Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్డౌన్లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్తో సత్కరించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు, అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ రావడం గర్వ కారణం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తనను ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్ లు కూడా చేశారు. అందులో భాగంగానే మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది.
మామయ్యకు అభినందనలు తెలిపిన ఉపాసన..
మామయ్య చిరంజీవికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ డియరెస్ట్ మామయ్య అంటూ పద్మ విభూషణ్కు అవార్డులు పొందిన వారి లిస్ట్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్కు అభినందనలు చెబుతున్నారు. ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయిత్వ ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






























