Big Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరో రోజులో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి విజేత ఎవరు అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు బిగ్ బాస్ ట్రోఫీను ఆడపులిగా పేరు సంపాదించుకున్న బిందుమాధవి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమం మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్నటువంటి బిందు మాధవి అఖిల్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో విజేతగా బిందు మాధవి నిలవగా రన్నర్ గా అఖిల్ నిలిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్త కనుక నిజమైతే బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ టైటిల్ అందుకున్న లేడీ కంటెస్టెంట్ గా బిందుమాధవి పేరు నిలిచిపోతుంది. ఇప్పటివరకు బుల్లి తెర పై ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకుంది.

ఈ ఐదు సీజన్లలో కూడా అబ్బాయిలే విజేతగా నిలవడం గమనార్హం. మొదటి సీజన్లో శివబాలాజీ, రెండవ సీజన్ కౌశల్, మూడవ సీజన్ రాహుల్ , అభిజిత్, సన్నీ ఇలా వరుసగా అబ్బాయిలే బిగ్ బాస్ విన్నర్ గా నిలబడ్డారు. అయితే మొదటి సారి ఈ కార్యక్రమాన్ని తెలుగు ఓటీటీ లో ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిందుమాధవి అఖిల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

తొలిసారి మహిళా విన్నర్…
ఈ పోటీల్లో భాగంగా బిందు మాధవి విన్నర్ గా నిలబడగా, అఖిల్ రన్నర్ గా నిలబడ్డారు. మూడో స్థానంలో శివ, నాలుగో స్థానంలో బాబా భాస్కర్, ఐదవ స్థానంలో అరియానా ఉన్నట్టు సమాచారం.ఇక మరి కొన్ని గంటలలో ఈ ఉత్కంఠతకు తెరపడి అసలు విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారు.































