వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప పులివెందుల లో అనుమానితులను సిబిఐ అధికారులు విచారస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ లను అధికారులు విచారించారు.

కాగా ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరని విచారించిన అధికారులు.. పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి ని సైతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కస్టడీలో ఉన్న డ్రైవర్ సునీల్ కలవడానికి తన కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు

































