Tag Archives: tweeted

Suriya:మీరు ఎప్పుడు బెస్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ట్వీట్ చేసిన సూర్య… ఏమైందంటే?

Suriya: సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తమిళ హీరో అయినప్పటికీ ఈయనకు మాత్రం తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సూర్య నటించే ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదలవుతాయి. ఇక్కడ కూడా అదే స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలా ఒక కోలీవుడ్ నటుడికి ఈ స్థాయిలో ఆదరణ ఉండటం ఎంతో విశేషం.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాని తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులు చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూర్య సిమ్రాన్ సమీరా రెడ్డి ప్రధాన పాత్రలలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్నటువంటి ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేయడం చూసి సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Suriya: మీ ప్రేమ నన్ను ఆశ్చర్యపరిచింది..


థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈ ప్రేమ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని ఎంజాయ్ చేయడంలో మీరు బెస్ట్ అని ట్వీట్ చేశారు.ఇలా తెలుగు అభిమానులను ఉద్దేశించి సూర్య చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో ఊర్వశి ఓటు ఎవరికో తెలుసా?

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నటువంటి పేరు. ముంబై కి చెందినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాలో ఈమె మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ సాంగులో నటించినటువంటి ఈమె ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా పవన్ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమె పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈమె గతంలో కూడా కొంతమంది హీరోలను సీఎం అంటూ సంబోధించడం గమనార్హం.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ కే నా ఓటు…


ఈ క్రమంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు వేశారు ఒకవేళ మీరు కనుక ఓటు వేయాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అంటూ ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని లాభం పొందను… వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్!

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసిన తన అభిమాన నటుడు తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు.

Ba

ఈశ్వర పవనేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ ను దైవ సమానంగా భావించే బండ్ల గణేష్ గురు పౌర్ణమి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారికి శుభాకాంక్షలు అని తెలియజేశారు.

Bandla Ganeshమీ ఆశయం నెరవేరాలి..


మీరు ఎల్లప్పుడూ మీ కృషితో అనుకున్న స్థాయిని చేరుకోవాలి మీ స్థానం స్థాయి తెలిసినవాడిగా చెబుతున్నాను. నా సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను కానీ మీ పేరును వాడుకొని నేను లాభం పొందను.నా ఆశయం ఒక్కటే మీరు మీ మంచి మనసులాగా మీరు అనుకున్నది నెరవేరాలని పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ పై ఎంతటి అభిమానం ఉందో అర్థమవుతుంది.

Mahesh Babu: ఈరోజు ఎంతో ప్రత్యేకం… ఇది మీకోసమే నాన్న.. వైరల్ అవుతున్న మహేష్ ట్వీట్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ గారి 81 వ జయంతి వేడుకలు నేడు జరగనున్నాయి. నేడు కృష్ణ గారి జయంతి కావడంతో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి జయంతిని పురస్కరించుకొని చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇలా మహేష్ బాబుట్విటర్ వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయబోతున్న సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ షేర్ చేశారు. ఇందులో మహేష్ బాబు తలకు ఎరుపు రంగు రిబ్బన్ కట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఇదంతా మీకోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు.

ఇలా మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్ ఈరోజు సాయంత్రం థియేటర్లో 6:03నిమిషాలకు విడుదల చేయనున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu: గుంటూరు కారం…


సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్స్ పెట్టాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక నేడు కృష్ణ గారి జయంతి కావడంతో ఆయన నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాని కూడా విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Shriya: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకుందా.. జర్నలిస్ట్ ని ప్రశ్నించిన శ్రియా శరన్..?

Shriya: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అలనాటి అందాల ముద్దుగుమ్మ శ్రియ శరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇక ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రియ గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తోంది. పెళ్లై ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా శ్రియ అందం తగ్గలేదు. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో ” పెళ్లయి కూతురు పుట్టిన తర్వాత కూడా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అని శ్రియ ని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ‘ పెళ్లి తర్వాత కూడా నేను అలాగే అందంగా ఉన్నానని నా స్నేహితులు మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ అందం మాత్రమే కాదు ..నా వయసు ఎంత ? నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుండి ఉన్నాను? అనేది కూడా ముఖ్యమే. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకుందా ?

Shriya: అప్పుడే సమాధానం చెబుతా…


ఇండస్ట్రీలో హీరోలను మీరు ఈ ప్రశ్న అడిగిన రోజున నేను దీనికి సమాధానం చెబుతాను ” అంటూ శ్రియ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియోని తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో హీరోల గ్లామర్ గురించి శ్రియ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రియ భోలా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్ లో చేయబోతున్నారు.

Allu Arjun: మా హీరోతోనే ఆటలా… నటి భాను శ్రీ వ్యవహారంపై మండిపడుతున్న బన్నీ ఫ్యాన్స్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా ఈయన హీరోగా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

ఇలా సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ గురించి నటి భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఈమె అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు.

ఇలా అవకాశాలు లేకపోవడంతో క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇలా ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చేసిన రెండు గంటలకి ఈమె మరొక పోస్ట్ చేశారు.


Allu Arjun: బన్నీ పై ఆరోపణలు చేయలేదు…

గ్రేట్ న్యూస్ బన్నీ తనని ట్విటర్ లో అన్ బ్లాక్ చేశారంటూ మరొక ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ చేసినటువంటి ఈమె తన కెరియర్ ఇలా ఉండటానికి అల్లు అర్జున్ ఏమాత్రం బాధ్యుడు కాదని తను అల్లు అర్జున్ గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు అంటూ తెలిపారు. అయితే ఈమె చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ గా మారడంతో అల్లు అర్జున్
అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అసలు మా హీరోతో ఇలాంటి ఆటలు ఆడుకోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఈమెపై మండిపడుతున్నారు.

