Tag Archives: Vennela Kishore

Vennela Kishore: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా 2 వేల నోట్ల కట్టలు… అసలు విషయం బయట పెట్టిన మంచు విష్ణు..?

Vennela Kishore: ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. . దీంతో ప్రజలు వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు.రూ.2 వేల నోట్ల రద్దు పై భారత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతు న్నాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్టార్‌ కమెడియన్‌ వెన్నెల కిషోర్ గురించి సినీ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు కుప్పలుగా ఉన్న 2 వేల రూపాయల నోట్ల ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ..” వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది ఫొటో తీసుకొన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అనే అనుమానం కలుగుతుంది’ అని రాసుకొచ్చాడు.

మంచు విష్ణు చేసిన ఫోటోపై… నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇన్ కం ట్యాక్స్ వాళ్లను పిలవాల్సిందే’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మా ఎలక్షన్స్ కి ఫండ్ ఇస్తాడు అని మరికొందరు, ఇలా వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు ట్వీట్‌పై వెన్నెల కిషోర్ కూడా స్పందించాడు. ‘ నా మీద పడతారేంటి ‘ అని రిప్లై ఇచ్చాడు.

Vennela Kishore: నా మీద పడతారేంటి….


మంచు కుటుంబ సభ్యుల తో వెన్నెల కిషోర్ కి మంచి అనుబంధం ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ తో వెన్నెల కిశోర్ చాలా చనువుగా ఉంటాడు. ఈ క్రమంలో వెన్నెల కిషోర్‌ను ఆట పట్టించడానికే మంచు విష్ణు ఇలా ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Dirrctor Maruthi: ప్రేమ విషయం తెలియకుండా జాగ్రత్త పడిన డైరీ వల్ల దొరికిపోయాం… డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్!

Dirrctor Maruthi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ మారుతి గురించి పరిచయం అవసరం లేదు. రచయితగా నిర్మాతగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మారుతి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా తన భార్య స్పందనతో కలిసి వెన్నెల కిషోర్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వీరి ప్రేమ పెళ్లి గురించి మారుతీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ ఇద్దరిలో ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అంటూ ప్రశ్నించడంతో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రపోజ్ చేయడానికి ఏమీ లేవు తనంటే నాకు ఇష్టం అని మాత్రమే చెప్పానని మారుతి తెలిపారు.తనకి చెప్పిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారని మారుతి తెలిపారు.

ఇలా మేం ప్రేమించుకోవడం రహస్యంగా పెద్దవాళ్లకు తెలియకుండా కలుసుకోవడం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పడ్డాము.పెద్ద వాళ్లకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్పందన రాసిన డైరీ కారణంగా దొరికిపోయామని తెలిపారు. స్పందనకు ఒక రోజు మొత్తంలో ఏ చిన్న సంఘటన జరిగిన అది డైరీలో రాసే అలవాటు ఉంది.

Dirrctor Maruthi: డైరీ మా పెళ్లి చేసింది..


ఈ క్రమంలోనే తనని ఇంట్లో వారికి తెలియకుండా ఎన్నిసార్లు ఎక్కడ కలిసింది ఏ సమయంలో కలుస్తుంది అనే విషయాలను కూడా చాలా క్లుప్తంగా రాసి పెట్టింది. అయితే ఆ డైరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి తన తల్లి నాకు ఫోన్ చేశారని మారుతి తెలిపారు.ఇలా ప్రేమ విషయం బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికి డైరీ వల్ల బయటపడ్డామని దాంతో మా పెళ్లి కూడా జరిగిందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Director Maruthi: భార్యను కలుసుకోవడానికి ఎన్నో వెధవ వేషాలు వేసాను… డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్!

Director Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందిన మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మారుతి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మారుతీ దర్శకత్వం వహించిన ఆ సినిమా యువతను బాగా ఆకట్టుకొని వంద రోజులు పూర్తి చేసుకుంది.

ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథా చిత్రం, బాబు బంగారం, భలే భలే మగాడివోయ్ వంటి సుపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరక్టర్ గా గుర్తింపు పొందాడు.
అంతే కాకుండా కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా తాజాగా మారుతి తన భార్య స్పందనతో కలిసి మొదటిసారిగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో వారి లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో మారుతి భార్య స్పందన మాట్లాడుతూ..

“తాను, మారుతి చిన్నపుడు ఒకే స్కూల్ లో చదువుకున్నాను. తాను నాకు సీనియర్. అతను 8 వ తరగతిలో ఉన్నప్పుడు మా మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత 10 పూర్తైన తర్వాత మారుతి స్కూల్ నుండి వెళ్ళిపోయినా కూడా మా ప్రేమ అలాగే కొనసాగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో వారికి అనుమానం రాకుండా దొంగ చాటుగా కలుడుకునేవాళ్ళం. మారుతీ నన్ను కలవటానికి ఆర్టీసి బస్సు లో వస్తే నేను నా స్కూటీ లో వెల్లేదాన్ని.

