కేవలం ఒక మద్యం బాటిల్ కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దర్యప్తుకు ఆదేశించింది. సాధారణంగా ఒక దేశానికి చెందిన మంత్రులు, అధికారులు ఇతర దేశాల్లో పర్యటిస్తారనే విషయం తెలిసిందే. అయితే అక్కడ వారికి అభిమానంతో రకరకాల బహుమతులు ఇస్తుంటారు.

ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియోకు విదేశీ పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వ అధికారులు సుమారు రూ.4 లక్షలు విలువ చేసే ఓ మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆ మద్యం బాటిల్ కనిపించకుండా పోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. జపాన్ ప్రభుత్వ అధికారులు మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సమయంలో మైక్ పాంపియో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారని, ఆ వైన్ సీసాను అతను నేరుగా తీసుకున్నారా? లేదా అనే విషయం మీద స్పష్టత లేదని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది.
అయితే అమెరికాలో ఓ నిబంధన ఉంది. అదేంటంటే.. 390 డాలర్ల కంటే తక్కువ విలువ చేసే బహుమతులను తీసుకున్నప్పుడు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకుమించి విలువైన వస్తువును బహుమతిగా తీసుకుంటే మాత్రం అమెరికా చట్టాల ప్రకారం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ట్రంప్ హయాంలో మాత్రం ఆ మద్యం బాటిల్ కు డబ్బులు చెల్లించినట్టు ఎక్కడా పేర్కొనలేదు. దీనికి తోడు ప్రస్తుతం ఆ వైన్ బాటిల్ కూడా కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఆ మద్యం బాటిల్ దొరకుతుందో.. లేదో…































