ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.తాము ఎక్కడ కరోనా బారినపడతామేమోనని అపోహలతోనే కొందరు ప్రాణాలు వదులుతున్నారు.మరి కొందరు మాత్రం మన శరీరంలో వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఈ విధంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ప్రచారం జరుగుతోంది. దీనినే ఆసరాగా చేసుకొని ఎంతోమంది వ్యాపారులు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. గత కొద్ది రోజుల వరకు కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి మెరుగుపడాలంటే చికెన్ తినాలనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోని చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా చికెన్ బిర్యాని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఓ బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు సరికొత్త ప్రచారానికి తెర లేపాడు.ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చికెన్ బిర్యాని అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీ చూచిన నెటిజన్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చికెన్ బిర్యానీలో వ్యాక్సిన్ కలిపారా? నిజమా? కరోనాకు మందు ఈ చికెన్ బిర్యానీ నేనా, ఇది మరో లెవెల్ మార్కెటింగ్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.