Director Maruthi: స్కూటీలో చక్కర్లు కొట్టేవాళ్ళం…

ఆ తరువాత ఇద్దరం కలిసి నా స్కూటీ మీద షికార్లు చేసేవాళ్ళం అంటూ స్పందన చెప్పుకొచ్చింది. ఇక మారుతి కూడా తమ ప్రేమ గురించి మాట్లాడుతూ స్పందనని కలుసుకోవడం కోసం తాను ఎన్నో వెధవ వేషాలు వేసే వారిని అయితే ఆవేశాలన్నీ కూడా తను డైరీలో రాసి పెట్టిందంటూ ఈ సందర్భంగా తమ ప్రేమ గురించి స్పందన మారుతి ఇద్దరు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mohan Babu: మామయ్య అన్నం తినిపించేవారు… అత్తయ్య అలా చూసుకున్నారు: మౌనిక

Mohan Babu: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. మనోజ్,మౌనిక రెడ్డి వివాహాన్ని లక్ష్మీ ప్రసన్న తన నివాసంలో దగ్గరుండి అన్ని తానై ఘనంగా జరిపించింది. ఇక వివాహం జరిగిన తరువాత మొదటిసారిగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి కలిసి టీవి షోలో పాల్గొన్నారు.

వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ షో లో మౌనిక రెడ్డి తన మామ మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ షో లో మౌనిక రెడ్డి మాట్లాడుతూ…” మామయ్య చాలా సరదాగా ఉంటారు. మనోజ్ ని వివాహం చేసుకోక ముందు నుండి మామయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు.

పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లిన సమయంలో మామయ్య నాకు అన్నం తినిపించారని మౌనిక తెలిపింది. నా కొడుకును, నన్ను మోహన్ బాబు కుటుంబ సభ్యులు సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారని భూమా మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఇక తన అత్త గారి గురించి మాట్లాడుతూ ..’ అత్తయ్య ఫోన్ చేసి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని, అమ్మ చనిపోయిన సమయంలో అత్తయ్య నాకు చాలా దైర్యం చెప్పారు.

Mohan Babu:మంచు కుటుంబంలోకి కోడలుగా రావడం నా అదృష్టం…

ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా రావడం దేవుడిచ్చిన వరం అని మౌనిక రెడ్డి తెలిపింది. అలాగే మంచు లక్ష్మితో కూడా తనకు ఒక అందమైన అనుబంధం ఉందని మంచు లక్ష్మి నన్ను చిన్నపిల్లలా చూస్తుందని ,తానే దగ్గరుండి మనోజ్ తో నా పెళ్లి జరిపించింది అంటూ అత్త ,మామ, ఆడపడచు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Vennela Kishore: ఆ నా కొడుకు అంటూ వెన్నెల కిషోర్ ను అన్న శర్వానంద్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వెన్నెల కిషోర్!

Vennela Kishore: శర్వానంద్ పరిచయం అవసరం లేని పేరు. శతమానం భవతి సినిమా తర్వాత ఈయనకు ఇప్పటివరకు ఈయనకు సరైన హిట్టు పడలేదని చెప్పాలి.శతమానం భవతి సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించిన అన్ని సినిమాలు శర్వానంద్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇకపోతే ఓకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి హిట్ కావడంతో శర్వానంద్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మదర్ సెంటిమెంట్ కూడా తోడవడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శర్వానంద్ వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.వెన్నెల కిషోర్ ని ఉద్దేశిస్తూ ఆ నా కొడుకుకు సినిమా అవకాశం ఇప్పిస్తే ఈవెంట్ కి రాలేదు అంటూ అనడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

ఇదేంటి శర్వానంద్ అలా అనేసారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పాలి. ఆ రిలేషన్ కారణంగానే సరదాగా శర్వానంద్ వెన్నెల కిషోర్ ను ఆట పట్టించారు.ఇక ఇదే అదనుగా భావించి పలు యూట్యూబ్ ఛానల్స్ దీనినే థంబ్ నెయిల్ గా పెట్టి తెగ వైరల్ చేశారు.

Vennela Kishore: శర్వానంద్ పై పంచ్ వేసిన వెన్నెల కిషోర్…

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి వెన్నెల కిషోర్ శర్వానంద్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఆరోజు నన్ను ఈ నా కొడుకు రాలేదని అన్నావు ఇప్పుడు ప్రియదర్శగాడు ఎక్కడ అంటూ ఫన్నీ చేశారు.మొత్తానికి వీరిమధ్య సాగిన ఈ సరదా సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పార్వతీ మెల్టన్ సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా..?

