Venu Madhav: తెలుగు తెరపై కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా ఎన్నో సినిమాలలో నటించి సందడి చేసిన వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో 2019 సెప్టెంబర్ 25వ తేదీ మరణించారు.

ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో 2013 నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వేణుమాధవ్ 2019లో మరణించారు. తాజాగా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వేణుమాధవ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వేణుమాధవ్ కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని ఈ ముగ్గురిలో తను చాలా చురుగ్గా ఉండేవారిని తెలిపారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన వేణుమాధవ్ కు అసిస్టెంట్లుగా తన ఇద్దరు అన్నయ్యలు నియమించానని తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదేనని తెలిపారు.వేణుమాధవ్ కు అసిస్టెంట్లుగా ఉన్నటువంటి తన అన్నయ్యలు ఇండస్ట్రీలో ఎదగలేకపోయారని ఈమె తెలిపారు. వేణుమాధవ్ కు ఒక చెడ్డ అలవాటు ఉంది. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వేసుకునే అలవాటు ఆయనకు లేదు.

Venu Madhav: సొంత ఇల్లు ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నా…
ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడిన మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేసేవాడు. ఇలా ఈ నిర్లక్ష్యమే తన ప్రాణలను తీసిందని వేణుమాధవ్ తల్లి బాధపడ్డారు. వేణుమాధవ్ కు సొంత ఇల్లు ఫ్లాట్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో వేణుమాధవ్ కొడుకులను నివసిస్తున్నారని తాను మాత్రం అద్దె ఇంట్లో నివసిస్తున్నానని వేణుమాధవ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.































