తెలంగాణను చలి వణికిస్తోంది.. మీరు విన్నది నిజమే.. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.2 డిగ్రీలు గా నమోదు కాగా, గిన్నేధరిలో 7.9 డిగ్కారీలుగా నమోదయింది. అదే విధంగా కామారెడ్డి జిల్లా డొంగ్లీ లో 8.6 డిగ్రీలుగా నమోదయింది. ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారి.































