Tag Archives: women

Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.

40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.

18 నెలల గ్యాప్ అవసరం…


మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.

ఆస్తికోసం మోసానికి పాల్పడిన యువతి…

ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

Crime News: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొంతమంది కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఎన్ని శిక్షలు విధించిన మారడం లేదు. అమ్మాయి అని తెలిస్తే చాలు.. వయస్సుతో సంబంధం లేకుండా.. అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

వాయి వరుసలు మరిచి.. బంధువులు అని కూడా చూడకుండా.. కూతురు వరుస అయ్యే వాళ్లతో కూడా పాడు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నారు ప్రబుద్ధులు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

ప్రేమ పేరుతో మోసం చేసి ఆత్యాచారానికి పాల్పడిన ఘటనలు కూడా కొకొల్లలు జరిగాయి.ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో రాకేశ్ అనే అతడు సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ అమ్మాయి మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా పరిచయం అయింది.

వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా..


ఆ రోజునుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెను ఓ రోజు ఆసుపత్రికి రమ్మని పిలిచాడు. అక్కడ నుంచి అతడు ఆమెను తన క్వార్టర్స్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మాటల్లో పెట్టి.. మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయింది. భయపడిపోయిన ఆమెను రాకేశ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చసిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించారు. దీంతో రాకేశ్ అక్కడ నుంచి పారిపోయాడు. వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా.. ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అతడు పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లిన పోలీసులకు అతడు పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకున్నారు.

Crime News: బ్రేక్ వేసి కాపాడినందుకు డ్రైవర్ ను కొట్టిన మహిళ అరెస్ట్ …. వీడియో వైరల్!

Crime News: తప్పు ఎవరు చేసినా తప్పే.. దానిని ఒప్పుగా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. కానీ నిజం నిప్పులాంటిది.. తప్పు ఎప్పటికీ ఒప్పు కాలేదు అనే సామెతలు ఉన్నాయి కాదా.. అలానే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో తప్పు తమదని తెలిసి కూడా.. ఎదుటి వ్యక్తిపై బనాయించేందుకు ప్రయత్నించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Crime News: బ్రేక్ వేసి కాపాడినందుకు డ్రైవర్ ను కొట్టిన మహిళ అరెస్ట్ …. వీడియో వైరల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నడి రోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ పై ఓ మహిళ దాడి చేసింది. ఏ మాత్రం మానవత్వం లేకుండా.. అతడి పొట్టపై కాలితో తన్నింది. తప్పు ఆమె చేసి.. పెద్ద గొంతేసుకొని డ్రైవర్ ను అనరాని మాటలు అంటూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా చేసింది.

Crime News: బ్రేక్ వేసి కాపాడినందుకు డ్రైవర్ ను కొట్టిన మహిళ అరెస్ట్ …. వీడియో వైరల్!

తోటి ప్రయాణికులు అడ్డుకున్నా.. ఏ మాత్రం ఆలోచించలేదు. నీది తప్పు అమ్మా.. అని ఎవరైనా అంటే.. నీకు అవసరం లేదు అంటూ సమాధానం చెబుతూ.. కోపంతో ఊగిపోయింది.
ప్రస్తుతం బస్సు డ్రైవర్ పై ఆమె చేసిన దాడికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

మహిళ రాంగ్ రూట్లో వెళ్లి.. బస్సు డ్రైవర్ దే తప్పు అన్నట్లు సీన్ క్రియేట్ చేయగా.. పోలీసులు మాత్రం ఆమెదే తప్పు అని నిర్ధారించారు. పోలీసులకు అతడు ఫిర్యాదు చేయడగా.. ఆమెను అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించి కోర్టు. అన్యాయంగా డ్రైవర్ పై దాడి చేసిన ఆమెకు సరైన శిక్ష విధించారు అంటూ నెటిజన్లు పోలీసులను మెచ్చుకుంటున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే దానిని మరో సారి రుజువైందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

Love Effect: ప్రేమ వ్యవహారం ఓ యువతి మరణానికి కారణమైందా…? అయితే ప్రియుడే హత్య చేశాడా లేకపోతే..? అమ్మాయే ఆత్మహత్యకు పాల్పడిందా.. ? ఇలా ఓ యువతి మరణం పలు ప్రశ్నలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సంధిగూడ గ్రామంలోని మండంగి సంధ్య( 25) అనుమానాస్పదంగా మృతిచెందింది.

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

అసలు ఏం జరిగిందో తెలియదు కానీ.. మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా..? ఆత్మహత్యా..? అని తేల్చేపనిలో ఉన్నారు.

