కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు ట్యిట్టర్ సంస్థ ప్రకటించింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనలో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బయటపెట్టారని పలువురు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.

బుధవారం అత్యాచారం, హత్య గురైనా ఓ చిన్నారి తల్లిదండ్రులను రాహుల్ పరామర్శించారు. తర్వాత వారి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “తల్లిదండ్రులు ఆవేదన అర్థమవుతుంది. వారి కూతురు భారత మాత ముద్ద బిడ్డ. బాధితులకు న్యాయం జరగాలి. అంతవరకు వారి తరపున పోరాటం చేస్తామని” పేర్కొన్నారు.



































