ప్రస్తుత కాలంలో ఒకరి భార్య మరొకరికి భర్తతో మరొకరి భార్య వేరొకరి భర్తతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉండటం వల్ల రోజుకు ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజమహేంద్రవరంలోని బొమ్మూరు బత్తిన నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నగరంలోనీ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వీరి పక్క వాడలో నివసిస్తున్న అటువంటి రమేష్ అనే వ్యక్తితో దుర్గాప్రసాద్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి దుర్గాప్రసాద్ కు తెలిసింది.
ఈ క్రమంలోనే తన భార్య గురించి తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు.ఈ క్రమంలోనే తన భార్య పిల్లలను తన పుట్టింటికి పంపించిన దుర్గాప్రసాద్ ఎలాగైనా రమేష్ ను హత్య చేయాలని భావించాడు. దుర్గా ప్రసాద్ పథకం ప్రకారమే మరొక ఇద్దరి సహాయంతో రమేష్ హత్యకు ప్లాన్ వేశారు.
ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్దకు రాగానే కత్తితో అతనిపై దాడి చేసి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అప్పటికే రమేష్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇక హంతకులు ఎవరు అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తూ ఆ రోజు సాయంత్రానికి హంతకుడు దుర్గా ప్రసాద్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
































