కొన్ని కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు ఏ మాత్రం క్లూ దొరకకుండా ఉంటాయి. అటువంటి సమయంలో వాళ్లు ముందుగా సీసీ కెమెరాల్లో నేరానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూస్తారు. అయినా ఇంకా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అటువంటి సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటారు.

అయినా నేరస్తుల వివరాలు దొరక్కపోతే డాగ్ స్క్వాడ్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ఈ డాగ్స్ పోలీసుల పర్యవేక్షణలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటాయి. నేర పరిశోధనలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఓ శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకుంది. అవును మీరు విన్నది నిజమే..
గుజరాత్ లోని వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్లోని శునకం 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను.. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన వారిని ఆ శునకం పట్టుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట ఆ డాగ్ కు నిందితులు పారిపోయిన దిశను చూపించారు. దాన్ని పసిగటట్టిన ఆ డాగ్.. దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తి.. అక్కడ ఓ టెంట్ వద్ద ఆగింది.
అక్కడ ఆ డాగ్ మొరగడం మొదలు పెట్టింది. డాగ్ తో పాటు వచ్చిన స్క్వాడ్ అక్కడే ఉన్న రేపిస్టులను పట్టుకున్నారు. ఇలా వారికి నేరస్థులను పట్టుకోవడంలో డాగ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇలా ఆ రేపిస్టులను పట్టుకోవడంలో ఉపయోగపడిన డాగ్ పేరు ‘జావా’ అని పోలీసులు పేర్కొన్నారు.































