తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. ఉన్న మద్యం షాపులకు అదనంగా మరో 200 మద్యం దుఖాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో 2216 మద్యం దుకాణాలకు లైసెన్సులు ముగుస్తున్న నేపథ్యంలో వాటిని వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అదనంగా ఆదాయాన్ని పెంచుకునే క్రమంలోనే మద్యం దుఖానాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

మరో 200 మద్యం దుకాణాలకు లెసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్తగా ప్రభుత్వం మరో 80 బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. పలు కారణాలతో ప్రారంభం కాలేదు. గత ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక్క మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వలేదు. కొత్త మండలాలు, మున్సిపాలిటీల ప్రకారం మద్యం దుకాణాలు తెరవాలని అధికారులు ప్రతిపాదించారు. అదనంగా మరో రూ. 1200 కోట్ల ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఐదు సంవత్సరాల క్రితం వేలంలో అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. ఆ తర్వాతి రెండేళ్లకు జరిగిన వేలంలో ఆ ఫీజును రూ.లక్ష చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని రూ.3లక్షలు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది అని తెలిసింది. ప్రస్తుతం అబ్కారీ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9 వేలకోట్ల ఆదాయం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ఫీజు కూడా పెంచబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ఫీజు రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, రూ.80 లక్షలు, రూ.1.20 కోట్లతో నాలగు స్లాబులతో ఉంది. దానిని 5 శాతం నుంచి మరో 8 శాతం వరకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఎక్కడైతే వేడుకలు, పండుగలు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో.. అలాంటి వాటి చోట కొత్తగా మద్యం దుకాణాలను తెరవాలని కొందరు కోరుతున్నారు.