Poonam Kaur: ప్రీతి చనిపోయినట్టుగా ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Poonam Kaur: సాధారణంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలతో పాటు సినీ వ్యక్తిగత విషయాల గురించి స్పందిస్తూ ఉంటారు. ఇలా తమ వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ట్రోల్ అవుతూ ఉంటారు.ఇది సెలబ్రిటీలకు సర్వసాధారణం అయితే సమాజంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ విషయంపై కూడా కొందరు స్పందిస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి ఘటనలపై స్పందించే సమయంలో సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆ విషయం గురించి తెలుసుకొని ఆచితూచి మాట్లాడటం ఎంతో అవసరం అలా కాకుండా ఏదైనా చిన్న పొరపాట్లు కనక జరిగితే పెద్ద ఎత్తున నేటిజన్లో ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇలా నేటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు నటి పూనమ్ కౌర్.

హైదరాబాదులో డాక్టర్ ప్రీతి సంఘటన ప్రస్తుత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ ఘటనపై పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది అయితే ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Poonam Kaur: ప్రీతి చనిపోయిందంటూ ట్వీట్ చేసిన పూనమ్…

ఇలా ప్రీతి విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనుగడ , పరువు, న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది.. వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది.. మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు.. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు, లేదా న్యాయం పొందదు’’.. అని రాసుకొచ్చింది.. దీంతో, ఈ ట్వీట్ చదవిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ తన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పిన మాట వాస్తవమే కానీ తాను చనిపోయినట్లు ట్రీట్ చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ మండిపడుతున్నారు.

Bandla Ganesh: భార్య గురించి ట్వీట్ చేసి వెంటనే తొలగించిన బండ్ల గణేష్… అసలేమైందబ్బా?

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు.ఒకప్పుడు సినిమాలలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఇలా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు.

ఇలా బండ్ల గణేష్ ప్రతి ఒక్క విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి ఈయన పెద్ద భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఒక చిన్నమాట అన్న టక్కున ఆ విషయంపై స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతారు.

ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకచోట కలిసినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఫోటో గురించి పెద్ద ఎత్తున కథనాలు వెళ్లబడ్డాయి.పవన్ కళ్యాణ్ త్వరలోనే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రాబోతున్నారు అంటూ కొన్ని వెబ్సైట్స్ కథనాలు రాయగా, మరికొన్ని మాత్రం బాలకృష్ణ పవన్ సినిమా షూటింగ్స్ పక్కపక్కనే జరగడంతో ఇద్దరు కలిసారనీ చెప్పుకొచ్చారు.

ఇకపోతే త్వరలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తన మూడు పెళ్లిళ్లు తన భార్యల గురించి ప్రస్తావనకు తీసుకురావద్దని బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినట్టు ఓ వెబ్ సైట్ లో వార్తలు రాశారు.

Bandla Ganesh: భార్యల గురించి ప్రస్తావనకు తీసుకురావద్దు…


ఈ క్రమంలోనే ఈ వార్తపై బండ్ల గణేష్ స్పందిస్తూ… మీ భార్య గురించి వాళ్ళు ఎందుకు ప్రస్తావనకు తీసుకు వస్తారు. వెంకీ నువ్వు అన్నా చెప్పు లేదా దేవీ ప్రియ..! అంటూ క్వశ్చన్ చేశారు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఈ విధమైనటువంటి ట్వీట్ చేసిన కొంత సమయానికే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో అసలు బండ్ల గణేష్ ఎందుకు ట్వీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికల సమయంలో ఈయన చేసిన హంగామా అందరికీ గుర్తుంది. విష్ణు గెలుపుకు తానే సూత్రధారి అంటూ వ్యవహరించారు. మా ఎన్నికల సమయంలో రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అలాగే తన మూడవ భార్య తన పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన విషయం గురించి కూడా నరేష్ వార్తల్లో నిలిచారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఇక తన భార్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని నరేష్ తేల్చిచెప్పారు.కావాలంటే ఈ కేసు విషయంలో తన సపోర్ట్ పూర్తిగా పోలీసులకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇలా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఉండే నరేష్ ఈ మధ్య నెటిజన్ల ట్రోలింగ్ గురవుతున్నారు. తాజాగా నరేష్ మరోసారి ట్వీట్ చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఈ క్రమంలోనే తాజాగా ఏదో పని నిమిత్తం నరేష్ తిరుపతి వెళ్లినట్టు ఉన్నారు.అయితే తిరుపతి వెళ్లిన సందర్భంగా నరేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తిరుపతిలో ఒక గంట నుంచి నాకెంతో ఇష్టమైన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. వాటి కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఈయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు అలాగే తయారయ్యావు..


ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు గంటలో ఏం తిరిగావ్..అంటూ ట్వీట్ చేయగా మరికొందరు తిరుపతి వెళ్లిన నీకు మీ బ్రాండెడ్ షూస్ పని ఏంటి అని ప్రశ్నించారు. మరికొందరైతే దారుణంగా ఆ డబ్బా బ్యాచ్ మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావ్ అంటూ తీవ్రస్థాయిలో నరేష్ పై ఫైర్ అవుతున్నారు.

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

NTR: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. చాపకింద నీరులా పాకిపోతున్న ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది కోలుకున్న విషయం మనకు తెలిసిందే.

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

ఇక చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తెలియ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

త్వరగా కోలుకుని తిరిగి రావాలి..

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తొందరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా లోకేష్ కూడా త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.గతంలో ఎన్టీఆర్ కరోనా బారిన పడినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక నేడు చంద్రబాబు కరోనా బారిన పడటంతో ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.