Venkaiah Naidu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా అలాగే రాజకీయాలలో పేద ప్రజల కష్టం తెలిసిన నేతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు దివంగత నందమూరి తారకరామారావు గురించి అందరికీ సుపరిచితమే. చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయాలలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎన్టీఆర్ వెన్నుపోటు కారణంగా బలైపోయారు.

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్రతమానం రేపుతున్నాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాలలో కూడా విప్లవం తీసుకొచ్చిన మహా నాయకుడు అంటూ కామెంట్స్ చేశారు.
పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచిన మహనీయుడు ఎన్టీఆర్. ఇక అప్పటివరకు వంటింటికి పరిమితమైన మహిళలను కూడా రాజకీయాలలోకి రాణించే విధంగా ప్రోత్సహించారని ఈయన తెలిపారు. అయితే ఎన్టీఆర్ ఒకసారి నాతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఒక ఆరుగురు మహిళలు వచ్చి ఆయనకు పాదాభివందనాలు చేసి వెళ్లారని నేను ఎన్టీఆర్ గారిని ప్రశ్నించగా ప్రేమ అభిమానంతో వాళ్ళు అలా చేస్తుంటారని ఆయన చెప్పారు.

Venkaiah Naidu: ఎన్టీఆర్ వెనుక జరుగుతున్న కుట్ర కూతంత్రాల గురించి ఆలోచించలేదు…
ఇలా ఎన్టీఆర్ చెప్పేసరికి నాకు ప్రేమ, అభిమానం కనిపించలేదు కానీ చివరికి ఆ ఆరుగురే ఆయన వెన్నుపోటుకి కూడా కారణమయ్యారని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలిపారు.ఎన్టీఆర్ గారు తన వెనుక జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలు గురించి గమనించకపోవడం వల్లే తాను వెన్నుపోటుకు గురయ్యారని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవంలో భాగంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




























