినిమాలలో చేస్తే రేపు నా భర్త పిల్లలు కలిసి నా సినిమా చూస్తున్నప్పుడు నేను ఏమాత్రం సిగ్గుతో తలదించుకోకూడదు. ప్రస్తుత నా నటన వల్ల రేపు నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అంటూ సౌందర్య చెప్పారని ఆమని వెల్లడించారు.

Arjun Sarja : చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి అలా మాట్లాడారు.. మిస్ యూ అన్న పదంకి అర్థం ఆమె చనిపోయాకే తెలిసింది..!

Arjun Sarja : యాక్షన్ హీరో అర్జున్ అనగానే అసలు ఇతను ఏ ఇండస్ట్రీ హీరో అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే 90 లలో దాదాపు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో హిట్లు కొట్టి అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జా, మధుగిరి కర్ణాటకలో జన్మించిన ఈయన కెరీర్ మాత్రం తమిళ ఇండస్ట్రీ లో శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ సినిమా హిట్ తో మొదలయింది. 1993 లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. అయితే అప్పటికే తెలుగులో మా పల్లెలో గోపాలుడు సినిమాలో నటించాడు. ఇక తమిళంలో మాధవలన్ తెలుగులో ఒకేఒక్కడు సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. ఇక యాక్షన్ సినిమాలతో ఫ్యాన్స్ ను పెంచుకున్న అర్జున్ యాక్షన్ కింగ్ అయ్యాడు.

చిరంజీవి ఫోన్ చేసి అలా అంటరాని అనుకోలేదు….

రొమాంటిక్ లవ్ డ్రామా సినిమా రిధమ్ సినిమాతో అటు తమిళ్ ఇటు తెలుగులో మళ్ళీ హిట్ కొట్టిన అర్జున్ ఇక తెలుగు సినిమాలలో కూడా సక్సెస్ అయ్యాడు. శ్రీ మంజునాథ, జగపతి బాబు తో కలిసి హనుమాన్ జంక్షన్, స్వాగతం, పుట్టింటికి రా చెల్లి శ్రీ ఆంజనేయం, లై, ఇక లేటెస్ట్ గా ఖిలాడి వంటి సినిమాల్లో నటించారు. అటు సినిమాల్లో హీరోగా చేస్తూనే విలన్ గాను అలరించాడు. ఇక ఇపుడు విలన్ గాను మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు. శ్రీ మంజునాథ సినిమా విడుదల తరువాత సినిమాలో లాస్ట్ సీన్ చూసి చిరంజీవి ఫోన్ చేసి చాలా బాగా చేసావ్ అని చెప్పడం మర్చిపోలేనని ఆయన అలా ఫోన్ చేస్తారని అనుకోలేదని చెప్పాడు.

మిస్ యూ అన్న పదంకి అర్థం తాను పోయాక తెలిసింది, ఇప్పటికి ఆమెను మిస్ అవుతున్నా….

ఇక ఇండస్ట్రీ లో జగపతి బాబు, నేను, సౌందర్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళమని అర్జున్ చెప్పారు. సౌందర్య చాలా మంచి అమ్మాయి. తాను చాలా పద్దతిగా, కల్చర్డ్ గా ఉండేదని చెప్పారు. ఆమె లేని లోటు ఇప్పటికి ఉందని. ఎప్పుడైనా ఏదైనా విషయం ఫ్రెండ్ తో షేర్ చేయాలన్నపుడు సౌందర్య కి మెసేజ్ చేద్దామా అని ఇప్పటికి టక్కున గుర్తొస్తుందని, మిస్ యూ అన్న పదాలకు అర్థం ఆమె మరణించాకే తెలిసిందని చెప్పాడు.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

soundarya: అలనాటి అందాలతార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య అదే పాపులారిటీతో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

ఈమె మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా ఉండిపోయారు.ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్ నాథ్ కూడా మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వీరిద్దరూ మరణించడంతో వీరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్తిపాస్తుల కోసం పెద్ద ఎత్తున గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.

soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?

ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మంజుల భర్త రఘు ఒక వైపు ఉండగా.. సౌందర్య సోదరుడు అమర్ భార్య మరోవైపు ఆస్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి 2 ఇండ్లు ఉండగా ఒకటి సౌందర్య, ఆమె సోదరుడు పేరు పై రాసి ఉండగా, మరొకటి అమర్ నాథ్ కుమారుడు సాత్విక్ పేరు పై ఉన్నట్లు సమాచారం.ఇకపోతే వీటితో పాటు హైదరాబాద్లో కొన్ని విలువైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.

కోర్టు మెట్లెక్కిన కుటుంబం..

ఈ ఆస్తి కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ భార్య తన కొడుకు ఆస్తిపాస్తులు సౌందర్య తల్లికి, భర్తకు దక్కకుండా కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు పలు ప్రశ్నలు వేయగ సౌందర్య తల్లి, భర్త దగ్గర సరైన సమాధానాలు లేకపోగా ఆస్తి మొత్తం సౌందర్య మేనల్లుడు సాత్విక్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.