Tollywood Directors: ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే ఆ సినిమా విషయంలో దర్శకుడిది కీలకపాత్ర అని చెప్పాలి.ఇలా దర్శకుడు సినిమా విషయంలో అన్ని తానే వ్యవహరిస్తూ సినిమాని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇలా సినిమాను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించే డైరెక్టర్లకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తారు అనే విషయానికి వస్తే..ఈ ఏడాదిలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి టాప్ 10 డైరెక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
సురేందర్ రెడ్డి: ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి సురేందర్ రెడ్డి తాజాగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సురేందర్ రెడ్డి ఒక్కో సినిమాకు ఐదు నుంచి పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
సందీప్ రెడ్డి వంగ: అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ బిజీ డైరెక్టర్ గా మారిపోయారు.
Advertisement
పరశురామ్: గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి పరశురామ్ తాజాగా సర్కారు వారి పాట సినీమాతో హిట్టు కొట్టారు. ఈయన కూడా ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
బోయపాటి శ్రీను: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి తాజాగా బాలకృష్ణతో అఖండ సినిమా ద్వారా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈయన రామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బోయపాటి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
అనిల్ రావిపూడి: పటాస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
Advertisement
వంశీ పైడిపల్లి: తాజాగా వారసుడు సినిమాతో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
కొరటాల శివ: అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల ఆచార్య సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందారు. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
Tollywood Directors:
త్రివిక్రమ్ శ్రీనివాస్: మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 35 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
సుకుమార్: పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఇండస్ట్రీలో బిజీ డైరెక్టర్గా మారిపోయారు. ఈయన ఒక్కో సినిమాకు 40-50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని టాక్. ఇక ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
Advertisement
రాజమౌళి: తెలుగు సినిమా సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసినటువంటి లెజెండరీ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇప్పటివరకు ఇండస్ట్రీలో అపజయం మెరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.