టాటా గ్రూపు లోన్ తీసుకొనే వారికి టాటా సంస్థ శుభవార్తను ప్రకటించింది.ఈ క్రమంలోనే టాటా డిజిటల్ అతి త్వరలోనే ఒక సూపర్ యాప్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టాటా గ్రూప్ కస్టమర్లకు ఆన్ లైన్ ద్వారా నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు విక్రయించే వెసులుబాటును కల్పిస్తోంది.

టాటా వారు ఈ విధమైనటువంటి కొత్త యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ పేటీఎం, రిలయన్స్ జియో మార్ట్ వంటి వాటికి ప్రత్యక్షంగానే పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోందనీ చెప్పవచ్చు. ఈ విధంగా టాటా గ్రూప్ వారు ఈ యాప్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచడమే కాకుండా ఈ యాప్ ద్వారా రుణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఈ యాప్ ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సర్వీసులు కూడా ఆఫర్ చేయాలని టాటా గ్రూప్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ రుణాలు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ లు అందించే బ్యాంకులతో టాటా గ్రూప్ భాగస్వామ్యం కానుంది. అదేవిధంగా క్రెడిట్ కార్డు అప్లికేషన్స్, మైక్రో లోన్స్, మర్చంట్ మేనేజ్మెంట్ వంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి టాటా గ్రూప్ ప్రయత్నాలను చేస్తోంది.
ఈ విధంగా టాటా గ్రూప్ అందుబాటులోకి తీసుకు వచ్చే ఈ యాప్ ద్వారా నిత్యవసర వస్తువుల నుంచి మందులు ఫ్యాషన్ అప్పరల్ వరకు వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనుంది. చైనాకు చెందిన యాంట్ గ్రూప్ ఈ స్ట్రాటజీని తీసుకువచ్చింది. తర్వాత అమెజాన్, వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్, పేటీఎం వంటి కంపెనీలు ఈ స్ట్రాటజీని అనుసరించాయి.