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

ఈ సంఘటనపై ఎల్విన్ పేట సీఐ టీవీ తిరుపతి రావు, ఎస్సై షన్ముఖ రావు బుధవారం విలేఖరులకు సంధ్య మృతిపై వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంల గోహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడకు చెందిన ఆరిక లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. 


పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో ..

ఈపరిచయం ప్రేమగా మారింది.  ఈ క్రమంలోనే సంధ్య నాలుగు సార్లు లక్ష్మణ్  ఇంటికి వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఓసారి సంధ్య లక్ష్మణ్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సంధ్య, లక్ష్మణ్ కు చెందిన స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్లింది. అయితే ఇటీవల పలు పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో లక్ష్మణ్ తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. అయితే సంధ్య లక్ష్మణ్ కోరికను నిరాకరించింది. ఈ నేపథ్యంలో గోహిది సర్పంచ్ కి లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్.. సంధ్యతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించాడు.  ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడకు వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సంధిగూడకు 400 మీటర్ల దూరంలోని చింతచెట్టుకు మృతిచెంది వేలాడుతూ కనిపించింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం పార్వతీపురం ఏరియాసుపత్రికి తరలించి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మరణానికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

Womens: ఇతర మతాలతో పోలిస్తే సంప్రాదాయ పరంగా హిందువుల సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పూర్వకాలం నుంచి వచ్చే ఆచార వ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటికి ఎంతో కొంత సైంటిఫిక్ కారణాలు కూడా ఉంటాయి. 

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

భూమిపై పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా ఈ ఆచారాలు పాటిస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు కూడా వీటిని మరింత ఎక్కువగా పాటించడం మనం చూస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ వెళ్లాలని ప్రార్థిస్తూ దహన సంస్కారాలు చేస్తుంటాం.

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

అలాగే దింపుడుకళ్లెం వంటి ఆచారాలను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత పూడ్చడమో.. లేక కాల్చడమో చేస్తుంటారు. ఇదిలా ఉంటే హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలను శ్మశాన వాటికకు రాకుండా.. దహన సంస్కారాల్లో పాల్గొనరు. అయితే అసలు ఈ కార్యక్రమాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తుంటారు..

పురుషులతో పోలిస్తే మహిళలు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగాలతో మెంటల్ గా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో మహిళలను దహన సంస్కారాలకు దూరంగా ఉంచుతారు. పూర్వకాలం నుంచి ఎవరి ఇంట్లో అయిన ఓ మనిషి చనిపోతే.. ఆ ఇంట్లో పిల్లల్ని, ముసలి వారిని  చూసుకుంటూ.. ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో శ్మశాన వాటికలకు వెళ్లేవారు కాదు. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చేవారికి భోజనం చేసేవారు. ఇదిలా ఉంటే శ్మశాన వాటికలల్లో దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతుంటారు. దీంతో మహిళలకు పెద్ద జుట్టు ఉండటంతో ఆవహించే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. ఆలాగే గర్భం దాల్చిన మహిళలు శ్మశాన వాటికలు వెళ్లడం నిషేధంగా ఉంది హిందూ సంప్రదాయంలో.

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

Crime: తెలిసీతెలియని వయసు.. నిజానికి, అబద్దానికి తేడా తెలియకపోవడం… కేవలం అట్రక్షన్ నే ప్రేమగా భావిస్తుండటంతో అనేక మంది అమ్మాయిల జీవితాలు దుర్మార్గుల చేతుల్లో నలిగిపోతున్నాయి. శారీరకంగాా అనుభవించి మోహం చాటేస్తున్నారు.

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

కొంత మంది తమకు అడ్డుగా ఉంటుందని అడ్డు తొలగించేసుకుంటున్నారు. ఫలితంగా తమ బంగారు జీవితాన్ని అమ్మాయిలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటను ఎన్నో జరుగుతున్నా.. దుర్మార్గుల చేతితో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. 

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సంతమాగులూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ… మోసం చేశాడు ఓ వ్యక్తి. శారీరకంగా వాడుకుని మోహం చాటేశాడు. దీంతోొ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.  ఈ సంఘటన సంతమాగులూరు మండలంలోని మక్కెనవారి పాలెంలో సోమవారం జరిగింది. 

బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి..

