Connect with us

Featured

ఈ హీరోల కంటే వారి భార్యల సంపాదన ఎక్కువని తెలుసా..!?

Published

on

చాలామందికి స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ తెలిసి అమ్మో.. అంత సంపాదన ఉంటుందా.. అంటూ తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు. కానీ వాళ్ల కంటే ఎక్కువగా కొంతమంది స్టార్ హీరోల భార్యలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించే వాళ్ల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. కాలం గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు ఇల్లాలు వంటింట్లోనే పరిమితం అయ్యేది.. కానీ ప్రస్తుతం అలా లేదు. పేకట పేకాటే.. బామ్మర్ది.. బామ్మర్దే అన్నట్ల.. ఇటు ఇంట్లో పని చేసుకుంటూనే అటు సంపాదించే మహిళలు చాలా మంది ఉన్నారు.

రామ్ చరణ్ వరస సినిమాలు చేస్తూ సినిమాలకి రూ.కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకుంటుంటే తన భార్య ఉపాసన అపోలో చారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి. పాజిటివ్ కి మ్యాగజిన్ చీఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆమె సంపాదన రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా తన భర్త కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజిన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉంటూ.. తన తండ్రి సెయింట్ ఇన్స్టిట్యూట్ బిసినెస్ కూడా చూసుకుంటారు. నాచురల్ స్టార్ నాని సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అతడు నిర్మాతగా మారిన విషయం కూడా తెలిసిందే. అయితే నాని భార్య అంజనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి అర్.కే. మీడియా లో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

బాహుబలి సినిమాకి కూడా అంజనా డిజైనర్ గా పని చేసారు. ఇలా ఆమె నాని కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఒకప్పటి హీరో గా వెలుగు వెలిగిన అల్లరి నరేష్ కి ఇపుడు పెద్దగా సినిమాలు లేవు. గతంలో సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తే ప్రస్తుతం ఆ అవకాశాలు తగ్గాయనే చెప్పొచ్చు. ఇక తన భార్య విరూప వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఈవెంట్ మ్యానేజర్ గా రూ. లక్షల్లో సంపాదిస్తుంది. డైరెక్టర్ గా మారియు యాక్టర్ గా మెప్పించిన రాహుల్ రవీందర్ తెలుగు లో తమిళ్ లో సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఆయన భార్య చిన్మయి సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తన భర్త కన్నా ఇంకా ఎక్కువగా సంపాదిస్తుంది.

Advertisement

తెలుగులో సమంతకి డబ్బింగ్ చెప్పేది చిన్మయి అని మనకి తెలుసు. ఆమె ఒక సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. ఎంతో బిజీగా ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నాగచైతన్య సంవత్సరానికి ఒక సినిమానే చేస్తుంటే అయినా భార్య హీరోయిన్ సమంత మాత్రం తెలుగు మురియు తమిళంలో సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాలతో అదరకొడుతుంది. కొన్ని యాడ్స్ షోస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్య కంటే ఎక్కువ సంపాదిస్తుంది సమంత. ఆమె సొంతంగా క్లాత్ స్టోర్ కూడా రన్ చేస్తుంది.

ఇక యాంకర్ సుమ గురించి చెప్పాల్సిన అవరం లేదు. ఆమె యాంకరింగ్ తో పాటు.. పలు యాడ్స్ ల్లలో కూడా నటిస్తూ.. రాజీవ్ కనకాల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. రాజీవ్ కనకాల గతం లో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలే చేస్తున్నాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే.. మహేశ్ బాబు కంటే.. నమ్రత పలు వ్యాపారాలను మొదలు పెట్టి అతడి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. హీరో నందు సినిమాలు చేస్తుంటే భార్య గీత మాధురి పాటలు పడుతూ భర్తతో సమానంగా గా సంపాదిస్తుంది.

Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!