Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇలా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కాళ్ళకూరు. అయితే ఈయన అప్పుడప్పుడు తన సొంత గ్రామానికి వెళుతూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఉన్నఫలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యతో కలిసి సొంత గ్రామానికి వెళ్లారు.

ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తన సొంత గ్రామమైన కాళ్ళకూరు వెళ్లడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు తమ సొంత గ్రామానికి వెళ్లారని తెలుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా త్రివిక్రమ్ దంపతులు సొంత గ్రామానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

ఇకపోతే త్రివిక్రమ్ దంపతులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి వెళ్ళగా ఆలయ పండితులు ఈ దంపతులను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ దంపతులను సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఇకపోతే ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా ఇలా తమ సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మొదటిసారి పాన్ ఇండియా సినిమా నిర్మించబోతున్న త్రివిక్రమ్…
ఇకపోతే తాను ప్రతిఏటా స్వామి వారి దర్శనార్థం తన సొంత గ్రామానికి వస్తానని ఈ సందర్భంగా త్రివిక్రమ్ పేర్కొన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన శ్రీనివాస్ ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి దర్శక పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది ఈ సినిమా ఆగస్టు 2వ వారం నుంచి షూటింగ్ పనులు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.



