పోలీసుల కథనం ప్రకారం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమర్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలీ పనుల కోసం కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆసమయంలో గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యవకుడితో పరిచయం ఏర్పడింది. బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి యువతికి దగ్గరయ్యాడు.  ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ తీసుకుని.. యువతికి మరింత దగ్గరై .. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో సదురు యువతి గర్భం దాల్చింది. ఇది తెలిసి షేక్ బాజీ ఆ అమ్మాయి గర్భాన్ని తీసేయించాడు. ఆ తరువాత యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకుని పోలీసులు సమీపంలోని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

EBC Nestam: రాష్ట్రంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే అగ్రవర్ణంలో పేద మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఆర్థికంగా జగన్ ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

ఈ విధంగా ఈ పథకానికి అర్హులైన మహిళలందరికీ ఈనెల 25వ తేదీ నుంచి 15 వేల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అయితే ఈ పథకానికి కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులుగా ప్రకటించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

కేవలం ఈబీసీ కి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుల అయిన మహిళకు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు బుక్కు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే నెలకు 10 వేల ఆదాయం మించకూడదు పట్టణాలలో 12 వేల ఆదాయం మించకూడదు.

ఈ పథకానికి వీరు అనర్హులు..

ఈ పథకానికి అర్హులు కావాలంటే అభ్యర్థికి మూడు ఎకరాల కన్నా మాగాణి తక్కువగా ఉండాలి అదే విధంగా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. ఇలా భూమి ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Big Boss winner Sunny: వామ్మో.. బిగ్ బాస్ విన్నర్ సన్నీకి వంద కోట్ల కట్నం ఆఫర్ చేసిన మహిళ.. ఎవరంటే?

Big Boss winner Sunny: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పూర్తి అయిన బిగ్ బాస్ సీజన్ 5 ఈ కార్యక్రమంలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన సన్నీ విజేతగా నిలబడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఆయనకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Big Boss winner Sunny: వామ్మో.. బిగ్ బాస్ విన్నర్ సన్నీకి వంద కోట్ల కట్నం ఆఫర్ చేసిన మహిళ.. ఎవరంటే?

ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సన్నీ చివరికి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ షో విజేతగా నిలబడిన ఈయనకు బయటకు వచ్చిన తర్వాత ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఎన్నారై ఉష అనే మహిళ ఏకంగా వీడియో కాల్ చేసింది.ఇలా వీడియో కాల్ చేసిన ఆ మహిళ ఏకంగా తన కూతురిని పెళ్ళి చేసుకోమని కట్నంగా 100 కోట్లు రూపాయలు ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Big Boss winner Sunny: వామ్మో.. బిగ్ బాస్ విన్నర్ సన్నీకి వంద కోట్ల కట్నం ఆఫర్ చేసిన మహిళ.. ఎవరంటే?

ఇలా ఆమె ఆఫర్ విన్న తర్వాత సన్నీ నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి మీరు ఆ మాట అన్నారు చాలా థ్యాంక్స్ అంటూ సమాధానం చెప్పగా సన్నీ మాటలకు సదరు మహిళ నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను అంటూ తెలియజేశారు.

లైవ్ లో పెళ్లి సంబంధం మాట్లాడిన మహిళ:

ఈ విధంగా వీరిద్దరి మధ్య వీడియోకాల్ లో సంభాషణ జరుగుతూ సదరు మహిళ లైవ్ లోనే తన కూతురికి పెళ్లి సంబంధం గురించి సన్నీతో మాట్లాడింది. ప్రస్తుతం ఈ పెళ్లి ప్రపోజల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వీడియోలు తీశారు.. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని అలా చేశారు.

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెన్నో కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఇంట్లో పెద్ద దిక్కు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న కటుంబాలు ఎన్నో ఉన్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

తాజాగా జరిగిన ఘటనలో.. వివాహేత‌ర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహిత‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న బోర‌బ‌డం ప‌రిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని అదే కాలనీకి చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు గమనించాడు.

ఓ రోజు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకపోతే.. ఈ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని భయపెట్టాడు. ఓ రోజు ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెపై ఇస్మాయిల్, యాసిన్ క‌లిసి అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఇలా అతడు ఒక్కసారి కాదు.. పదే పదే ఇలానే చేస్తుండటంతో విసుగిపోయి.. తన ప్రియుడికి వెళ్లి చెప్పింది.

ఇద్దరు కలిసి పొలంలోకి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డారు. వారిద్దరు అలా అపస్మారక స్థితిలో ఉండగా.. స్థానికులు గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవడంతో.. చికిత్స నిర్వహించిన అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. తర్వాత వారిద్దరి పోలీసులు ప్రశ్నించడగా.. విషయాన్ని చెప్పారు. ఆ జంట ఫిర్యాదు మేరకు యాసిన్, ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.