AP politics: ఏపీ పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ కూడా తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి అంటూ చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లను ప్రజల సేవకు దూరం చేశారని వైసిపి ఆరోపణలు చేసింది. ఇలా ఏపీ రాజకీయాలలో వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి.

ఇకపోతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 లకు ఒక వాలంటీర్లను నియమిస్తూ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఈయన వాలంటీర్స్ సేవలకు గాను గౌరవ వేతనంగా 5000 రూపాయలు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని అయితే వారికి పదివేల రూపాయల జీతం పెంచుతానని ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తెలిపారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పడంతో పెద్ద ఎత్తున వాలంటీర్ లు టిడిపిలోకి వలసలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఏకంగా 40 మంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
టీడీపీలోకి వాలంటీర్లు..
వచ్చే ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందని భావించినటువంటి ఎంతోమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అయితే కూటమి అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వేతనం ఇస్తారని ప్రకటించడంతో వాలంటీర్లు కూడా తమ పార్టీలోకి వస్తున్నారని ఇలా వారు తమ పార్టీలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.



























