Alekhya: నందమూరి తారకరత్న గత ఏడాది జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర సందర్భంగా ఈయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో దాదాపు 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారక రత్న మరణ వార్త నుంచి అభిమానులు కుటుంబ సభ్యులు ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అలేఖ్య రెడ్డి తరచూ తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.
ఇకపోతే తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఇందులో భాగంగా తన పిల్లలు తన తండ్రి ఫోటో వద్దకు వెళ్లి ఆయనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో విజయ సాయి రెడ్డి రావడంతో పిల్లలు ముగ్గురు వెళ్లి తనని హత్తుకున్నారు.
ప్రేమ వివాహం…
ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబం తనని ఇంటికి దూరం చేశారు. ఇలా భర్తనే సర్వసరంగా బతుకుతున్నటువంటి అలేఖ్య రెడ్డి భర్త మరణంతో ఒక్కసారిగా కృంగిపోయారు. ఇప్పటికీ ఈమె తరుచూ తన భర్త లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతున్నాయి.




