హీరోయిన్ పార్వతీ మెల్టన్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే సినిమా ‘జల్సా’. ఆమె అందులో సెకండ్ హీరోయిన్ గా నటించారు. అందులో ఆమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఆ సినిమా నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు. ఆమె అనేక తెలుగు మరియు మలయాళ సినిమాలలో కనిపించింది .

మొదట ఆమె తెలుగులో నటించిన సినిమా ‘వెన్నెల’. రాజాతో వెన్నెల చిత్రంలో నటించింది. దీనిలో కిషోర్ ఎక్కువగా ప్రాచూర్యం పొందాడు. అప్పటి నుంచి అతడికి ‘వెన్నెల కిషోర్ ’ అనే పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం హల్లోలో మోహన్ లాల్ తో నటించింది.

ఆమె మళ్లీ తెలుగులో మహేష్ బాబు సరసన దూకుడు అనే ఐటమ్ సాంగ్ ” పూవై పూవై ” లో సాంగ్ లో కనిపిస్తుంది. ఆమె 2013 లో శంసు లాలానిని వివాహం చేసుకుంది, తరువాత సినిమాల నుండి రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమెను ఇద్దరు తెలుగు దర్శకులు మోసం చేయడంతో తన కెరీర్ నాశనం అయిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వాళ్ల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో అమెరికాలో తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక 2012 సంవత్సరంలో తెలుగులో ‘యమమో యమ’ చిత్రంలో చివరి సినిమాలో నటించారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇలా ఆమె దర్శకుల పేర్లు చెప్పకపోవడంతో వివిధ రకాలుగా ఊహించుకుంటున్నారు నెటిజన్లు.

నిన్ను బాగా మిస్ అవుతున్నా.. నీ కోసం ప్రార్థిస్తూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమంత సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతుంటారు. సమంతకు ఇండస్ట్రీలో కేవలం అతి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. వీటిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 19)వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో వెన్నెల కిషోర్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఇతర సెలబ్రిటీలు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ పుట్టినరోజు సందర్భంగా సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం సమంత చెన్నైలో ఉండగా.. నిన్ననే ఈమె తిరుపతి, శ్రీకాళహస్తి దైవ దర్శనాలు చేసుకుని తిరిగి చెన్నై వెళ్లారు. నేడు వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. హ్యాపీ బర్త్డే వెన్నెల కిషోర్.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి..నువ్వు నీ పక్కవారిని ఎలా అయితే నవ్విస్తావో ఆ దేవుడు కూడా నిన్ను అలా నవ్వించే వారి మధ్యలో ఉంచాలని ప్రార్థిస్తున్నాను అంటూ అంటూ వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో సమంత విషెస్ కు స్పందిస్తూ వెన్నెల కిషోర్ తిరిగి రిప్లై ఇచ్చాడు.

నీ శుభాకాంక్షలు ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకంగా మారాయి నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను అంటూ వెన్నెల కిషోర్ హగ్స్ ఎమోజీలను షేర్ చేశారు. మొత్తానికి సమంత ఇలా తన స్నేహితుడి కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ అతనికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ టాప్ కమెడియన్ ఒకరోజు పారితోషికం ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్స్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు కామెడీ ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అందుకే సినిమాలలో కమెడియన్స్ కదా అంటూ మనం వారిని ఏమాత్రం చులకన చేయకూడదు. ఎందుకంటే కమెడియన్స్ సంవత్సరం పొడవునా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంటారు. కానీ హీరో హీరోయిన్లు ఏడాదికి ఒక్క సినిమా తీసిన వారు సంపాదించిన దానికి రెట్టింపుగా వీరు కూడా సంపాదిస్తారని చెప్పవచ్చు.

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటే రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏ కమెడియన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయానికి వస్తే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెన్నెలకిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక రోజు సెట్లోకి అడుగు పెడితే 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రోజుకు 3 లక్షలు తీసుకోగా, అలీ 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

కమెడియన్ సప్తగిరి కామెడీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా మొత్తం ఎంతో హాస్యాస్పద భరితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరి ఒక రోజు సప్తగిరి సెట్ లో అడుగు పెడితే 2లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారట. పోసాని 2.5 ఐదు లక్షలు తీసుకోగా, రాహుల్ రామకృష్ణ 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ రోజుకు 2 లక్షల పారితోషికం తీసుకోగా, కమెడియన్ ప్రియదర్శి రోజుకు 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతేకమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రతి రోజుకు 2 లక్షల వరకు చార్జి చేస్తుంటారని సమాచారం.