Venkatesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికి ఎన్నో నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇక అప్పట్లో ఇండస్ట్రీలో రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నేర్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈయన తరువాత సురేష్ బాబు ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇకపోతే ఓ నిర్మాత కుమారుడిగా సురేష్ బాబు నిర్మాతగా మారగా వెంకటేష్ మాత్రం హీరోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ విధంగా వెంకటేష్ హీరోగా మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన కూడా నిర్మాతగా ఒక సినిమా చేశారనే విషయం చాలా మందికి తెలియదు.
వెంకటేష్ కు సీనియర్ నటుడు నటభూషణ్ శోభన్ బాబు అంటే అమితమైన ప్రేమ ఇష్టం. ఈ క్రమంలోనే వెంకటేష్ వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి శోభన్ బాబు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా ఎంకి – నాయుడు బావ అనే సినిమాని నిర్మించారు.
ఇలా ఈ సినిమా నిర్మించే సమయంలో వెంకటేష్ వయసు 18 సంవత్సరాలు మాత్రమే.ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది..రామా నాయుడు సమర్పణలో వచ్చిన ఈ ఫిలిం సినిమా స్కోప్ – ఈస్ట్మన్ కలర్లో రూపొందించారు. గుమ్మడి, కాంతారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి వారు నటించారు.

Venkatesh: వెంకటేష్ నిర్మించిన ఏకైక చిత్రం…
ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నత చదువులు చదువుతూ నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన తరువాత వెంకటేష్ ఎలాంటి సినిమాలను నిర్మించలేదు.































